ఇంద్ర‌వెల్లి దండోరా.. రేవంత్‌రెడ్డి గ‌ర్జ‌న‌.. కాస్కో కేసీఆర్‌..  

క్విట్ ఇండియా మ‌ర్నాడే.. క్విట్ కేసీఆర్ స‌మ‌రశంఖాన్ని పూరించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇంద్ర‌వెల్లి ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌తో గులాబీబాస్‌కు రేవంత్ స‌త్తా తెలిసొచ్చేలా చేశారు. ఉద‌యం నుంచి ఒక‌టే హంగామా. బండెన‌క బండి క‌ట్టి.. ఇంద్ర‌వెల్లికి దండు క‌ట్టి.. ద‌ళితులు, గిరిజ‌నుల ప‌క్షాన దండోరా మోగించారు. కేసీఆర్ కుట్ర‌లు, కుతంత్రాల‌ను చీల్చి చెండాడుతున్నారు.  అది స‌భ కాదు. జ‌న ప్ర‌భంజ‌నం అనేలా భారీ ఏర్పాట్లు. కాంగ్రెస్ ప్ర‌ముఖులంతా త‌ర‌లివ‌చ్చే త‌రుణం. పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి స‌త్తాకు నిద‌ర్శ‌నం. 18 ఎక‌రాల స్థ‌లం. ల‌క్ష మంది జ‌నం. లెక్క పెట్టుకో కేసీఆర్‌.. ఒక్క‌రు త‌క్కువైనా దేనికంటే దానికి సై.. అంటూ ముందే స‌వాల్ చేశారు చిచ్చ‌ర‌పిడుగు. అన్న‌ట్టుగానే.. అన్ని జిల్లాల నుంచి.. జ‌నం.. చీమ‌ల‌దండులా క‌దిలారు.   హైద‌రాబాద్ నుంచి ర్యాలీగా రేవంత్‌రెడ్డి. దారిపొడువునా జ‌న జాత‌రే. జై కాంగ్రెస్‌.. జై రేవంత్‌.. నినాదాలే. అడుగ‌డుగునా కాంగ్రెస్ జెండా రెప‌రెప‌లే. కాంగ్రెస్‌లో మునుపెన్న‌డూ చూడ‌ని ఉత్సాహం. గ‌త వైభ‌వం దిశ‌గా హ‌స్తం పార్టీ అడుగులు.  ఇంత‌టి జోష్‌ రేవంత్‌రెడ్డి వ‌ల్లే సాధ్యం.   ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజే కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ. ద‌ళిత‌బంధుతో కేసీఆర్ చేస్తున్న రాజ‌కీయ డ్రామాకు దండోరాతో దుమ్ముదులిపేయ‌నున్నారు రేవంత్‌రెడ్డి. జీతాల‌కే డ‌బ్బులు లేక భూములు అమ్ముకున్న స‌ర్కారు.. ల‌క్ష కోట్ల‌తో రాష్ట్రంలోని ద‌ళిత కుటుంబాల‌న్నిటికీ 10 ల‌క్ష‌లు ఇస్తారంటే ఎవ‌రైనా న‌మ్ముతారా? ద‌ళితుడికి డిప్యూటీ సీఎం, ద‌ళితుల‌కు 3 ఎక‌రాల భూమి.. లానే ద‌ళిత బంధును రాజ‌కీయ ప‌బ్బం కోసం వాడుకుంటున్నార‌నే విష‌యాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డానికే ఈ ద‌ళిత దండోరా. తెలంగాణ‌లో ద‌ళితులు మాత్ర‌మే ఉన్నారా? పాపం.. గిరిజ‌నులు,. అభంశుభం తెలీని అడ‌వి బిడ్డ‌ల.. దుస్థితి అంత‌క‌న్నా దారుణం. వారి అభివృద్ధి మాటేంటి? పోడు భూములు స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మేంటి? తెలంగాణ‌లో గిరిపుత్రుల‌ను ఆదుకోరా? వారి అభ్యున్న‌తికి కృషి చేయ‌రా? అందుకే గిరిజ‌న దండోరా. ఇంద్ర‌వెల్లి గ‌డ్డ మీద నుంచి.. రేవంత్‌రెడ్డి చేస్తున్న ద‌ళిత‌-గిరిజ‌న దండోరా. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చేలా.. కేసీఆర్‌ను బ‌య‌ట‌కు గుంజేలా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంద్ర‌వెల్లి వేదిక‌గా స‌మ‌ర‌శంఖం పూరిస్తున్నారు. ద‌ళిత గిరిజ‌న దండోరాతో గులాబీ బాస్‌లో గుబులు రేపుతున్నారు. ల‌క్ష‌.. అక్ష‌రాల ల‌క్ష మంది జ‌నంతో.. ఇంద్ర‌వెల్లి.. ఈ రాజకీయ ఇంద్రుడి స‌త్తాకు సాక్షంగా నిలుస్తోంది. జ‌నాన్ని లెక్కేసుకో కేసీఆర్‌.. రేవంత్‌రెడ్డి దెబ్బ‌ను కాస్కో కేసీఆర్‌..

నంద్యాలలో జర్నలిస్ట్ దారుణ హత్య.. అవినీతిని వెలికితీయడమే పాపమా? 

ఆంధ్రప్రదేశ్ లో మరో అరాచకం జరిగింది. ప్రశ్నించే గొంతుక దారుణ హత్యకు గురైంది. కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో  కిరాతకం హత్య జరిగింది. యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది.  మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్న వివరాల  ప్రకారం కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్‌ కానిస్టేబుల్‌ సుబ్బయ్యకు సంబంధాలు ఉన్నాయని బయటపెట్టారట. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రచారం జరగ్గా.. జిల్లా ఎస్పీ కానిస్టేబుల్‌ సుబ్బయ్యను సస్పెండ్‌ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న కానిస్టేబుల్ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్‌ కాలనీలోని ఆటోస్టాండ్‌ వద్దకు పిలిపించారట. కేశవ తోటి రిపోర్టర్‌ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని ఓ గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్‌ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ చనిపోయాడు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు గుర్తించారు. కానిస్టేబుల్‌ అవినీతిని బట్టబయలు చేసిన విలేకరిని హత్య చేశారని జర్నలిస్ట్‌ సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ అన్నారు. కర్నూలు జిల్లా  నంద్యాలలో  జరిగిన రిపోర్టర్ కేశవ్ హత్య ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు డి‌జి‌పి గౌతమ్ సవాంగ్. హత్య కు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ కి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ తో పాటు  హత్య తో ప్రమేయం ఉన్న అందరినిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఏపీ డి‌జి‌పి.  

సీఐ మూతి ప‌గ‌ల‌గొట్టిన మందుబాబులు! చ‌ర్య‌ల‌కు ఖాకీలు వెన‌క‌డుగు?

ఖాకీ డ్రెస్ వేసుకుంటే అదో ప‌వ‌ర్‌. వెయ్యి ఏనుగులంత బ‌లం. త‌మ‌కు ఎదురు లేద‌నే ధైర్యం. ఎదుటివారిని లెక్క‌చేయ‌ని టెంప‌ర్‌. అంత ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌నే మూతి ప‌గిలేలా కొట్టారంటే మాట‌లా? కొట్ట‌డ‌మే త‌ప్ప‌.. కొట్టించుకునే అల‌వాటు లేని కాప్స్.. ఇంత పెద్ద విష‌యాన్ని ఊరికే వ‌దిలేస్తారా? అంటే, వ‌దిలేశారు మ‌రి. మామూలుగా అయితే ఇలాంటి సీన్ల‌లో పోలీసుల‌ను కొట్టినోళ్ల తాట తీస్తారు. కేసులు పెట్టి.. స్టేష‌న్లో వేసి.. సీసీకెమెరాలు ఆఫ్ చేసి.. లాఠీల‌తో కుమ్మేస్తారు. రోక‌లిబండ ఎక్కిస్తారు. అని అంటుంటారు. కానీ, ఈ కేసులో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఏకంగా సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ స్థాయి అధికారి పెద‌వులు ప‌గిలేలా ముఖంపై కొట్టిన వారిపై ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌లేద‌ని అంటున్నారు. వారిని అదుపులోకి తీసుకోవ‌డం కానీ, వారిపై ర‌క‌ర‌కాల కేసులు పెట్ట‌డం కానీ చేయ‌లేదు. చివ‌రాఖ‌రికి అస‌లు ఆ విష‌య‌మే జ‌ర‌గ‌న‌ట్టు.. త‌మ సీఐని ఎవ‌రూ కొట్ట‌లేద‌న్న‌ట్టు.. మేట‌ర్‌ను చాలా సీక్రెట్‌గా మెయిన్‌టెన్ చేస్తున్నారు. మీడియా ఉందిక‌దా.. అందుకే విష‌యం ఆఫ్‌ది రికార్డ్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ సీఐని కొట్టినోళ్ల‌పై చ‌ర్య‌లెందుకు తీసుకోవ‌డం లేదంటే..... శుక్ర‌వారం. అర్థ‌రాత్రి. మాదాపూర్‌లోని ఓ ప్రాంతం. వీకెండ్ క‌దా.. అందుకే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీలు చేస్తున్నారు. అంత‌లోనే ఓ రేంజ్‌ రోవర్‌ కారు అటువైపుగా వేగంగా దూసుకొచ్చింది. పోలీసులు ఆ కారును ఆపే ప్ర‌య‌త్నం చేశారు. అందులో వారు స‌డెన్ బ్రేక్ వేసి.. కారును రివ‌ర్స్‌లో వెన‌క్కి తీసుకెళ్లేందుకు ట్రై చేశారు. అస‌లే సైబ‌రాబాద్ పోలీసులు క‌దా.. డ్రంకెన్ డ్రైవ్‌లో ఫుల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. అందుకే ఆ రేంజ్ రోవ‌ర్ కారు ప‌ప్పులేమీ ఉడ‌క‌లేదు. రివ‌ర్స్‌లో వెళ్తున్న కారుకు పోలీస్ వెహికిల్స్ అడ్డుపెట్టి మ‌రీ ఆపేశారు. కారులో ఉన్న ఇద్దరికి బ్రీత్‌ అనలైజర్ టెస్ట్ చేయ‌బోయారు. అందుకు వారు నిరాక‌రించారు. ఒక్క‌సారిగా పోలీసుల‌పై రెచ్చిపోయారు. మమ్మల్నే ఆపుతారా? మేము ఎవ‌ర‌మో తెలుసా? మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్‌ చేస్తే మీ బతుకులు బజారున పడతాయంటూ ఓవ‌రాక్ష‌న్ చేశారు. అక్క‌డితో ఆగ‌లేదు ఆ మందుబాబులు. మ‌రింత రెచ్చిపోయారు. పోలీసుల‌పైనే అటాక్ చేశారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారు. ముఖంపై పిడిగుద్దులు గుద్ద‌టంతో సీఐకి గాయాల‌య్యాయ‌ట‌. పెదాలు ప‌గిలాయ‌ని అంటున్నారు.  విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనపై దాడికి పాల్పడిన ఇద్దరిపై బాధిత‌ ఇన్‌స్పెక్టర్‌.. మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశార‌ని తెలుస్తోంది. అయితే.. ఈ కేసుపై పోలీసులు ఎలాంటి యాక్ష‌న్ తీసుకోవ‌డం లేదు. సీఐని కొట్టినా నిందితుల‌పై వ‌దిలేశార‌ని తెలుస్తోంది. ఓ సీఐపై దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదు? పెదవులు పగిలేలా కొట్టినా ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారు?  సీఐని కొట్టిన వారిలో ఒకరు సివిల్‌ కాంట్రాక్టర్‌ కాగా మరొకరు వైద్యుడు. ఈ ఇద్ద‌రిలో ఒకరు పోలీస్‌ శాఖలో పనిచేసే సీనియర్‌ అధికారికి బంధువని అంటున్నారు. ఆ బాస్ ఫోన్ చేయ‌డం వ‌ల్లే.. ఆ ఇద్ద‌రు ఓవ‌రాక్ష‌న్ గాళ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. పైనుంచి ఆదేశాల మేర‌కే.. విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచారు. అసలు కేసు నమోదయిందా లేదా? నిందితులను అరెస్ట్‌ చేశారా, లేదా? అనే వివ‌రాలు కూడా చెప్ప‌డం లేదు పోలీసులు. సీఐనే మూతిప‌గిలేలా కొట్టిన మందుబాబుల తాట తీయాల్సింది పోయి.. ఇలా ఉన్న‌తాధికారుల‌కు చుట్ట‌మ‌నే కార‌ణంతో వ‌దిలేయ‌డం దారుణం అంటున్నారు. 

ఒక పార్టీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించాం.. హెడ్ కానిస్టేబుల్ కామెంట్ల కలకలం..

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించింది వైసీపీ. నిజానికి 150కి పైగా అసెంబ్లీ వచ్చాయంటే వైసీపీ నేతలు కూడా నమ్మలేని పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఏపీ ఫలితం సంచలనమైంది. అదే సమయంలో ఎన్నికలపై అనేక అనుమానాలు వచ్చాయి. అప్పుడు టీడీపీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న బీజేపీ... ఏదో మాయ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేశారని కొందరు బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల సంఘం వైసీపీకి అనుకులంగా నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు కూడా వచ్చాయి. పోలీస్ శాఖ కూడా అక్రమాల్లో పాలు పంచుకుందని టీడీపీ నేతలు ఆరోపించారు. 2019 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. శాఖలోని కొందరి సహకారంతో తపాలా ఓట్ల వివరాలను సేకరించి ఓ పార్టీకి ఇచ్చామంటూ ప్రకాశం జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హెడ్ కానిస్టేబుల్ కామెంట్లతో ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు బలపడుతున్నాయి.  ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో జులై 30న ఒంగోలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించిన కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి ప్రణీత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సమావేశంలోనే ఇతర అధికారుల సమక్షంలోనే హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తపాలా బ్యాలెటు ఓట్ల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనతోపాటు మల్లారెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారావు, వేణు, హోంగార్డు కిషోర్, ఓ మహిళా కానిస్టేబుల్ కలిసి జిల్లా వ్యాప్తంగా 700కుపైగా పోస్టల్ బ్యాలెట్ల వివరాలు సేకరించి పార్టీకి ఇచ్చామని, తమ కృషిని గుర్తించి మేలు చేయాలని కోరారు.   అంతేకాదు గత త ప్రభుత్వంలో ఉన్న వారే ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారని చెప్పిన  వెంకటరెడ్డి.. ఈ విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, మీరైనా న్యాయం చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు. ఒకే పార్టీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించాంటూ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో  స్పందించిన జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అతడిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపుతూ  ఉత్తర్వులు జారీ చేశారు.

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా? 

తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా  హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికపై  నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలన్ని అక్కడే మోహరించాయి. ఇక్కడి నుంచి గత ఆరు ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పోటీ పడబోతున్నారు. గతంలో కారు గుర్తుపై గెలిచిన ఈటల.. ఈసారి మాత్రం బీజేపీ కమలం పువ్వు గుర్తుతో బరిలో ఉండబోతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను సవాల్ తీసుకుంటున్న అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాని ప్రచారం మాత్రం ముమ్మరంగా చేస్తోంది. అభ్యర్థితో సంబంధం లేకుండానే.. నాగార్జున సాగర్ తరహాలో గులాబీ లీడర్లు గ్రామాలు చుట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కారెక్కారు. దీంతో ఆయనే అధికార పార్టీ అభ్యర్థి అవుతారని ప్రచారం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడంతో హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది.  అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది.  దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ కోసమే వెలుగులోకి తెచ్చారని ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో 45 వేలకు పైగా దళిత ఓటర్లున్నారు. అందుకే ఆ సామాజిక వర్గానికి కేసీఆర్ ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.అధికార పార్టీ అభ్యర్థి మాత్రం బీసీ వర్గం నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్, వకుళాభరణం ఎల్.రమణ పొనగంటి మల్లయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీలకు ఇవ్వాలనుకున్నా పెద్దిరెడ్డి మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న పాడి ఉదయానందరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. హుజురాబాగ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నియోజకవర్గంపై ఫోకస్ చేయగా కాంగ్రెస్ వెనకబడింది. ఈటల కోసమే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో హుజురాబాద్ ఉప ఎన్నికను కాంగ్రెస్ కూడా సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. కేసీఆర్ దళిత బంధుకు కౌంటర్ గా ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిందట. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర్ రాజనర్సింహా పేరు అనుకున్నా ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరును పరిశీలిస్తున్నారట.  టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటిస్తే.. బీసీనే పోటీకి దింపాలని పీసీసీ ముఖ్య నేతలు దాదాపుగా నిర్ణయానికి వచ్చారట. బీసీ కోటాలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నిలబెట్టాలని అనుకున్నా.. ఆయన ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో  అనూహ్యంగా కొండా దంపతుల పేర్లు తెరపైకి వచ్చాయంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మేల్యేగా చేశారు. ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో  టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ..  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్లోకి మారారు. కాని వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు కొంత కాలంగా  స్తబ్ధుగా ఉండిపోయారు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు పంపినట్లు సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గానికి వరంగల్ జిల్లాతో లింకులుంటాయి. నియోజకవర్గంలోని కమలాపుర్ మండలం ఇప్పుడు కూడా వరంగల్ జిల్లా పరిధిలోనే ఉంది. గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన శాయంపేట, పరకాల నియోజకవర్గాలకు పక్కనే హుజురాబాద్ ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో కొండా దంపతులకు భారీగా అనుచర గణం ఉందని చెబుతున్నారు. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల తర్వాత ఎక్కువగా ఓటర్లున్నది మున్నురు కాపులే. దాదాపు 28 వేలకు పైగా వీరి ఓట్లు ఉన్నాయి. పద్మశాలీ ఓట్లు కూడా భారీగానే ఉన్నాయి. కొండా దంపతుల్లో మురళీ కాపు కాగా.. సురేఖ పద్మశాల. ఈ లెక్కన  కొండా బరిలో ఉంటే మున్నూరుకాపు సామాజిక వర్గంతో పాటు పద్మశాలి ఓట్లు కూడా కలిసివస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తుందని చెబుతున్నారు. 

ప్రత్యేక అధికారాలు కలవారిపై థర్డ్ డిగ్రీనా! సీజేఐ సంచలన వ్యాఖ్యలు.. 

భారత ప్రధాన న్యాయమూర్తిగా తనదైన ముద్ర వేస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇప్పటికే చాలా కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. న్యాయవ్యవస్థను అస్సలు పట్టించుకోవట్లేదని, జడ్జిల ఫిర్యాదునూ లెక్క చేయట్లేదని సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి జస్టిస్ ఎన్వీ రమణ హాట్ కామెంట్స్ చేశారు.  మన దేశంలో కస్టోడియల్ టార్చర్, ఇతర పోలీసు దుశ్చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం మినహాయింపు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పోలీసులకు మానవ హక్కులపై అవగాహన కల్పించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీని ఆయన కోరారు. నల్సా మొబైల్ యాప్‌ను, ‘విజన్ అండ్ మిషన్ స్టేట్‌మెంట్‌’ను జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీజేఐ జస్టిస్ రమణ.. మానవ హక్కులకు, శారీరక భద్రతకు ముప్పు పోలీస్ స్టేషన్లలో అత్యధికంగా ఉందన్నారు.  పోలీసు కస్టడీలో నిర్బంధంలో ఉన్నవారిపై హింస, ఇతర పోలీసు దుశ్చర్యలు  మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న సమస్యలని చెప్పారు జస్టిస్ ఎన్‌వీ రమణ. రాజ్యాంగపరమైన ప్రకటనలు, హామీలు ఉన్నప్పటికీ, పోలీస్ స్టేషన్లలో సమర్థవంతమైన న్యాయ ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్టయినవారికి, నిర్బంధంలో ఉన్నవారికి అత్యంత తీవ్ర నష్టదాయకమని చెప్పారు. ఇటీవల వస్తున్న వార్తలను పరిశీలించినపుడు ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి మినహాయింపు ఉండటం లేదన్నారు.  పోలీసుల అతి ప్రవర్తనను నిరోధించేందుకు చేపట్టవలసిన చర్యలను వివరిస్తూ, న్యాయ సహాయం పొందడం, ఉచిత న్యాయ సహాయ సేవలు అందుబాటులో ఉండటం ప్రజలకు రాజ్యాంగ హక్కులనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. దీనికి సంబంధించిన డిస్‌ప్లే బోర్డులను, ఔట్‌డోర్ హోర్డింగ్స్‌ను ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ, జైలులోనూ ఏర్పాటు చేయాలన్నారు. నల్సా దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు వీటిపై చురుగ్గా అవగాహన కల్పించాలన్నారు.

ఎంపీ పదవికి కోమటిరెడ్డి రాజీనామా? టీఆర్ఎస్ కు మద్దతు? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నేతలు అనూహ్య నిర్ణయాలతో కాక రేపుతున్నారు. హాట్ కామెంట్లతో హీట్ పెంచుతున్నారు. వివాదాస్పద, సంచలన ప్రకటన చేయడంలో ముందుంటారు కాంగ్రెస్ సీనియర్ నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్. సొంత పార్టీపైనే ఆరోపణలు చేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీలకు సపోర్టుగా మాట్లాడుతుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అవకాశం లేదని గతంలో  కామెంట్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే.. పీసీసీ పోస్టును కొనుగోలు చేశారని వ్యాఖ్యానించి కాకా రేపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  తాజాగా మరోసారి సంచలన ప్రకటన చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తానని కూడా ప్రకటించి సంచలనానికి తెర లేపారు. అయితే వీటిన్నంటికి  ఓ కండీషన్ పెట్టారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భువనగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ... వాసాలమర్రిలాగే నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు చేయాలని కోరారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో రోడ్లు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయమని, కావాలంటే బాండ్ రాసి ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను పోటీ చేయకుండా ఉండటమే కాదు.. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తానని కూడా కోమటిరెడ్డి ప్రకటించారు. చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ సర్వ సభ్య సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వివిధ పనులకు సంబంధించి.. కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంటేనే.. ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్‌లో మాట్లాడతానని అన్నారు. హిట్లర్ బతికుంటే.. కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రొటోకాల్ కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులకు క్యాబినెట్‌లో స్థానం లేదని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసని చెప్పారు. ఎంపీ స్థానంలో ఉంటూ.. రెండేళ్ల నుంచి అపాయింట్‌మెంట్ అడిగితే ఇంతవరకు దిక్కేలేదని ఆయన పేర్కొన్నారు.

సీజేఐ సీరియస్ తో సీబీఐ దూకుడు... వైసీపీలో  హైటెన్షన్ 

న్యాయవ్యవస్థను అస్సలు పట్టించుకోవట్లేదని, జడ్జిల ఫిర్యాదునూ లెక్క చేయట్లేదని సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ఘాటు వ్యాఖ్యల ప్రభావం కనిపిస్తోంది.సీజేఐ  అసహనం వ్యక్తం చేయడంతో.. దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇలాంటి కేసుల్లో దూకుడు పెంచాయి. అరెస్టులు చేస్తున్నాయి. ఏపీలో జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ  మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. పి. ఆదర్శ్‌, ఎల్‌. సాంబశివరెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.  జడ్జీలపై వ్యాఖ్యల కేసులో ఇప్పటి వరకు ఏపీలో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది. ఈ కేసులో జులై 28న కొండారెడ్డి, సుధీర్‌.. జులై 9న లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఎంపీ నందిగం సురేశ్‌, ఆమంచి కృష్ణ మోహన్‌ పాత్రను పరిశీలిస్తున్నామని సీబీఐ తెలిపింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నట్లు పేర్కొంది వైసీపీ అభిమానులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ... సోషల్‌ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది.  ఇప్పటికే తాము గుర్తించిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎంపీ నందిగం సురేశ్‌, ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు. జడ్జీలపై వ్యాఖ్యల కేసులో  సీబీఐ వేగం పెంచడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిందనే  ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇంకా ఎంత మంది అరెస్టు అవుతారోనన్న ఆందోళనలో నేతలు ఉన్నారు. మరోవైపు జడ్జీలపై అసభ్య పదజాలంతో దూషించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జనాల నుంచి వస్తోంది. అలా అయితేనే ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

అలుపెరగని అమరావతి పోరుకు ఫలితమెప్పుడు?

అది ఒక స్వప్నం.. మరొకరికి పీడకల. కొందరు సాకారం చేసుకోవాలని పోరాటం చేస్తున్నారు. ఆ స్వప్నాన్ని నలిపేయాలని అధికారంలో ఉన్నవారు ఆరాటపడుతున్నారు. ఆ పీడకల కనపడకుండా పోవాలని..కనుమరుగైపోవాలని.. కొత్తగా కలలు కంటున్నారు అధినేతలు. అది నీ వల్ల కాదు.. నీ తరం కాదు.. మా తరమే కాదు.. భావితరాలు కూడా పోరాడుతూనే ఉంటాయని.. సవాళ్లు విసురుతున్నారు ఆ ఉద్యమకారులు. ఎవరు గెలుస్తారో తెలియదు గాని.. ఆ పోరాటానికి 600 రోజులు నిండాయి. ఆరు వందల రోజుల నుంచి అలుపెరగకుండా వారు ఉద్యమిస్తూనే ఉన్నారు. అంతకంటే వేగంగా అణచివేత ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అమరావతి. అనుకున్నట్లే జరిగి ఉంటే.. అదో అద్భుత నగరం అయి ఉండేది. కాని జగన్మాయ ఫలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రతిపక్షంలో కూర్చుంది. అయినా ఆ స్వప్నం ఆగదనుకున్నారు.. ఎందుకంటే జగనన్న నేను ఇక్కడే ఉంటున్నా ఇల్లు కట్టుకుంటున్నా.. అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకే ఇక్కడ సొంతిల్లు లేదు. అందుకే జనం నమ్మారు. కాని జగన్ ఎప్పుడూ అమరావతి అనే పదాన్ని కూడా తన నోటితో ఉచ్ఛరించలేదన్న విషయాన్నిఎవరూ గమనించలేదు. ఎన్నికల ముందు ప్రచారంలో అయినా.. అధికారంలోకి వచ్చాక అయినా.. సరే ఎవరైనా ప్రశ్న వేస్తే ..ఆ ప్రశ్నలో అమరావతి ఉంది తప్ప.. ఈయన జవాబులో కుంభకోణం అనే వస్తుంది తప్ప అమరావతి అని ఎప్పుడూ ఇప్పటికీ అనలేదు. ఆఖరికి మూడు రాజధాను ప్రకటనలో సైతం.. ఇక్కడ అన్నాడే తప్ప.. అమరావతిలో శాసనరాజధాని అని అనలేదు. అంతగా దానిపై ద్వేషాన్ని పెంచుకున్న జగన్.. ముందు అమరావతిలో పనులు ఆపేశారు. అవినీతి అంటూ విచారణ అన్నారు.. ఇప్పటివరకు ఏం తేల్చలేదు.. కాని పనులు ఆగిపోయాయి. అమరావతి ఆగిపోయింది. ఇక మూడు రాజధానుల ప్రకటన చేశాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. అమరావతిని ఉంచరని.. దీంతో అమరావతికి తమ ప్రాణమైన భూములనే ఇచ్చేసి.. తమ భావి తరాలు బాగుపడతాయని ఆశపడ్డ రైతులు భగ్గుమన్నారు. డిసెంబర్ 17 2019న మొదలైన ఆ నిరసన.. నేటికీ సాగుతూనే ఉంది. పొలం మట్టిలో ఆనందంగా వేసిన అడుగులు.. నడిరోడ్డుపై చెప్పులు కూడా లేకుండా కాళ్లు కాలేలా తిరుగుతున్నాయి. వ్యవసాయంలో చేదోడుగా ఉండి.. కమ్మగా వంట చేసే చేతులు పిడికిళ్లు బిగించి మరీ.. నడిరోడ్డుపై నిలబడ్డారు. వ్యవసాయం, భర్త, పిల్లలు.. పండగలు తప్ప ఇంకోటి ఎరుగని ఆ మహిళలు పోలీసుల లాఠీ రుచి చూడాల్సి వచ్చింది. రోడ్డుపై బూట్లతో తొక్కినా పడ్డారు. అరెస్టులు చేసి కులం పేరుతో దూషించినా.. భరించారు. కాని బిగిసిన ఆ పిడికిలి మాత్రం సడలలేదు. నినదించిన ఆ స్వరం మూగబోలేదు. అమరావతి రాజధానిగా కొనసాగితే తప్ప.. మండుతున్న ఆ గుండెలు చల్లారేలా లేవు. చెంబు, నీళ్లు తెచ్చి అద్భుత రాజధాని నిర్మిద్దామన్న పెద్దమనిషి మోదీ ఇప్పుడు అసలు ఇటే చూడటం లేదు. మాట కూడా మాట్లాడటం లేదు. మేం వస్తే ఇదే రాజధాని అంటున్నారు తప్ప...జగన్ చేసేది తప్పు అని మాత్రం బిజెపివారు అనటం లేదు. పోరాడతానన్న పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం అండగా నిలబడ్డాయి.  అమరావతి రైతులు మాత్రం కొడవలి లాంటి చేతులను ఎక్కుపెట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నారు. 600 కాదు 6000 రోజులైనా పోరాడతాం.. ఈ అమరావతిని రాజధానిగా చేసే వరకు వెనక్కు తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ స్ఫూర్తిని అభినందించాల్సిందే... ఆ పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే.. అలాంటి పోరాటానికి అండగా నిలబడాల్సిందే. మళ్ళీ ఎన్నికలు జరిగి.. ఫలితాలొచ్చేవరకు .. ఈ పోరాట ఫలితం ఏంటో తెలిసే అవకాశమైతే లేదు.

దమ్ముంటే హుజురాబాద్ లో పోటీ చేయ్.. కేసీఆర్ కు ఈటల ఓపెన్ ఛాలెంజ్

తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగ సవాల్ చేశారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజురాబాద్ ఉప ఎన్నికలో చూసుకుందాం రమ్మంటూ సవాల్ చేశారు.  వస్తవా.. రా.. హరీశ్ ఇక్కడ పోటీ చేద్దాం.  వస్తవా.. రా.. కేసీఆర్.. నా మీద పోటీ చేయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈటల. బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని అనుకుంటున్నారేమో.. నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా  హుజురాబాద్ తో తన గెలుపును ఆపలేరని తేల్చి చెప్పారు ఈటల రాజేందర్.  కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ లో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.  హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన యూత్ నాయకులు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన ఈటల రాజేంజర్.. కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా..  వాళ్ల గుండెళ్లో తానే ఉన్నాన్నారు రాజేందర్. ప్రజల ఓట్లతో వచ్చిన  పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారని హెచ్చరించారు.  ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేయడానికి సిద్దమయ్యారని అన్నారు. గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు అని ప్రశ్నించారు. దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదన్నారు రాజేందర్.  హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న.. ఒడ్డెక్కినాక బోడమల్లన్న రకం కేసీఆర్ అంటూ మండిపడ్డారు ఈటల. దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి, పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలని సవాల్ చేశారు. ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతని, ఆసరా ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే తన మీద కేసీఆర్ కోపం పెంచుకున్నారని రాజేందర్ చెప్పారు. కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు.. ఆ సొమ్మంతా మీదే తీసుకోండని ప్రజలకు పిలుపిచ్చారు. తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు... అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈటల రాజేందర్.  

అమ‌రావ‌తిలో హైటెన్ష‌న్‌.. పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌.. త‌గ్గేదే లే అంటున్న రైతులు..

అమ‌రావ‌తిలో తీవ్ర ఉద్రిక్త‌త‌. రైతులు వ‌ర్సెస్ పోలీసులు. మ‌హిళ‌లు వ‌ర్సెస్ ఖాకీలు. ఇనుప కంచెలు, ఖాకీల లాఠీల‌కు వెర‌వ‌కుండా రాజ‌ధాని వాసులు రోడ్డెక్కారు. అమ‌రావ‌తి ఉద్య‌మం 600 రోజుల‌కు చేరిన సంద‌ర్భంగా నిర‌స‌న ర్యాలీల‌తో హోరెత్తారు. భారీగా మోహ‌రించిన పోలీసుల‌కు ఉద్య‌మ సెగ రుచి చూపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల ఆంక్ష‌లు కొనసాగుతున్నాయి. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు హైకోర్టు ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు సిద్ధమైన రాజధాని ప్రాంత రైతులు, మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మందడం, వెంకటపాలెంలో తీవ్ర‌ ఉద్రిక్తత  నెలకొంది. వెంకటపాలెంలో రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామంలోని రోడ్లను దిగ్బంధించారు. మందడంలో రైతులు, మహిళలను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు- రైతులు, పోలీసులు-మహిళల మధ్య తోపులాట జరిగింది.  అమ‌రావ‌తి ఉద్య‌మ‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ అనంతవరంలో రోడ్డుపై మహిళలు, రైతులు భైఠాయించడంతో హైటెన్ష‌న్ నెల‌కొంది. రాజ‌ధాని గ్రామాల‌న్నీ స్థానికుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్నాయి. కడుపు మండిన రైతుల ప‌ద‌ఘ‌ట్ట‌న‌లో ఖాకీల బూట్ల చ‌ప్పుడు స‌ద్దుమ‌నిగింది. 

పులిచింతలలో భూకంపం.. ప్రాజెక్టుకు ప్ర‌మాదం..?

ఓవైపు పులిచింత‌ల‌పై రాజ‌కీయ ప్ర‌కంప‌ణలు.. ఇదే స‌మ‌యంలో పులిచింత‌ల ప్రాంతంలో భూప్ర‌కంప‌ణ‌లు.. ప్ర‌కృతి ప‌గ బ‌ట్టిన‌ట్టుంది. పులిచింత‌ల‌తో ఆటాడుకుంటోంది. ఉన్న‌ట్టుండి ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది. బంగారు పంట‌లు పండించాల్సిన జ‌లం.. వృధాగా స‌ముద్రం పాలైంది. చుట్టుప‌క్క‌ల గ్రామాల‌ను ముంపు భ‌యంతో వ‌ణికించింది. పులి..చింత‌ల‌కు రాజ‌కీయ అవినీతే కార‌ణ‌మంటూ ర‌చ్చ మొద‌లైంది. నాసిర‌కం ప‌నుల‌తోనే గేటు ఊడిందంటూ ర‌గ‌డ జ‌రిగింది. ఆ పాపం మీదంటే మీదంటూ పార్టీలు నీళ్లెత్తి పోసుకుంటున్నాయి. ఆ నీటిమంట‌లు స‌ల‌స‌ల కాగుతుండ‌గానే.. .పులిచింత‌ల మ‌రోసారి ఉలిక్కిప‌డింది. ఈసారి భూకంపం అందుకు కార‌ణ‌మైంది.  గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల వరకు భూమి కంపించినట్లు భూభౌతిక పరిశోధన ముఖ్యశాస్త్రవేత్త శ్రీనగేశ్‌ తెలిపారు. మూడు సార్లు భూమి కంపించినట్టు చెప్పారు.  భూకంపలేఖినిపై ప్ర‌కంప‌ణ‌ల‌ తీవ్రత 3.0,  2.7,  2.3గా నమోదైనట్లు ఆయన వివరించారు. పులిచింతలతోపాటు తెలంగాణ పరిధిలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ భూ ప్రకంపలను వచ్చాయి. గత వారం రోజులుగా పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. భూకంప‌ణాల‌తో పులిచింతల ప్రాజెక్టుకు ఏమైనా ప్ర‌మాదం ఉందా అనే దిశ‌గా అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.

భార‌త బాహుబ‌లి.. ఆనంద్‌ మహీంద్రా బహుమతి ఇది..

ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం సాధించి ప్ర‌పంచ‌ బాహుబ‌లిగా నిలిచాడు నీర‌జ్ చోప్రా. ఈటె విస‌ర‌డంలో భారతీయుల‌కు సాటి మ‌రెవ‌రూ లేర‌ని నిరూపించాడు. అందుకే, భ‌ళి భ‌ళిరా అంటూ నీర‌జ్‌ను బాహుబాలితో పోలుస్తోంది యావ‌త్ భార‌తం. నీర‌జ్ చోప్రా జావెలిన్ విసిరే ఫోటోతో పాటు బాహుబ‌లిలో ప్ర‌భాస్ ఈటె విసిరే పిక్‌ను జ‌త చేసి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు ఆనంద్ మ‌హీంద్రా. జ‌స్ట్.. ట్వీట్ కాదండోయ్‌.. ఓ మాంచి బ‌హుమ‌తి కూడా ఇచ్చేశారు.. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ బహుమతి ప్రకటించారు. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న XUV 700 మోడల్‌ వాహనాన్ని అతడికి బహుమతిగా ఇవ్వనున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.   ‘‘మేమంతా నీ సైన్యంలో ఉన్నాం.. బాహుబలి’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈటెను విసురుతున్న నీరజ్‌ చోప్రా ఫొటోతో పాటు.. తన వెనక భారీ సైన్యంతో.. చేతిలో ఈటెను పైకెత్తి గుర్రంపై వస్తున్న ప్రభాస్‌ ఫొటోను షేర్‌ చేశారు.  ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌కు బదులిస్తూ నీరజ్‌కు XUV 700 బహుమతిగా ఇవ్వాలంటూ ఓ నెటిజ‌న్ కోరాడు. అతడి ట్వీట్‌కు రిప్లైగా.. ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేశారు. తన సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతోద్యోగులను ట్యాగ్‌ చేస్తూ.. నీరజ్‌ కోసం ఓ XUV 700 మోడల్‌ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. ఆనంద్ మ‌హీంద్రా నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తూ నెటిజ‌న్లు రీట్వీట్ల‌తో అభినందిస్తున్నారు.

600 అల‌జ‌డి.. సంకెళ్ల‌తో స‌మ‌రాన్ని ఆప‌గ‌ల‌రా? ప్ర‌భుత్వం ప‌డిపోతే మంచిరోజులు రావా?

అమ‌రావ‌తి. న‌వ్యాంధ్ర‌ క‌ల‌ల రాజ‌ధాని. అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రం. ఆంధ్రుల నిండు గౌర‌వం. అలాంటి అమ‌రావ‌తితో మూడుముక్క‌లాట ఆడుకున్నారు పాల‌కులు. అద్బుత న‌గ‌రంగా విలసిల్లాల్సిన రాజ‌ధానిని.. అడ్ర‌స్ లేకుండా చేశారు. ప్ర‌జ‌లు వ‌ద్దంటున్నా.. హైకోర్టు కుద‌ర‌దంటున్నా.. ప్ర‌భుత్వం మాత్రం మంకు ప‌ట్టు వీడ‌టం లేదు. అమ‌రావ‌తిని నాశ‌నం చేసేవ‌ర‌కూ వ‌దిలేది లేదంటూ స‌ర్కారు పంతానికి పోతోంది. 33 గ్రామాలు, అక్క‌డి వారు చేసిన‌ త్యాగాలు, కోట్లాది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు.. అన్నిటినీ నిర్బంధంతో, కేసులు, కుట్ర‌లు, కుతంత్రాల‌తో.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఉక్కుపాదం మోపుతోంది సీఎం జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు.    గోడ‌కు కొట్టిన బంతిలా.. అమ‌రావ‌తి ప్ర‌జ‌లు జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డుతున్నారు. అలుపు, సొలుపు లేకుండా 600 రోజులుగా ఉద్య‌మిస్తున్నారు. ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న‌లు, విన్న‌పాలతో అమ‌రావ‌తి నినాదాన్ని వారి భుజాల‌పై మోస్తున్నారు. సీఎం జ‌గ‌న్ మారుతాడ‌నే న‌మ్మ‌కం వారిలో ఏ కోశాన లేదు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మార‌బోతోంద‌నే ఆశనే వారిలో మ‌రింత ఉత్సాహం నింపుతోంది. కేంద్రంలో వేగంఆ మారుతున్న ప‌రిణామాలు, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు తీర్పుతో.. అమ‌రావ‌తివాసుల్లో మ‌నోధైర్యం పెరుగుతోంది. మ‌ళ్లీ మంచి రోజులొస్తాయ‌నే న‌మ్మ‌కంతో.. 600 రోజుల ఉద్య‌మాన్ని రెట్టింపు జోష్‌తో జ‌రుపుతున్నారు. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరనున్న సందర్భంగా ’న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట బైక్‌ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు హైకోర్టు వద్ద నిర్మాణంలో ఉన్న జడ్జిల క్వార్టర్స్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించాల‌నేది షెడ్యూల్‌. అయితే, రాజధాని ప్రాంతంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. గ్రామాల్లో ఇనుప కంచెలు ఏర్పాటుచేశారు.  రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. పెదపరిమి ద‌గ్గ‌రే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు.  మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు.  పలు చోట్ల నిరసనలకు దిగిన అమరావతి ఉద్యమకారులు, టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అమరావతిని అంతం చేసేందుకు వైసీపీ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటిని రైతులు ఓర్పుతో చేధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెదిరింపులు, అణిచివేత, అరెస్టులకు అదరం...బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు.  ‘‘రోడ్లను సయితం తవ్వేస్తూ అమరావతిని చంపేస్తామని ఆనందపడుతున్న జగన్ రెడ్డి గారూ! మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు.. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుంది’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

మోడీ దూకుడుకు కళ్ళెం.. విపక్షాలదే విజయం! 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు విజయం సాధించాయి. దిగ్విజయంగా సభా కార్యక్రమాలను స్తంభింప చేశాయి. ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలనుకున్న కీలక అంశాలు, ఏవీ ప్రస్తావనకు రాలేదు. పైగాసస్’ ఒక్కటే ఇష్యూగా ఇంతవరకు సభ సమయం  పుణ్యకాలం ముగిసిపోయింది. ప్రతిపక్షాల మంకు పట్టును ప్రజలు హర్షిస్తారా, ఆమోదిస్తారా అనే విషయాన్నిన్ని పక్కన పెడితే, మొత్తానికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడంలో  చాలా వరకు సఫల మయ్యాయి. మోడీ దూకుడుకు కళ్ళెం వేయగాలిగాయి.   మరో వంక సభలోపల వెలుపలా కూడా ప్రతిపక్షాలు ఐక్యతను చూపగలిగాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తొలిసారిగా, కాంగ్రెసేతర విపక్షాలతో మాట కలిపారు. విపక్షాల ఉమ్మడి వ్యూహా సమావేశాలలో చురుగ్గా పాల్గొన్నారు. బహుసా మొదటిసారి, స్వయంగా రాహుల్ విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు.  పార్లమెంట్’కు ఒక రోజు రైతుల ఆందోళలను హై లైట్ చేస్తూ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ, మరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను హైలైట్ చూస్తూ సైకిల్ మీద వచ్చి మీడియా ఫోకస్ ను తమ వైపుకు తిప్పుకున్నరు ఈ సమావేశాలలో రాహుల్ గాంధీ, ఎన్నో కొన్ని అదనపు పాయింట్స్  అయితే కొట్టేశారు. రాహుల్ నాయకత్వాన్ని అందరూ కాకపోయినా కొందరైనా ఆమోదించారు. పార్లమెంట్ సమావేశాలు మరో నాలుగు రోజులు జరుగుతాయి... ఈనాలుగు రోజుల్లో బ్రహ్మాండం ఎదో జరిగితే ఏమో కానీ, లేదంటే చివరాఖరుకు, పార్లమెంట్ వర్షాకాల సంవేశాలలో ప్రతిపక్షాలు పై చేయి సాధించాయి, అనే మాటే జనంలోకి వెళుతుంది. కొవిడ్ సెకండ్ వేవ్’కు చెక్ పెట్టడంలో మొదలైన మోడీ ప్రభుత్వ వైఫల్యాల చిట్టాలో పార్లమెంట్’ ప్రహసనం కూడా వచ్చి చేరుతుంది.  ఒక విధంగా పార్లమెంట్ లోపల వెలుపలా జరుగుతున్న పరిణామాలు. అధికార కూటమిని మరీ ముఖ్యంగా బీజేపే నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అందుకు సంకేతమే అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు, ఇంతక ముందు ఎప్పుడూ లేని విధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేమంగళ వారం నుంచి మూడు రోజుల పాటు, తమ మంత్రి మండలి సభ్యులో  సమావేశాలు కాదు, ఏకంగా సమ్మేళనమే నిర్వహిస్తున్నారు. ప్రదాన మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించి నెలరోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని. మిగిలి మూడేళ్ళ కాలంలో ప్రభుత్వం అనుసరించవలసిన వ్యూహం, అదే విధంగా  మూడేళ్ళ తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటుగా,  2022 లో వచ్చే వివిధ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై కూడా కూలకషంగా చర్చించి, విధానాలను ఖరారు చేస్తారని సమాచారం. అదే  విధంగా, ఈ నెల రోజుల్లో కొత్త మంత్రుల పనితీరును కూడా సమీక్షిస్తారు. లక్ష్యాలను నిర్దేశిస్తారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆగష్టు 16 నుంచి కేంద్ర మంత్రులు తమ తమ రాష్ట్రాలలో పర్యటించాలని పార్టీ ఆదేశించింది. ఈ పర్యటనలలో పార్లమెంట్ ద్వారా ప్రజల ముందు ఉంచాలనుకుని, విపక్షాలు సభను సాగనీయక పోవడం వలన చెప్పుకోలేక పోయిన విషయాలను ప్రజల  ముంచుతారని, పార్టీ వర్గాల సమాచారం, ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల ఏకైక మంత్రి కిషన్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు.  ఇంతవరకు కారణాలు ఏవైనా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా మొదలు కేంద్ర మంత్రులు, బీజీపే నాయకులు విపక్షాలు విసురుతున్న సవాళ్ళకు సమాధానం ఇవ్వడం లేదు. అయితే, ఇక ఎదురు దాడి చేయక తప్పదని లేదంటే ప్రజలలో ఇంకా ఇంకా పలచన అవుతామని బీజేపీ పెద్దలు గుర్తించారు. సంఖ్యాబలం అండగా పార్లమెంట్ వేదికగా విపక్షాల మీద విరుచుకు పడేందుకు పక్కా వ్యూహంతో సిద్దమైనా, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి  ఒక రోజు ముందు, వచ్చిపడిన పైగాసస్  హ్యాకింగ్ దుమారంలో ఆ ఎజెండా కొట్టుకు పోయింది. అందుకే, నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని, కమల దళం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మందు గూడును ప్రధాని మోడీ బీజీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు అందించారు. విపక్షాల తీరును ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. విపక్షాలు పార్లమెంట్’ను అడ్డుకోవడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాయడమే, ప్రజలను అవమానించడమే అని ప్రధాని పేర్కొన్నారు.  పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేయడం వలన ప్రజల సంస్యలు చర్చకు రాకపోవడంతో పాటుగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ప్రధాని పేర్కొన్నారు. ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని ఎంపీ లను ఆదేశించారు. ఒక విధంగా చూస్తే విపక్షాలపై  దండయాత్రకు కమల దళం, మోడీ సేన సిద్డంవుతున్నాయి. అయితే, కొవిడ్ సెకండ్ వేవ్ మొదలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు ఒకటొకటిగా క్యూ కట్టి బయటకు వస్తున్నాయి. అన్నివర్గాల ప్రజలు ఏదో ఒక విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజులు, కార్మికులు , వివిధ రంగాల ప్రైవేటు ఉద్యోగులు ఉపాధి కోల్పోయి, ఆదాయాలు కుదించుకుపోయి, పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. అలాంటప్పుడు, మంత్రులు, ఎంపీలు ఇచ్చే ఊక దంపుడు ఉపన్యాసాలు,ఊరటనిస్తాయా.. ప్రజల ఆగ్రహాన్ని చల్లారుస్తాయా .. చూడాలి..

ప్రకాశం వైసీపీలో వర్గపోరు.. చీరాలలో కరణం వర్గీయులపై దాడి

ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గుమంటోంది. మరోసారి అధికార పార్టీ కార్యాకర్తలు నడిరోడ్డుపైనా బాహాబాహీకి దిగారు. చీరాల నియోజకవర్గంలో వైసీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. చీరాల మండలంలోని గవినివారిపాలెంలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే  గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన వివాదం క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకుంది. రెచ్చిపోయిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే, పోలీసులు సర్దిచెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. అధికార పార్టీ నేత బుర్ల మురళి ఈ ఘటనపై ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కొందరు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాంకృష్ణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలోనూ చాలా సార్లు రెండు వర్గాలు గొడవకు దిగాయి. గత ఎన్నికల్లో ఆమంచి వైసీసీ నుంచి పోటీ చేయగా.. కరణం బలరామకృష్ణమూర్తి  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్రమంతై వైసీపీ గాలీ వీచినా.. చీరాలలో మాత్రం కరణం విజయం సాధించారు. అయితే తర్వాత కొన్ని రోజులకే కరణం వైసీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కరణం, ఆమంచి మధ్య సయోధ్యకు సీఎం జగన్ ప్రయత్నించినా కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరిందని అంటున్నారు.   

తిట్ల‌లో పీహెచ్‌డీ చేశారా? ఆ పంచ్‌లు ఏందిరా బాబోయ్‌..

సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది ఎవ‌రు? నిత్యం తిట్లు, బూతుల‌తో విరుచుకుప‌డేది ఎవ‌రు? మొబైల్ ఓపెన్ చేస్తే.. మాట‌ల‌తో కంపు రేపేది ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్స్ చాలా చాలా సింపుల్‌. కాస్త అప్‌డేట్‌లో ఉండే వారెవ‌రైనా ఈజీగా చెప్పేయొచ్చు. రెండు గ్రూపులు సోష‌ల్ మీడియాలో పిచ్చ యాక్టివ్‌గా ఉంటాయి. పోటాపోటీగా రెచ్చిపోతుంటాయి. ప్ర‌త్య‌ర్థుల‌ను మాట‌ల‌తో, తిట్ల‌తో, బూతుల‌తో ర‌చ్చ రంబోలా చేస్తాయి. అందులో నెంబ‌ర్ వ‌న్‌.. జ‌గ‌న్ బ్యాచ్‌. వైసీపీ పెయిడ్ గ్రూప్స్‌. ముద్దుగా పేటీఎమ్ బ్యాచ్‌ల‌ని కూడా అంటారు. ఇక సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయే సెకండ్ బ్యాచ్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌. త‌మ నాయ‌కుడిని ప‌ల్లెత్తి మాట అన‌కుండానే.. అంటారేమోన‌నే అనుమానం వ‌చ్చినా.. ఇక అంతే సంగ‌తులు. అభిమానం పేరుతో జ‌న‌సైనికులు చేసే ఓవ‌రాక్ష‌న్ అంతాఇంతా కాదు. సోష‌ల్ మీడియాలో ఇటు జ‌గ‌న్ బ్యాచ్‌, అటు పీకే గ్రూప్స్ చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు మ‌రి.  ఇక మెగా ఫ్యాన్స్‌కి వాళ్ల పాత నాయ‌కుడు ప‌ర‌కాల ప్రభాక‌ర్‌తో అస్స‌లు పొస‌గ‌దు. మెగా లీడ‌ర్‌ను ఆడిపోసుకున్నార‌నే అక్క‌సుతో ప‌ర‌కాల టాపిక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చెడుగుడు ఆడుకుంటుంటారు మెగా అభిమానులు. అయితే, హుందాగా క‌నిపిస్తూ, ప‌ద్ద‌తిగా మాట్లాడిన‌ట్టు అనిపించే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లేటెస్ట్‌గా పీకే ఫ్యాన్స్ దారిలోనే న‌డుస్తున్న‌ట్టున్నారు. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త‌.. ఒక‌ప్ప‌టి ప్ర‌జారాజ్యం లీడ‌ర్‌.. గ‌త ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. ప్ర‌స్తుతం ఏ పార్టీలో ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలీని.. ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌.. వారం రోజులుగా ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. పీకే ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. జ‌న‌సైనికుల‌కు దిమ్మ‌తిరిగేలా వారి భాష‌లోనే పంచ్‌ల‌తో పిచ్చెక్కిస్తున్నారు. ప‌ర‌కాల ట్వీట్లు మామూలుగా ఉండ‌టం లేదు. అయితే, ఎక్క‌డా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు గానీ, వారి ఫ్యాన్స్ అనిగానీ నేరుగా అన‌కుండా.. ప‌రోక్షంగా జ‌న‌సైనికుల‌ను ట్వీట్ల‌తో కుమ్మేస్తున్నారు. మాంచి మ‌సాలా ద‌ట్టించి.. నూనెలో స‌ల‌స‌లా కాగేలా క‌ర్రు కాల్చి వాత‌పెడుతున్నారు. ప‌ర‌కాల ఫేస్‌కు.. ఆయ‌న చేస్తున్న ట్వీట్ల‌కు అస్స‌లు సింక్ అవ‌డం లేదు. డౌట్ ఉంటే మీరూ ఓసారి ఆ ట్వీట్ల‌పై ఓ లుక్కేయండి... ఆ పంచ్ ప‌టాకాలు ఎలా పేలుతున్నాయో చ‌దివేయండి.. ఇటీవ‌ల‌ ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ పెట్టిన ట్వీట్ ఇది.... ఇంకా గోక్కుంటున్న గ‌జ్జి బ్యాచ్‌కు అంటూ మ‌రో ట్వీట్‌.. ఇంకా ఇక్క‌డిక్క‌డే తిరుగుతున్న గ‌జ్జి బ్యాచ్‌కి ఇవాళ్టి డోస్ అంటూ మ‌రో ట్వీట్‌.. ఇంకా ఆ మూలా, ఈ మూలా త‌చ్చాడుతున్న పిత్త‌ప‌రిగి సైన్యానికి అంటూ మ‌రో పంచ్‌.. పాపం అక్క‌డ‌క్క‌డా మూలుగుతూ ప‌డిఉన్న పిత్త‌ప‌రిగి సైన్యానికి.. ఈ సీజ‌న్ చివ‌రి డోస్.. మ‌ళ్లీ ఈ ఛాయ‌ల‌కొచ్చారో.. ఖ‌బ‌డ్దార్‌! అంటూ త‌న ట్వీట్ల‌కు క్రాఫ్ హాలిడే ప్ర‌క‌టించేశారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌..  

మహా ‘మేత’ దే పులిచింతల పాపం?.. ఇదిగో సాక్ష్యం.. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న  పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన ఘటన  దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గేటు కొట్టుకుపోవడంతో అధికార వైసీపీ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో  ఆ నెపాన్ని గత టీడీపీ ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు వల్లే పులిచింతల ప్రాజెక్టు  నాసిరకం నిర్మాణంగా మిగిలిందని వైసీపీ నేతలంటున్నారు.  వైసీపీ నేతలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ అనే మహానేత…ప్రాజెక్టుల పేరుతో మేత మేశాడు తప్ప ఏమీ చెయ్యలేదని, అందుకే పులిచింతల సహా ఆయన హయాంలో కట్టిన అనేక ఫ్లై ఓవర్లు,అనేక ప్రాజెక్టులు నాసిరకంగా మారాయని ఆధారాలతో సహా విమర్శలు గుప్పిస్తున్నారు. పులిచింతల డిజైన్లను చంద్రబాబు కాంట్రాక్టర్ మార్చారని, గేట్లు తగ్గించాడని, దాని వల్లే ఈరోజు గేటు ఊడిపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం అనడానికి 2006 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల రికార్డులే సాక్ష్యమని టీడీపీ నేతలు నిరూపిస్తున్నారు. 2006, ఫిబ్రవరి 25 అసెంబ్లీ రికార్డ్ నంబర్ 6301 ప్రకారం పులిచింతలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభ వాయిదా పడింది. కాంట్రాక్టర్ డ్యామ్ డిజైన్స్ కాంక్రీట్ నుండి మట్టికి మార్చారని, గేట్లు తగ్గించారని నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో గొడవ చేస్తే సమాధానం చెప్పలేక సభను వాయిదా వేసి నాటి సీఎం వైఎస్సార్ వెకిలి నవ్వులు నవ్వారని ఆరోపిస్తున్నారు. డిజైన్లు మారిస్తే ఏమీ కాదంటూ వైఎస్ చెప్పారని,  కాంట్రాక్టర్ కి దాదాపు 50 కోట్లు మిగిలిందని ఆరోపిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పనుల నిర్వహణలో కాంట్రాక్టరుకు రూ.56.52 కోట్ల అనుచిత లబ్ది చేకూరింది'' అని 2009-10లో కాగ్‌ వైఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.  ఆ తర్వాత మాజీ సీఎం రోశయ్య హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ హయాంలో రెండు సార్లు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయి చివరకి సగం గేట్లతో ప్రాజెక్టు ఓపెన్ చేశారు.  అయితే నాసిరకం నిర్మాణం అంటూ కిరణ్ ప్రభుత్వం కాంట్రాక్టర్ పై కోర్టులో కేసు వేసింది. కానీ జలయజ్ఞం క్లాజుల వల్ల కాంట్రాక్టరే గెలిచాడు. దీంతో, 2014లో కాంట్రాక్టర్ కి 120 కోట్లు పరిహారం చెల్లించాలని కిరణ్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ నాసిరకం ప్రాజెక్టులో 8 టిఎంసిలకు మించి నీరు నిల్వ ఉంచకూడదని సీడబ్ల్యూసీ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు ప్రభుత్వంపైనా కాంట్రాక్టర్ గెలిచారు. దీంతో, కోర్టులకి వెళ్లటం దండగని రూ.190 కోట్లు రిలీజ్ చేసి, భూసేకరణకు రూ.70 కోట్లిచ్చి ఆ కాంట్రాక్టర్ కు దండం పెట్టారు చంద్రబాబు.ఆ తర్వాత వేరే కంపెనీతో పనులు చేయించి 2017 నాటికి 20 టిఎంసీల సామర్థ్యం తెచ్చిన ఘన చంద్రబాబుది. 2018 కల్లా ఫుల్ స్టోరేజ్ కి వచ్చేలా పనులు పూర్తి చేసింది చంద్రబాబు సర్కార్. అయితే బేస్ డిజైన్ మారలేదు కాబట్టి…ఎన్నికోట్లు పెట్టినా పులిచింతల అతుకుల బొంతగానే మిగిలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం, ఈ నాసిరకం పనులు దృష్టిలో పెట్టుకునే, పూర్తిస్థాయిలో నీటిని నిల్వను ఎప్పుడూ చేయలేదు. జాగ్రత్తగా ఫ్లడ్ మానిటర్ చేస్తూ, డ్యాంను కాపాడుతూ వచ్చారు. డ్యామ్ మెయిన్ టినెన్స్ కు నిధులు కేటాయించారు. పులిచింతల ప్రాజెక్టును 1988 నవంబర్ 13న ఎన్.టి.ఆర్ గారు మొదట శంకుస్థాపన చేశారు. 1994-95లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.501 కోట్లు. 2004 అక్టోబర్ 15న పులిచింతల ప్రాజెక్టుకు వైఎస్ భూమి పూజ చేశారు. 30-9-2004 తేదీన మెస్సర్స్‌ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ మరియు చైనా రైల్వే 18 బ్యూరో జాయింట్ వెంచర్ తో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 18.11.2005 న జీవో నెం 208 ద్వారా సవరించిన అంచనా రూ.681 కోట్లు. 04.08.2009న జీవో నెం 90  ద్వారా వైఎస్ ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1281 కోట్లు. 29.01.2014న జీవో నెం. 7 ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1861 కోట్లు. భూసేకరణలో జాప్యం వలన ధరలు పెరిగినందుకున అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్ 2012లో ప్రభుత్వాన్ని కోరారు. దీనిని పరిశీలించిన డీఏబీ రూ.199 కోట్లను అధనంగా చెల్లించాలని 03.10.2013న ప్రతిపాదించారు. ఇది అమలు కాకపోవడంతో కోర్టుకు వెళ్లారు.  సుదీర్ఘంగా విచారణ జరిపి మచిలీపట్నం కోర్టు.. 02.06.2016న రూ.199 కోట్లతో పాటు 2013 నుండి వడ్డీ కల్పి రూ.399 కోట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దానిపై హైకోర్టుకు ప్రభుత్వం వెళ్లగా కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అనగా రూ.199 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాన్ని 01.01.2019న ప్రభుత్వం అమలు పరిచింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పులిచింతల మునక రైతుల పరిహారం కోసం రూ.128 కోట్లు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.199 కోట్లు చెల్లింపులు చేయడమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులకు పరిహారం చెల్లించి వారిని ఖాళీ చేయించడంలో వైఎస్ గాని, కాంగ్రెస్ గాని తగినంత శ్రద్ధ పెట్టలేదు. అందువలన ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి, దానిపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారు.వారు చేసిన పాపానికి చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల ప్రకారం రూ.199కోట్లు చెల్లించింది. మరో 128 కోట్లు భూములు కోల్పోన రైతులకు చెల్లించింది.వైఎస్ ప్రభుత్వం కమీషన్లు పుచ్చుకునే పనులకు నిధులు విడుదల చేసి, రైతులకు పరిహారంలో కమీషన్లు రావు కనుక దాన్ని నిర్లక్ష్యం చేసింది.  డ్యాంకు గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్ లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్‌ గరిష్ఠంగా ఆరు మిల్లీ మీటర్లకు మించి ఉండకూడదని తెలిసినా, పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా పెట్టారు. దీంతో గేట్ల పై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా సివిల్‌ పనుల్లో, మెకానికల్‌ పనుల్లో కూడా లోపాలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసారు. 754.59 మీటర్ల దూరం స్పిల్‌వే నిర్మించాల్సి ఉండగా, 546 మీటర్లకు తగ్గించారు. 33 గేట్లు పెట్టాల్సి ఉండగా, కేవలం 24 గేట్లు పెట్టారు. కాంక్రీటు డ్యాం నిర్మించాల్సి ఉండగా, 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. డిజైన్ మార్చి, స్పిల్ వే తగ్గించటం, గేట్లు తగ్గించటం, కాంక్రీటు డ్యాం లేకుండా మట్టి మట్టికట్ట నిర్మాణం చేయటంతో, మొత్తంగా ఈ రోజు వరద ఉదృతికి, గేటు కొట్టుకుపోయింది. జలయజ్ఞంలో జరిగిన ధనయజ్ఞంలో భాగంగానే డిజైన్ మార్పులు నాశిరకం పనులు జరిగాయి. తండ్రిని అడ్డం పెట్టుకొని నాడు జగన్ రెడ్డి కమీషన్లు కొల్లగొట్టారు. ఆ పాపమే నేటి పులిచింతల దుస్థితి.  పులిచింతల పూర్తి చేసిన ఘనత వైఎస్ ది అని అక్కడ 45 అడుగుల వైఎస్ విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని 07.10.2019న నీటి పారుదల శాఖా మంత్రి అనీల్ కుమార్ ప్రకటించారు. జగన్ రెడ్డి కూడా ఆ ఘనత తమదే అన్నారు. మరి పులిచింతల గేటు కొట్టుకుపోయిన పాపం పూర్తిగా జగన్ కుటుంబానిది కాదా?..    

సాహో చోప్రా.. ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం సాధించెన్‌.. వందేళ్ల క‌ల ఫ‌లించెన్‌..

ఒలింపిక్స్‌లో భార‌త్‌ అద్భుతం చేసింది. అథ్లెటిక్స్‌లో వందేళ్ల స్వ‌ప్నం సాకారం చేసింది. జావెలిన్ త్రోలో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించి.. నీర‌జ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. 130 కోట్ల భార‌తీయుల‌ను ఆనందంలో ముంచెత్తాడు. టోక్యో ఒలింపిక్స్‌ను మ‌రుపురాని తీపి జ్క్షాప‌కంగా మార్చాడు.  జుల‌పాల జుట్టుతో.. ప‌దునైన బ‌ల్లెంతో.. జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా ప్ర‌పంచంలోర‌నే తిరుగులేని ఆట‌గాడిలా నిలిచాడు. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు.   ముందే ఊహించారు. అంతా అనుకున్నారు. నీర‌జ్ చోప్రా ప‌త‌కం తీసుకొస్తాడ‌ని. కానీ, ఏకంగా బంగారు ప‌త‌క‌మే గెలుపొంద‌డంతో ఆనందం ఆకాశాన్ని అంటుతోంది. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌లోనూ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫైన‌ల్లో 12 మందితో పోటీ ప‌డి.. జావెలిన్‌ను 87.58 మీటర్లు విసిరి.. ఒలింపిక్స్‌లో భార‌త పేరును, త‌న పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు.   2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.   నీరజ్‌ 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్‌ కెరీర్‌.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఏడు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.  ఇప్పుడు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడంతో యావ‌త్ భార‌తం ఉప్పొంగిపోతోంది. నీర‌జ్ చోప్రాను చూసి గ‌ర్వ ప‌డుతోంది.