యథా సీఎం.. తథా మినిస్టర్.. గాలిలో మేడలు కడుతున్న అంబటి

అవధానాలలో అప్రస్తుత ప్రసంగి అని ఒకరుంటారు. అవధానం రంజుగా సాగుతుండగా.. అప్రస్తుత ప్రశ్నలు వేస్తూ అవధాని దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా అంబటి రాంబాబు అలాంటి అప్రస్తుత ప్రసంగాలు చేయడంలో దిట్ట. తన వ్యాఖ్యలు, విమర్శలతో లేనిపోని వాదనలకు తావిచ్చే యత్నం చేస్తారు. తద్వారా అసలు విషయం పక్కకు పోతుందన్నది ఆయన ఉద్దేశం. విజయవాడలో జరిగిన వైసీపీ సమావేశంలో కూడా ఆయన అలాంటి ప్రస్తావనే తీసుకు వచ్చారు.   ఇష్టారీతిన దబాయించడం.. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లనడంలో ముఖ్యమంత్రి జగన్ అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రులలో అంబటి రాంబాబు ముందువరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. మంత్రిగా తన శాఖపై ఏ మాత్రం అవగాహన లేని అంబటి పోలవరంపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. పోలవరంపై ప్రశ్నించిన జర్నలిస్టును మీడియా సమావేశం నుంచి బయటకు పంపిన ఘనత అంబటిది. అటువంటి అంబటి తాజాగా రానున్న ఎన్నికలలో ఏపీలో 175కు 175 స్థానాలలోనూ వైసీపీ విజయం ఖాయమన్నధీమా వ్యక్తం చేశారు. దీనిని పరిశీలకులు అంబటి పగటి కలల ప్రసంగంగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఇదేదో కార్యకర్తలలో ఉత్సాహం నింపడానికో, క్యాడర్ ను కార్యోన్ముఖులను చేయడానికో అయితే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆయనీ మాటలు మాట్లాడిన వేదిక.. ఆ వేదికపై ప్రస్తావించిన అంశాలూ చూస్తుంటే.. ఆయన భ్రమలలో ఉన్నారనీ, గాలిలో కట్టిన ఇంద్రభవనాల్లో నివసిస్తున్నారనీ అనిపించక మానదు. వైసీపీ ప్లీనరీ సన్నాహకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలలో భాగంగా విజయవాడలో జరిగిన సమావేశంలో అంబటి మాటలు కోటలు దాటేశాయి. గడప గడపకూ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారని చెప్పారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలన్నిటినీ అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారని అంబటి అన్నారు. కానీ ఆయనీ మాటలు చెప్పిన రోజే అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్యలో బాగా కోతపెట్టినట్లు జగన్ శ్రీకాకుళంలో ప్రకటించారు. కరోనా కల్లోలం నుంచి రాష్ట్రం బయటపడిందంటే అది జగన్ చలవేనని కూడా సలవిచ్చారు.   గడప గడపకూలో జనం నిరసన సెగలు, సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర తుస్సు మన్న సంగతిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. తెలుగుదేశం మహానాడుకు వచ్చిన స్పందన గురించిన ప్రస్తావనే లేదు. జనం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ సమస్యలపై నిలదీస్తున్న విషయాన్ని పట్టించుకోనే లేదు. ముఖ్యమంత్రి అన్నారు కనుక తాను కూడా మొత్తం 175 స్థానాలలో విజయం సాధిస్తామని ఓ ప్రకటన చేసేశారు అంబటి.

ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు.. కొడాలి నాని ఇలాకాలో ఉద్రిక్తత

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి కోర్టులో చీవాట్లు తిన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. తాజాగా గుడివాడ సమీపంలోని బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసి తమ అరచకానికి హద్దులే లేవని వైసీపీ మరోసారి రుజువు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడలో అధికార వైసీపీ కార్యకర్తల అరాచకానికి హద్దు లేకుండా పోతోంది. తాజాగా బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసారు. చంద్రబాబునాయుడు బొమ్మలూరుకు కిలోమీటర్ దూరంలో ఉన్న అంగులూరులో జరగనున్న మహానాడుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా మహానాడు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు తమ పార్టీ రంగులు పూసి వికృతానందం పొందారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బొమ్మలూరు చేరుకున్న తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులను తుడిచేసి పాలాభిషేకం చేశారు. అనంతరం మళ్లీ పసుపు రంగు వేశారు. తెలుగుదేశం మహానాడుకు ముందు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే వైసీపీ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడుతోందని ఎమ్మెల్పీ బచ్చుల అర్జునుడు, పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.  కాగా ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే వైసీపీ నేతలకు తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో బొమ్మలూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని దిగజారుడు రాజకీయాలకు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేడయం మరో తాజా తార్కానమని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. మహానాడు బ్యానర్లు కనిపించకుండా వైసీపీ నేతల ఫ్లెక్సీలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నది చాలక ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేడయం దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. బుధవారం ( ఈనెల 29)న గుడివాడలో తెలుగుదేశం మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం జండాలు, బ్యానర్లతో గుడివాడ మొత్తం పసుపు మయం అయిపోయినట్లుగా వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కసుతో వైసీపీ నేతలు తెలుగుదేశం బ్యానర్లకు అడ్డంగా వైసీపీ నేతల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది చాలదన్నట్లు ఏకంగా ఎన్టీఆర్ విగ్రహానికే వైసీపీ రంగులు పూశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు మండి పడుతున్నాయి. గుడివాడ మహానాడు కొడాలి నాని పతనానికి నాంది కానుందని చెబుతున్నారు.   ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరిగే మహానాడును విజయవంతం చేసేందుకు  తెలుగుదేశం కార్యకర్తలు కంకణం కట్టుకుని   పని చేస్తున్నారు.

కాంగ్రెస్ కు కేసీఆర్ సరెండర్?

రాష్ట్రపతి ఎన్నికలు తెరాస నిజ రూపాన్ని బయట పెట్టాయా? ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యారా? అంటే అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు.  ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్, అదే విధంగా ఇతర మంత్రులు, తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధ్యక్షురాలు సోనియా  గాంధీ, రాహుల్ గాంధీని దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా , జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నిఅంగీకరించేది లేదని, స్వయంగా కేసీఆర్, కేటీఅర్ అనేక సందర్భాలలో సప్ష్టమైన ప్రకటనలు చేసారు.  కాంగ్రెస్ పార్టీని పనికిమాలిన పార్టీ, దిక్కుమాలిన నాయకత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేతకాని తనం వల్లనే, దేశంలో  బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగిందని తండ్రీ కొడుకులు  తిట్టని రోజు లేదు. అయితే,  కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే అంతల కస్సుమనే కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువుగా ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన ఉమ్మడి అభ్యర్ధి, యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, మంత్రి కేటీఅర్ తో పాటుగా అరడజను మంది వరకూ పార్టీ ఎంపీలు, సిన్హా నామినేషన్ పత్రాలపై సంతాకాలు చేసారు. నామినేషన్ కార్యక్రమలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో చెట్టపట్టాలేసుకుని కనిపించారు.ఇవన్నీ , చూస్తుంటే, అదే అన్జిపిస్తోందని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆలోచనకు స్వస్తి చెప్పి, కాంగ్రెస్ కు సరెండర్ అయిపోయారని, అంటున్నారు.   నిజానికి కేసీఆర్, ఇంచు మించుగా సంవత్సర కాలంగా, జాతీయ  రాజకీయాలపైనే దృష్టిని  కేంద్రీకరించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్ వేర్పాటు చేసేందుకు, చాలా చాలా ప్రయత్నాలు చేశారు. దేశమంతా తిరిగి, అనేక  రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసి చర్చలు జరిపారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోవడంతో కావచ్చును, కొత్తగా జాతీయ పార్టీ తెర మీదకు తెచ్చారు. ఆ దిశగా, కొంత కసరత్తు కూడా చేశారు. ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెపుతున్నారు. అయితే అది కూడా ముడిపడే అవకాశం లేదని తేలడంతో ... పక్షం రోజుల క్రితం కాంగ్రెస్ ఉన్న కూటమితో చేతులు కలిపేది లేదని ప్రకటించిన కేసీఆర్, అదే కూటమితో చేతులు కలిపారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమలో కేటీఆర్ పాల్గొన్నారు.  దీంతో తెరాస, కాంగ్రెస్ సంబంధాలపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటాల యుద్ధం జరుగుతుంటే.. ఇంకోవైపు ఆ రెండు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కలిసిపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి, చాలా కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెరాస, బీజేపీ అవిభక్త  కవలలని ఆరోపిస్తున్నారు . గతంలో  కేంద్ర ప్రభుత్వం  తీసుకున్న కీలక నిర్ణయాలను తెరాస సమర్ధించిన విషయాన్నీ గుర్తు చేస్తూ, తెరాస, బీజేపీ షాడో ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మరో వంక బీజేపీ నాయకులు  కాంగ్రెస్, తెరాస జోడీ పై అవే ఆరోపణలు చేస్తున్నారు. బయటకు  తిట్టుకున్నా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఒకటేనని బీజేపీ నేతలు అరిపిస్తున్నారు. అదే విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. పైగా.. కాంగ్రెస్‌ నేతలకు ఓట్లేస్తే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉండరని, ఇందుకు సంబంధించి కళ్ళముందున్న అనుభవాల ఆధారంగా  ఆలోచించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. గత ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది తెరాసలో చేరారని గుర్తు చేస్తున్నారు.  నిజానికి, రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ఎన్నికల రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీనే, అయినా, ఇంతవరకు కేసేఆర్ ఎప్పడూ కూడా కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రత్యర్ధిగా భావించలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినా, హస్తం పార్టీ ఎమ్మెల్యేలు  పిలవకుండానే తెరాసలో చేరతారనే విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీని ఒక ఫ్రెండ్లీ పార్టీగానే చూస్తు వచ్చారు. కానీ, ఇప్పడు, థర్డ్ ఫోర్సుగా బీజేపీ తెర మీదకు రావడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టడంతో, కేసీఆర్వ్యూ హం మార్చుకుంటున్నారని అంటున్నారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తో ప్రత్యక్ష  పొత్తుకు కూడా వెనకాడక పోవచ్చని   అంటున్నారు.

51 వేల మందికి ‘అమ్మ ఒడి’ ఎగనామం!

దేవుడి స్క్రిప్ట్ అలా ఉంది. నేనేం చేయగలను అంటూ జగన్ అమ్మ ఒడిపై చేతులెత్తేశారు.  రాష్ట్రంలో అమ్మ ఒడి పథకానికి 51 వేల మందిని దూరం చేసేశారు. పైగా ఇందులో నా తప్పేమీ లేదు... మీ పిల్లల హాజరు 75శాతం లేదు.. అది మీ తప్పేనంటూ నెపం తల్లుల మీదకు నెట్టేశారు. ఒక విధంగా 51 వేల మంది అమ్మలను అమ్మఒడి పథకానికి దూరం చేయడం ద్వారా  జగన్ తనకు చాతకాదని బహిరంగంగా ఓప్పుకున్న సందర్భమింది. రాష్ట్రంలో  51 వేల మంది అమ్మలకు అమ్మఒడి ఇవ్వడం లేదని జగన్ బహిరంగంగా అంగీకరించారు. అయితే వారు అమ్మ ఒడికి దూరం కావడానికి మాత్రం తను కారణం కాదని అంటున్నారు.  విద్యార్థుల హాజరు శాతం 75 లేకపోవడం వల్లే  ఆ  తల్లులందరికీ అమ్మ ఒడి ఇవ్వలేదని సాకు చెబుతున్నారు. ఇది ఎంత వరకూ సమంజసమనే   ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. రాష్ట్రంలో ఈ  సారి 51 వేల అమ్మలకు అమ్మ ఒడి ఎగ్గొట్టినట్టు ఏ మాత్రం సంకోచం లేకుండా జగన్ చెప్పడాన్ని పలువురు గర్హిస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా సీఎం జగన్ స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో అమ్మ ఒడి పథకం మూడో విడత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 శాతం హాజరు ఉండాలని అమ్మ ఒడి జీవోలోనే  పొందుపర్చామని చెప్పారు. ఆ జీఓ ప్రకారం 51 వేల మంది తల్లుల పిల్లల హాజరు శాతం నిర్దేశించిన దాని కంటే తగ్గిందని, అందుకే వారికి అమ్మ ఒడి అందించ లేదని చెప్పుకొచ్చారు. పైగా భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తెలత్తకూడదంటే తల్లులు తమ పిల్లల్ని బడికి పంపాలంటూ సలహా పారేశారు.  జగన్ చెప్పిన ప్రకారమే చూసుకుంటే.. అంత మంది విద్యార్థులకు హాజరు శాతం ఎందుకు తగ్గింది? వారంతా ఎందుకు పాఠశాలలకు హాజరు కాలేదు? అనే విషయాన్ని సమీక్షించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి లేదా? అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.   ఒక పక్కన కరోనా వచ్చి విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఆన్ లైన్ తరగతుల పేరుతో ఎందరో విద్యార్థులు ఇళ్ల నుంచే క్లాసులకు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరం పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. బయటికి వెళ్తే   ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గిన మాట వాస్తవమే కావచ్చు. దొరికిందే సందు అనే విధంగా ఎప్పుడు ఏ వంక దొరికితే..   హామీల లబ్ధిదారుల సంఖ్యను కుదించేద్దామా అన్న  రీతిలో జగన్  సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు శాతం నెపంతో వేలాది మంది తల్లులను అమ్మ ఒడి పథకాకి జగన్ సర్కార్ దూరం చేసిందని పలువురు విమర్శిస్తున్నారు. పథకాలను ఎగ్గొట్టే దురాలోచన చేస్తూనే.. అమ్మ ఒడి పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అమ్మ ఒడి పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించడాన్ని తప్పుపడుతున్నారు. స్కూలుకు తమ పిల్లల్ని పంపించే తల్లులకు అమ్మ ఒడి అందిస్తామని హామీ ఇచ్చింది జగన్ అయితే.. విమర్శకులు డబ్బులు ఇచ్చారా? అని అనడంమేమిటని అంటున్నారు.    తన హామీలకు కోతలు పెట్టేందుకు, ఎగ్గొట్టేందుకు దారులు తానే వెదికిన జగన్ రెడ్డి ఇప్పడు ‘అంతా మీరే చేశారు’అన్న రీతిలో విద్యార్థులు, వారి తల్లులపైనే నెపం నెట్టేయడం దారుణం అంటున్నారు. అంత మంది తల్లులకు అమ్మ ఒడి ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తనకు ప్రజల అండ ఉన్నంత వరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరం’టూ మరోసారి తన అక్కసును, అసహనాన్ని బహిరంగంగా వెళ్లగక్కడం విస్మయానికి గురిచేస్తోందంటున్నారు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తల్లికి కూడు పెట్టనోడు.. పినతల్లికి గాజులు చేయించాడు’ అన్న చందంగా పేద విద్యార్థుల కోసం బైజూస్ యాప్ తీసుకొచ్చామంటున్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తారట. ఉన్నది పీకేసి లేనిది ఇవ్వడం అంటే ఇదేనేమో అంటున్నారు.

ముర్ము కి వ్య‌తిరేకం కాదు.. కేటీఆర్‌

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా కు టీఆర్ఎస్  మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా  యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్  వేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్   విలేక‌రుల‌తో మాట్లాడుతూ,  త‌మ‌కు తోచిన విధంగా పాల‌న సాగించేవారికి, ఇత‌రుల సంగ‌తి ప‌ట్ట‌ని వారికి ఎప్పుడూ వ్య‌తిరేక‌తే ఎదుర వుతుందన్నారు. తాము అద్భుతంగా ప‌రిపాలిస్తున్నామ‌ని భ‌జ‌న చేసుకోవ‌డంలోనే బిజెపీ కాలం గ‌డుపుతోందే గాని తెలంగాణా ప్రభుత్వం అభ్య‌ర్ధ‌న‌లు బొత్త‌గా ప‌ట్టించుకోవ‌డంలేదన్న‌ది తెలంగాణ ప్రజల అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా బిజెపీ కూట‌మి ద్రౌప‌ది ముర్మును నిల‌బెట్టింది. ఆమె ఒరిస్సా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తు ల‌కు చెందిన మ‌హిళ అయినా   తెలంగాణా ప్ర‌భుత్వం ఆమెకు మ‌ద్ద‌తునీయ‌డానికి  నిరాక‌రించిం ది. అయితే అది ఆమె ప‌ట్ల వ్యతిరేకత కాద‌ని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకి నిర‌స న‌గానే ముర్ముకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలేద‌ని కేటీఆర్ అన్నారు.  కేంద్రం గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని  చేయ‌డానికి  అంద‌రి మ‌ద్ద‌తు  కోరుతున్నారు కానీ  తెలంగాణా ప్ర‌భుత్వం తెలంగాణాలోని ఏడు గిరిజ‌న మండ‌లాల‌ను త‌మ‌కు తిరిగి ఇవ్వాల‌ని చేస్తున్న డిమాండ్‌ను మాత్రం కేంద్రం పెద్దలు ప‌ట్టించుకోవ‌డం లేదని విమర్శించారు. అలాగే అత్యంత కీల‌క‌మైన గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు గురించి తెలంగాణా ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌న‌ను కూడా కేంద్రం పెడ‌చెవిన పెట్టిందన్నారు.  ఈ ప‌రిస్థితుల్లో  బిజెపి కూట‌మి నిల‌బెట్టిన అభ్య‌ర్ధికి తెలంగాణా ప్ర‌భుత్వం ఏ విధంగా మ‌ద్ద‌తునిస్తుందని ప్రశ్నించారు.  అందుకే విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ ఎస్ మ‌ద్ద‌తునిస్తున్నద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.  ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతి రేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అక్రమాలకు అడ్డూ అదుపూ లే కుండా పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  యశ్వంత్ సిన్హా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు   టీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, డాక్టర్ రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, వెంకటేష్, రవిచంద్ర, పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి భంగ‌పాటు.. బిజెపీకి ఆయాసం!

ప‌రిస్థితులు బాగోన‌పుడు వున్న‌దానితోనే సంతృప్తిప‌డాలి. వ‌చ్చేది ఎలాగూ వ‌స్తుంది గ‌నుక మ‌న స‌త్తా చూపించి ఇత‌రుల‌ను భ‌య‌పెట్టి, కానుక‌లు ఇచ్చి సాధించాల‌న్న ఆతృత‌తో సాధించేది ఏదీ గొప్ప విజ‌యం అనిపించు కోదు. ఇపుడు ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీ గెలిచినా గెలిచిన సంతృప్తి లేకుండాపోయింది. దివంగత మంత్రి మేకపాటిగౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయంప్రకారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి  దూరంగా ఉంది. ఇక ఆది వైసీపీ, బీజేపీ, బీఎస్సీలతోపాటు మొత్తం 14 మంది బరిలో నిలిచారు. టీడీపీ బరిలో లేక పోవడంతో లక్ష ఓట్ల  మెజారిటీ వస్తుందని వైసీపీ అగ్రనాయకులు భావించారు. ఆ లక్ష్మసాదనే ధ్యేయంగా మంత్రులు, ఎమ్మెల్వేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఆత్మకూరులోనే మకాం వేసి ప్రచారాన్ని ఊదరగొట్టారు.  నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మండలానికి ఓ మంత్రి, ఎమ్మెల్యేను  ఇన్ఛార్జులుగా  నియ మించారు. ఇంత చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంత్రుల  రోడ్ షోలు వెల వెల బోవ డం, తాయిలాలు వ్య‌ర్ధ‌మ‌వ‌డ‌మే మిగిలి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఎంత‌చేసినా చివ‌రికి  82,888  ఓట్ల తో వైసీపీ గెలిచింది. పోటీలో వైసీపీకి చుక్క‌లు చూపాల‌నుకున్న బిజేపీ 19,332 ఓట్ల‌తో స‌రిపెట్టుకుంది.   2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు వేల పైచిలుకు నోటాకు రాగా ఇప్పుడు రెండింతల ఓట్లు వేసి అభ్యర్థులందరినీ తిరస్క రించడం గమనార్హం. లక్ష మెజారిటీ కోసం సర్వశక్తులూ ఒడ్డిన వైసీపీ మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా  ఆత్మకూరులోనే! బసచెసినా..గతం కంటే 18 శాతం పోలింగ్ తగ్గుదల వచ్చింది. దీంతో 82.888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి విజయసాధించారు. 19,332 ఓట్లతో  బీజేపీ సరిపెట్టుకోక తప్పలేదు. పాల‌నాప‌ర వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో వెల్లువెత్త‌డంతో వారిని సుముఖం చేసుకో వాల్సి వ‌చ్చి ఓట‌రుకు రూ.500 చొప్పున నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 80 శాతం మందికి పంచిన‌ట్లు స‌మా చారం.  ఇందుకు బాధ్యులుగావలంటీర్లు, పొదుపు వీఏవోలను నియమించు కున్నారు.ఇందుకుగాను వీరికి రూ.5 వేలు చొప్పున ముట్టజె ప్పారు. ఏదో అభివృద్ధి ప‌నుల‌కు ఇచ్చిన‌ట్టు ఇలా పంప‌కాలు చేయ‌డ మేమిటో ప్ర‌భుత్వంవారే సెల‌వియ్యాలి.  ఇక్క‌డ పెద్ద విడ్డూర‌మేమంటే.. ఆత్మ‌కూరు రైతాంగానికి బకా యిలు వెంట‌నే చెల్లించేయ‌డం. జిల్లా మొత్తం మీద ఎంతోమంది రైతులు బ‌కాయిల కోసం వేచి చూస్తుం టే, ఆత్మ‌కూరువారికి మాత్ర‌మే ఆ సౌక ర్యం వెంట‌నే క‌ల్పించ‌డం కేవ‌లం వారి ఓట్ల‌కు గాలం వేయడ మేన‌ని అర్ధ‌మ‌వుతుంది. మ‌రో వంక కాంట్రా క్ట‌ర్ల నుంచి కూడా వ్య‌తిరేక‌త రాకుండా వారికీ బిల్లులు  మం జూరు చేయ‌డం! పోనీ ఇంత‌జేశారు ల‌క్ష మెజారిటీ క‌ల నెర‌వేరిందా అంటే అది కాలేదు. అస‌లు పోలింగ్ శాత‌మే ఆశించిన స్థాయిలో పెర‌గ‌క పోవ‌డ‌మూ గ‌మ‌నార్హ‌మే.  2019 ఎన్నికలతో పోల్చితే 18 శాతం పోలింగ్ తగ్గింది. ఈ ప్రభావం మెజారిటీ పై పడింది.   ఈ ఉప ఎన్నికలో నోటాకు ఎక్కువ మంది.ఓట్లు వేశారు. 2019లో 2 వేల పై చిలుకు ఓటర్లు మాత్రమే నోటాకు ఓటు వేస్తే ఇప్పుడు 4179 మంది నోటాకు ఓటు వేసి అభ్యర్థులందరినీ తరస్క రించడం గమనార్హం. టీడీపీ పోటీలో లేకపోవడం వైసీ పీపై వ్యతిరేకతతో ఎక్కువగా నోటావైపే మొగ్గు చూపారు. బ్యాలెట్ ఓట్లలో సైతం నోటాకు మూడు ఓట్లు రావడం గమనార్హం. ఇక బిజేపీ వారి విష‌యానికి వ‌స్తే, ఆత్మ‌కూరులో గ‌ట్టిపోటీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. 40 నుంచీ 50 వేల ఓట్లు సాధించి రాష్ట్ర‌ పార్టీలో కొత్త వూపు తీసుకురావాల‌నుకున్నారు. అందుకు మేమేమీ త‌క్కువ  తిన్న వాళ్లం కావ‌ని హేమాహేమీల‌ను ప్ర‌చార రంగంలోకి దింపారు.  ఒక దశలో గెలు తమదేనన్నారు . అయితే వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి పోరాడినాకేవలం 19, 332 మాత్రమే సాధించగలిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి 2వేల పైచిలుకు ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ మూడేళ్ల కాలంలో బీజేపీ బలపడిందని చెప్పడానికి  వీలులేని పరిస్థితి ప్రధాన ప్రతిపక్షమైన  టీడీపీ ఎన్నికల బరిలో లేదు కాబట్టి అనంతృప్తి  ఓట్లు బీజేపీకి పడ్డాయనే వాదన ఉంది. ఇక  బీఎస్సీకి  కేవలం 4, 897 ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో వైసీపీ విజ‌యం గ్యారంటీ అని తేలేక  బెట్టింగ్‌రాయ‌ళ్ల హ‌డావుడి  అంతా యింతా  కాకుండా పోయింది.  టిడీపీ పోటీలో లేదుగ‌నుక, ఇక్క‌డ బిజెపీకి అవకాశం లేదుగ‌నుక నిజంగానే వైసీపీ పెద్ద మెజారిటీతో  గెలుస్తుంద‌ని బెట్టింగ్ బాబులు పందాలు కాయ‌డంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు.  వైసీపీ అబ్య‌ర్ధి త‌ప్ప‌కుండ ల‌క్ష మెజారిటీతో గెలుస్తాడ‌ని రెండింత‌ల ఉత్సాహంతో పందాలు కాసిన వారం తా పోలింగ్ ప్రక్రియ‌, ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌ల‌తో నీరుగారిపోయారు. అస‌లు పార్టీవారు ఆశించిన ల‌క్ష మెజా రిటీకి క‌నీసం ద‌గ్గ‌ర‌లో కూడా ఓట్లు ప‌డ‌లేదు.  పోలింగ్ ప్రక్రియపూర్తయినప్పటి నుంచి వైసీపీ మెజార్టీపై కొందరు, బీజేపీకి 15 వేలఓట్లు కూడా దాటవని మరి కొందరు బెట్టింగులు కాశారు. జిల్లాలోనే ఇతర జిల్లాల్లో సైతం బెట్టింగ్ల జోరు కొనసా గింది. పోలింముందు నుంచే కొంతమంది ఆత్మకూరు నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేసుకుని వెళ్లడం గమనార్హం. వైసీపీకి  అత్యధిక మెజార్టీ వస్తుందని కొందరు, ప‌ది వేలకు పైబడి మెజారిటీ దక్కదని మరికొందరు పందేలు కాసినవారికి ఎదురుదెబ్బ తగిలింది. 

పుట్టలో వేలు పడితే చీమ కుట్టదా.. వర్షాలు పడితే రోడ్డు పాడవ్వదా.. !

ఆడలేక మద్దెలోడు అన్నట్లుంది వైసీపీ తీరు. వైసీపీ హయాంలో ఏపీలో రోడ్లు ధ్వంసం కావడానికి కారణం వర్షాలట. అదే చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో వర్షాలు పడలేదు కనుక రోడ్లు పాడు కాలేదట. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన వైసీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించిన మహా రహస్యమిది. ప్లీనరీలో మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ  జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో 95శాతం నెరవేర్చిందని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో అయితే ఇచ్చిన హామీలలో అధిక శాతం హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. పుట్టలో వేలెడితే కుట్టనా అన్నదట చీమ.. అలాగే వర్షాలు పడితే రోడ్లు పాడవ్వవా అంటున్నారు పెద్ది రెడ్డి. కరోనా కారణంగా గత రెండేళ్లూ ప్లీనరీ జరుపుకోలేకపోయామనీ, ఈ ఏడాది జూలై 8, 9 తేదీలలో వైసీపీ ప్లీనరీ ఘనంగా జరుపుకుంటామని అన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాను పొల్గనకపోవడంపై విపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నాయనీ, తనకు బాధ్యతలు ఎక్కువ కావడం వల్లనే గడపగడపకూ వెళ్లలేకపోయాననీ అన్నారు. అయినా తాను గడప గడపకూ వెళ్లడమెందుకు.. నేరుగా సమస్యలు తనకు తెలియజేస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు.  గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో 95 శాతం హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని అందుకే రోడ్లు పాడౌతున్నాయని పెద్దిరెడ్డి వెల్లడించారు. అయినా పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు.

ఇంత‌కంటే రెచ్చ‌గొట్టే చ‌ర్య ఉంటుందా?

త‌మ పార్టీ నిర్మాత విగ్ర‌హం వ‌ద్ద వైసీపీ ప్ర‌భుత్వం డివైడ‌ర్లు ఏర్పాటు చేసింద‌ని టిడీపీ శ్రేణులు రెచ్చి పోయారు. డివైడ‌ర్ల‌ను కాళ్ల‌తో త‌న్ని కూల్చేసిన సంఘ‌ట‌న నెల్లూరు న‌ర్త‌కీ సెంట‌ర్ లో జ‌రిగింది.  ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం టిడీపీని రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక వైసీపీ ప్ర‌భుత్వం ఈ విధ‌మైన దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డు తోందని టీడీపీ వ‌ర్గీయులు తీవ్ర‌స్థాయిలో నిల‌దీశారు. అస‌లే రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు అన‌నుకూలించ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం టీడీపి వ‌ర్గాల‌కు అన్ని విధాల స‌మ‌స్య‌లు క‌ల్పించాల‌న్న త‌లంపుతోనే ప్ర‌తీ చిన్న అంశాన్ని ర‌చ్చ‌చేసి వీధి పోరాటాల‌కు దిగు తున్నారు. వాస్త‌వానికి న‌ర్త‌కి  సెంట‌ర్‌లోని ఎన్టీఆర్  విగ్ర‌హం ద‌గ్గ‌ర డివైడ‌ర్ ఏర్పాటు  పార్టీ వర్గీయుల‌ను రెచ్చగొట్ట‌డానికి చేప‌ట్టిన చ‌ర్యేన‌ని న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులు  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లూ  రోడ్డ‌పై  బైఠాయంచారు. కార్పోరేష‌న్ అధికారుల‌ను తీవ్ర‌స్థాయి లో నిల‌దీస్తూ భారీ నినాదాలు చేశారు. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితుల‌ను అదుపు లోకి తెచ్చారు.ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ విగ్రహం వద్ద అడ్డంగా డివైడర్ కడితే నేనే పగలగొట్టా.. ఏం పీకుతారు?’ అంటూ సవాల్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజకీయం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒక వైపున రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం వద్ద డివైడర్ ను అడ్డంగా ఎలా కడుతుందని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతి లేదని, జిల్లా వ్యాప్తంగా అనేక  ప్రాం తాల్లో ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. నర్తకి సెంటర్లో డివైడర్ కావాలని  ఎవ రడిగారని, ఎందుకు నిర్మిస్తున్నారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

ఆనవాయితీకి చెల్లు చీటీ.. సీజే ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ దూరం

ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోందనడానికి మరో తార్కానం, మంగళవారం రాజ్ భవన్ లో తెలంగాణ కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమత్రి కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులైన సంగతి విదితమే. ఆయన మంగళవారం అంటే జూన్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ తమిళి సై రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి  రాజ్ భవన్ నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆహ్వానం అందింది. అయితే ఆయన సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే విషయంలో సీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కోబోవడం లేదు.  ఇందుకు ఆయన తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ శాట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.  అయితే టీశాట్ ప్రారంభం సాకు మాత్రమేనని, ఆయన ఉద్దేశపూర్వకంగానే సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాగా గతంలో తెలంగాణ తొలి  సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారాన్ని సంప్రదాయానికి భిన్నంగా రాజ్ భవన్ లాన్స్ లో ఘనంగా నిర్వహించేందుకు చొరవ చూపిన కేసీఆర్ ఇప్పుడు రాజ్ భవన్ లో సీజేగా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టడమే రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య పెరిగిన అగాధానికి తార్కానంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం కావాలనుకుంటే అంటే లేదా కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలనుకుంటే టీశాట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకోవడం ప్రభుత్వం చేతిలో పని.. ఒక వేళ వాయిదా వద్దనుకుంటే సమయాన్ని మార్చుకునే వీలు కూడా ఉంటుంది. అయితే కేసీఆర్ ఆ రెండూ చేయకుండా ఏకంగా సీజే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండటానికే నిర్ణయించుకోవడాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ తొలి సీజేగా రాథాకృష్ణన్ ప్రమాణ స్వీకారం సమయంలో అప్పటి గవర్నర్ తో సీఎం కేసీఆర్ కు సత్సంబంధాలు ఉండేవి, దాంతో తొలి సీజే ప్రమాణ స్వీకారోత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో రాజ్ భవన్ లోకి అడుగు పెట్టేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదు. అందుకే ఆనవాయితీకి భగం  కలిగినా భే పర్వా అన్నట్లుగా కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండేందుకే నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మహా రెబెల్స్ పై పిల్.. రాజ్ థాకరేతో షిండే ఫోన్ సంభాషణ!

ఒకే కుటుంబంలా వున్న‌వాళ్లు విడిపోకూడ‌దు. అయినా విడిపోతే వారి దారిలో వారు వుండాలి.  ఇది మామూలు ఇంటి గొడ‌వ‌ల‌యితే అలానే వుంటారు. కానీ రాజ‌కీయాల్లో అది అంత సుల‌భం కానేకాదు. అందునా మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఇపుడు త‌లెత్తిన సంక్షోభ స‌మ‌యంలో అస‌లుకే కుద‌ర‌దు.  థాక్రే పాల‌నా విధానం బాగోలేద‌నే షిండే బ‌య‌ట‌ప‌డి, మ‌రికొంద‌రిని త‌న‌వేపు తిప్పుకుని తిరుగుబాటు ప్ర‌క టించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్రంలో, పార్టీలో నానా గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ప్రభుత్వం లో ఇలా గంద‌ర‌గోళం సృష్టించి పాల‌న‌కు అడ్డుప‌డిన రెబెల్స్ మీద ఆగ్ర‌హించి జ‌స్ట్  ఏడుగురు పౌరులు ముంబై హైకోర్టులో పిల్ వేసేరు.  ఏదో అలిగి వెళ్ల‌వ‌చ్చుగాని ఇలా రాష్ట్ర‌ప‌రిస్థితులు, ప్ర‌భుత్వం న‌డ‌వ కుండా చేయ‌డం మంచిదికాద‌ని, థాక్రేతో సంప్ర‌దించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని  మ‌ళ్లీ అన్న ద‌మ్ముల్లా క‌లిసిపోవాల‌ని, తిరిగి వ‌చ్చి  ప్ర‌భుత్వ‌, పార్టీ  కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కోర్టు  ద్వారా  ఆ ఏడు గురు త‌మ పిల్ లో కోరారు. ప్ర‌జ‌లు ఇంత అమాయ‌కంగానే వుంటారు. ఎక్క‌డ‌యినా.  కానీ అధికారం లో వున్నవారు, తిరుగుబాటు బావుటా ఎత్తినవారు అంత అమాయ కులు కాద‌న్న‌ది ఈస‌రికే మ‌రాఠా  వారికి తెలిసే వుండాలి. అయినా ఏదో మ‌నోళ్లు మ‌న మాట ఇన‌క‌పోతారా అన్న అభిప్రాయంతో పిల్ వేసి వుంటా ర‌నే అనుకోవాలి.  స‌మాజ సేవ‌లో త‌రించాల్సిన‌వారు ఈ విధంగా రాజ్య‌ధికారం కోసం విభేదించి ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించి దూరంగావ‌డం, సంక్షోభం సృష్టించ‌డం స్వార్ధ‌ప్ర‌యోజ‌న‌మే అవుతుంద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అంతేగాక ప్ర‌స్తుతం అనేక‌మంది మంత్రులు విడిపోవ‌డంతో శివ‌సేన నాయ‌క‌త్వంలోని ఎం.వి.ఏ  ప్ర‌భు త్వం ఏ విధంగా స‌వ్యంగా పాల‌న సాగిస్తుందో, అందుకు ఎలాంటి వ్యూహాలు వున్న‌దీ స్ప‌ష్టం చేయా ల‌ని పిటిష‌న్‌లో ప్ర‌శ్నించారు.   ఏక్‌నాథ్ షిండే గ‌త వారం రోజులుగా శివ‌సేనా ప్ర‌భుత్వానికి ఎదురుతిరిగిన ఇత‌ర రెబెలియ‌న్స్‌తో గౌహ‌తీ లో వున్నారు. వీరే కాదు మ‌రో 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా వుంద‌ని, మ‌రీ ముఖ్యంగా వారిలో 40 మంది శివ‌సేన‌వారే వారే వున్నార‌ని షిండే ధీమా వ్య‌క్తంచేశారు.  కాగా త‌న‌ను త‌న‌తో పాటు మ‌రో 15 మంది ఇత‌ర రెబెల్ లెజిస్లేట‌ర్ల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ డిప్యూటీ స్పీక‌ర్ న‌ర‌హ‌రి జిర్వాల్ నోటీసు ఇవ్వ‌డం పై  షిండే సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. డిప్యూటీ స్పీక‌ర్ నోటీసు అనైతిక‌మ‌ని, రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని షిండే ఆరోపించారు.  బావ కొంప‌కూల్చి  ఆయ‌న త‌మ్ముడిని  బాగున్నారా అని అడిగింద‌ట వెన‌క‌టి  ఒకామె. అలానే వుంది షిండే వ్య‌వ‌హారం. ఆదివారం షిండే  ఉద్ధ‌వ్ థాక్రే స‌మీప బంధువు రాజ్ థాక్రేతో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడార‌ని మ‌హా రాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన (ఎం ఎన్ ఎస్‌) పార్టీ నాయ‌కుడు ఒక‌రు తెలియ‌జేశారు. ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర రాజ కీయ ప‌రిస్థితులు ఎలా వున్నాయి, రాజ్ ఆరోగ్యం ఎలా వుంద‌ని అడిగి తెలుసుకున్నార‌ట‌. ఎం ఎన్ ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఆదివార‌మే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సంగ‌తి తెలిసి షిండే  ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగిన‌ట్టు వార్త‌. శివ‌సేన నుంచి 2006లో విడిపోయిన రాజ్ ఎంఎన్ ఎస్ పేర సొంత దుకాణం పెట్టారు.  కాగా శివ‌సేన కి చెందిన 38 ఎమ్మ‌ల్యేల మ‌ద్ద‌తు త‌న‌కు వుంద‌ని అసెం బ్లీలో అస‌లు సేన గ్రూప్‌గా గెల‌వ‌డానికి వారి మ‌ద్ద‌తు స‌రిపోతుంద‌ని షిండే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 

జగన్ రెడ్డి రక్షణకు కమల దళం కుట్రలు

ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీకి ఉన్న బలమేమిటో,బలహీనతలు ఏమిటో, అందిరికీ తెలిసిందే. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, కమల దళం రాష్ట్రంలో రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు సాగిస్తోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  ఉదాహణకు ఆత్మకూరు ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే, బీజేపీకి డిపాజిట్  రాలేదు, కానీ, గతంతో పోల్చుకుంటే, ఉప ఎన్నికల్లో కొంచే ఎక్కువ ఓట్లు అయితే వచ్చాయి. అయితే, ఆ మాత్రంగా ఓట్లు వచ్చాయంటే, అందుకు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. అదేమీ రహస్యం కాదు ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లుగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేక పోవడం వలన, బీజేపీ అభ్యర్ధికి 14 శాతం ( 19 వేల చిల్లర ఓట్లు) పైగా ఓట్లు వచ్చాయి. అయితే అది బలుపు కాదు వాపు మాత్రమే. బీజేపీ నాయకులూ మురిసి  పోయేంత గొప్ప ముందడుగు అయితే అసలే కాదు.  అందుకే,  పార్టీలో కొందరు నాయకులు వాపును చూసి బలుపని సంబర పడుతున్నా పార్టీ పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన సీనియర్ నాయకులు మాత్రం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ బలమేమిటో, బలహీనతలు  ఏమిటో, ఎవరికి తెలిసినా తెలియక పోయినా, పార్టీ జాతీయ నాయకత్వానికి మాత్రం బాగా తెలుసునని అంటున్నారు.   నిజం, రెండు పార్టీలు వ్యవస్థ  బలంగా బలంగా స్థిర పడిన రాష్ట్రంలో, మరో పార్టీ కాలు పెట్టి నిలదొక్కుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకే, కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపే ఒంటరి పోరాటం చేయలేక పోయింది. బీజేపే జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. తెలుగు దేశం పంచన తలదాచుకుంది. అక్కడొకటి ఇక్కడ రెండు అన్నట్లుగా,  నాలుగు స్థానాలు గెలుచుకుని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తూ వచ్చింది.   అదే క్రమమలో రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014 ఎన్నికలలోనూ తెలుగు దేశంతో పొత్తును కొనసాగించింది. ఏపీ నుంచి నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా రెండు మంత్రి పదవులు దక్కించుకుని. అలాగే, కేంద్రంలో ప్రధాని మోడీ మంత్రి  వర్గంలో తెలుగు దేశం పార్టీ  చేరింది. అయితే, 2018లో  ఉభయ పార్టీల మధ్య ‘ప్రత్యేక హోదా’ విషయంలో పేచీ రావడంతో, పొత్తు చెడింది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర. 2019 ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ, అధికారం కోల్పోయింది. ఇక ఇప్పడు ప్రస్తుతానికి వస్తే, జాతీయ స్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ  పంధా మార్చింది. ఉత్తరాది, దక్షిణాది అని  లేకుండా విస్తరణ యాత్రను ప్రారంభించింది.  రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాలలో అంచెలంచెలుగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే, ఏపీ మీద కూడా కమల దళం కన్నేసింది. ఈశాన్య రాష్ట్రాలలో  సక్సెస్ అయిన ఫార్ములాను ఎపీలోనూ ఇంప్లిమెంట్’ చేసే ప్రయత్నం సాగిస్తోంది. అధికార వైసేపీతో అంటకాగుతూ, తెలుగు దేశం పార్టీ టార్గెట్’ గా రాజకీయం చేస్తోంది. నిజానికి,రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే. ఆ పార్టీ పరిస్థితి ఏమిటో, 2019 ఎన్నికల్లోనే తెలిపోయింది. నోటా’కంటే తక్కువగా ఒక శాతానికి కొంచెం అటూ ఇటుగా ఓట్లు పోలయ్యాయి.   అందుకే ఇప్పుదు బీజేపీ కొత్త  ఎత్తు వేసింది, వైసీపీ కి అండగా నిలిచి తెలుగు దేశం పార్టీని మరో మారు ఓడించేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే, వైసీపే వ్యతిరేక ఓటును చెల్చేందుకు, కుటిల యత్నాలు సాగిస్తింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పావుగా ఉపయోగించుకుంటోంది. నిజానికి పవన్ కళ్యాణ్’ వైసేపీ ప్రభుత్వ దుర్మార్గ, దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని  రక్షించే, లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేయాలని ప్రతిపాదించారు. అయితే, ఒకటి  తర్వాత ఒకటిగా ప్రాంతీయ పార్టీలను దిగమింగే యోచనతో ముందుకు సాగుతున్న బీజేపీ, తెలుగు దేశం, జనసేన పొత్తుకు అడ్డుపుల్లలు వేస్తోంది.మోకాలడ్డుతోంది. ఆయనలో అనవసరపు ఆశలు రేకెత్తించి, టీడీపీకు దూరం చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగింఛి, సామాజిక సమీకరణలను తారుమారు చేసే కుట్రకు పథకం రచిస్తున్నట్లు, తెలుస్తోంది.  అయితే, ఆంధ్ర ప్రదేశ్’లో కమల దళం వ్యూహాలు ఫలిస్తాయా అంటే, అది అంత ఈజీ కాదని,, సామాన్యుల నుంచి విశ్లేషకుల వరకు అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా  ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న నేపధ్యంలో, ఒక్కసారి మోసపోయిన ప్రజలు మరొక్కసారి మోస పోయేందుకు సిద్ధంగా లేరని రాజకీయ పండితులు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రానికి ఏ మేలు చేయని బీజేపీతో చేతులు కలపడం వలన. ఆపార్టీ అనుసరించే  హిందూమతోన్మాదం విధానాల వలన జనసేన కూడా మూల్యం చెల్లించవలసి వస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  నిజానికి, పొత్తులు, ఎత్తులు, రాజకీయ,సామాజిక సమీకరణలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజానీకం మాత్రం వైసీపీ వినాశకర విధానాలనుంచి, రాష్ట్రాన్ని రక్షించే సామర్ధ్యం ఒక చంద్రబాబుకు మాత్రమే ఉందని, వైసీపీకి టీడీపీ తప్ప మరో ప్రత్యాన్మాయం అయ్యేపని కాదని నిర్ణయానికి వచ్చారని, విశ్లేషకులు అంటున్నారు.

బిజెపీకి మిగిలింది మౌత్ టాకే!

ఎవ‌ర‌యినా పెళ్లికో, మ‌రేద‌యినా శుభ‌కార్యానికో వూళ్లో అంద‌రినీ ఆహ్వానిస్తారు. అందుకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తారు.  తెలిసి తెలిసి ప‌డ‌ని వారిని,  తిట్టుకునేవారిని  ఆహ్వానిస్తారా?  అస‌లు వారికి ఇంటివేపు వ‌చ్చే అవ‌కాశం కూడా ఇవ్వ‌రేమో!  ప్ర‌స్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ ఎస్ ఇలాంటి ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌యింది.  త‌మ పాల‌నను, త‌మ నాయ‌కుల‌ను దాదాపు ప్ర‌తీ వేదిక  మీదా తిడుతూ, రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, కామెంట్లు చేస్తున్న బిజెపీ వారిని మాత్రం వూరికే వ‌దిలేస్తుందా? స‌రిగ్గా వారి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించాల్సిన స‌మ‌యానికి ఫ్లెక్సీల‌తో, బ్యాన‌ర్ల‌తో ఏమీ తోచ‌ని స్థితి క‌ల్పించింది. పాత‌ రోజుల్లో ప‌డ‌ని పార్టీవారి నాయ‌కులు, ప్ర‌చార‌క‌ర్త‌ల ఇళ్ల‌మీద పిడ‌క‌లు వేయ‌డం, బొగ్గుతో  నినాదాలు రాయ‌డం బాగా పోటా పోటీగా సాగేది. అప్ప‌ట్లో అదో యుద్ధం. ఇప్పుడు అత్యాధునికంగా ఫ్లెక్సీ ల‌తో దాదాపు యుద్ధ‌ ప్ర‌క‌ట‌నే కావిస్తున్నారు.  టిఆర్ ఎస్ పాల‌న‌లో రాష్ట్రం దారుణంగా త‌యార‌యింద‌ని, కుటుంబ పాల‌న‌లో ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతాంగం నానా  అవ‌స్థ‌లూ ప‌డుతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో దాడుల‌కు దిగింది తెలంగాణా బిజెపీ. అవ కాశం దొరికిన‌ చోట‌ల్లా టిఆర్ ఎస్ నాయ‌కుల మీద వ్య‌తిరేక‌త‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు, బీజేపీ నేతలు. కేంద్రం నుంచి ఎంతో స‌హాయం అందుతున్నా పైసా అంద‌లేద‌ని,  రాష్ట్రం మీద సీత క‌న్నువేశార‌ని బిజెపిని దుమ్మెత్తి పోస్తున్న టిఆర్ ఎస్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీఠం దింపేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో  బిజెపి జాతీయ నాయ‌కుల సైతం రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ఇక్క‌డి పాల‌నా లోపాల‌ను, ప్ర‌జ‌ల్ని కేసీఆర్ కుటుంబం మోసం చేస్తోం ద‌ని ఎడ‌ తెగ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. బండి లాంటి బిజెపీ నాయ‌కుల‌కు టిఆర్ ఎస్ పై వాగ్ధాటితో దాడి చేయ‌డం త‌ప్ప వేరే ప‌నిలేద‌ని టిఆర్ ఎస్ తిడుతోంది. రాష్ట్రం నుంచీ కేంద్రం ఎంతో పొందుతూ రాష్ట్రానికి మొండిచేయి చూప‌డం కేవ‌లం అధికార కాంక్ష‌తో వ్య‌వ‌హ‌రించడమేననీ, ఈ  తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రిస్తున్నారు. బిజెపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య ఈ యుద్ధాన్ని త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనే  ఇక్క‌డ వ‌చ్చే నెల 3, 4 తేదీల్లో  బిజెపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాన్ని నిర్వహించ త‌ల‌పెట్టారు.  అస‌లు రాష్ట్రం గురించి ప‌ట్టించుకోనివారు, త‌మ అభ్య‌ర్ధ‌న‌ల‌ను తిర‌స్క‌రిస్తున్న‌వారికి ఇక్క‌డ అంత సుఖంగా ఏద‌న్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకోను ఎలా వీలుంటుంది? మెట్టినింట కూతురు పడుతున్న  ఆరళ్ల‌ను విన్న త‌ల్లి వారిని ఎలా గౌర‌విస్తుంది?  బిజెపీ ఇక్క‌డ స‌మావేశాలు నిర్వ‌హించాల‌నుకోవ‌డం పెద్ద ర‌హ‌స్య మేమీ లేదు. ఇలాంటి పార్టీ స‌మావేశాలు కేవ‌లం ఇక్క‌డి అధికార పార్టీని, సీఎంను తిట్ట‌డానికి, బిజెపి చేస్తున్న సాయం వృధా చేస్తున్న‌ద‌ని భారీ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌కు టిఆర్ ఎస్ ప‌ట్ల విముఖ‌త వ‌చ్చేలా చేయ‌డ‌మే క‌మ‌ల‌నాధుల ల‌క్ష్యం. అయితే ఈ స‌మావేశాల ల‌క్ష్యం ఏమాత్రం స‌ఫ‌ల‌మ‌వుతుంద‌న్న‌ది ప్ర‌జ‌ల స్పంద‌నే తెలియ‌జేస్తుంది. ప్ర‌స్తుతం స‌మావేశాల నిర్వ‌హ‌ణ గురించి భారీ ప్ర‌చారం చేసుకోవా ల‌నుకున్న పార్టీ వ‌ర్గాల‌కు  టిఆర్ ఎస్ శ్రేణులు  ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌కే  జానెడు స్థ‌లం ఏ గోడమీదా మిగల్చలేదు. ఆఖరికి మెట్రో స్తంభాలను కూడా తెరాస ప్రకటనలతో నింపేశాయి. తెలంగాణ‌లో టిఆర్ ఎస్‌, బిజెపీ మ‌ధ్య పోరు తీవ్రతను ఇది   స్ప‌ష్టం చేస్తోంది.  ఇపుడు మ‌రి వ్య‌తిరేక‌త‌ను త‌మ వాగ్ధాటితో ప్ర‌చారం చేసినంత‌గా బిజెపీ వ‌ర్గీయులు త‌మ స‌మావేశం గురించి ప్ర‌చారం ఎలా చేయ‌గ‌ల‌రో చూడాలి.  ఎందుకంటే  ఇక సిటీలో బీజేపీకి ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ కు  తావు లేకుండా చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది.  ఎల్ అండ్ టి, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో  టీఆర్ఎస్ వారం రోజులు ప్రి ప్లాన్డ్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2300 లకు పైగా మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రచారం నిర్వహిస్తోంది. సిటీలోని వెయ్యి బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మొత్తానికి బీజేపీ తేరుకునే లోగా టీఆర్ఎస్ పని చక్కబెట్టేసింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో వేచి చూడాలి.

అగ్నిప‌థ్ అమ‌లుకు కేంద్రానికి అంత తొందరేల?

అగ్నిపథ్ పథకానికి దాని కారణాలు ఉన్నాయి, అయితే ప్రభుత్వం దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాల్సింది. ఇందుకు హ‌డా వుడి ప‌డి అంద‌ర్నీ గంద‌ర‌గోళానికి, వ్య‌తిరేక‌త‌కు గుర‌య్యే ప‌రిస్థితులు కొని తెచ్చుకుందేమో?  కొన్ని ప‌థ‌కాలు, నియ‌మ నిబం ధ‌న‌లు బాగానే వుండ‌వ‌చ్చు. వాటిని అమ‌లు చేయ‌డంలో మంచే జ‌ర‌గ‌వ‌చ్చు కానీ దాన్ని ప్ర‌జ‌లు, నిరుద్యోగులు ముఖ్యంగా వెంట‌నే అర్ధంచేసుకుంట‌ర‌నుకోవ‌డం తొంద‌ర‌పాటు చ‌ర్యే అవుతుంది. ఆర్మీ వుద్యోగాల‌కు ప్ర‌య‌త్నించే యువ‌త‌కు ఆ మాత్రం ఆలోచ‌న వుండ‌దా అని మోదీ ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగానే ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. కానీ బిజెపి స‌ర్కార్ త‌ల‌చింది  దేశంలో ఆ వుద్యోగార్ధం తీవ్ర ప్ర‌య‌త్నాల్లో వున్న యువ‌త మ‌రోలా అర్ధంచేసుకుంది. ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది. ఇది దేశ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టించ‌డం చూస్తున్నాం. కానీ మోదీ ప్ర‌భుత్వం మాత్రం   త‌మ‌ది ముమ్మాటికి స‌ర‌యిన నిర్ణ‌య‌మే అంటోంది.  గ‌తంలో వున్న‌ టూర్ ఆఫ్ డ్యూటీని అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌గా మార్చారు, జూన్ 14న సర్వీస్ చీఫ్‌లతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ స్కీమ్ కింద, రిక్రూట్‌మెంట్ నాలుగు సంవత్సరాల కాలానికి చేపట్తుంది, ఈ పోస్ట్‌లో అందరూ తొలగించబడతారు, దాన్నుంచీ 25 శాతం మందిని ఈసారి శాశ్వత ప్రాతి పదికన తిరిగి తీసు కోవచ్చు. ఇది రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక వ్యవహారాల విభాగం యొక్క ఆలోచన అని కొందరు పేర్కొంటుండగా, ఇది ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రూపొందించబడింది, ప్రణాళిక చేయబడింది మరియు ముందుకు వచ్చింది. బలగాలు, గత కొన్ని నెలలుగా, తమపై విధించిన షరతులు మరియు షరతులను ఎదుర్కోవడానికి పోరాడుతున్నాయి. అంతిమంగా, ఒక రాజీ కుదిరింది మరియు పథకం ఇప్పుడు అమలులో ఉంది. దళాలపై ఒత్తిడి పెంచడానికి, కోవిడ్-19 సాకుతో ప్రభుత్వం గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్‌ను నిషేధించింది, అయితే సంవత్సరానికి సుమారు 60,000 మంది సిబ్బంది పదవీ విరమణలు నిరాటంకంగా కొనసాగాయి. రిక్రూట్‌మెంట్‌ను ఆపడం అనేది బలగాల ప్రమేయం లేకుండా వారి బలాన్ని తగ్గించడం, అలాగే రిక్రూట్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించడానికి అగ్నిపథ్ స్కీమ్‌ను అంగీకరించేలా బ్లాక్‌మెయిల్ చేయడం కూడా ఒక పద్ధతి. చివరకు దానిని ప్రధానమంత్రి సమర్పించి ఆమోదించారని, దానిని సేవల గొంతులోకి ఎవరు నెట్టారని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశం అనేది ఒక వ్యక్తి, నాయకుడి దృష్టి కారణంగా మాత్రమే సాధ్యమయ్యే విపత్తుగా పేర్కొనబడిన ఒక కాన్సె ప్ట్‌ను విక్రయించడానికి జరిగిన సంఘటనగా కనిపించింది. సైన్యం మాత్రమే 2019-20లో 80,000 మందిని , 2018-19లో 53,000 మందిని రిక్రూట్ చేసుకుంది మరియు వీరు 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పెన్షన్ పొంద గలరు. వార్షిక తీసుకోవడం సగటులు 50,000 కంటే ఎక్కువ. 40,000-50,000 మందిని రిక్రూట్ చేయాల్సిన అగ్నివీర్‌ల సంఖ్య కేవలం నాలుగేళ్ల‌కు మాత్రమే ఉంటుంది. ఉద్యోగ ఖాళీల పెంపునా లేక తగ్గింపునా? రిక్రూట్‌మెంట్‌లో అందరికీ ప్రవేశం ఉంటుందా లేదా ప్రధానంగా ఐటీఐ అర్హత ఉన్నవారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేట ప్పుడు గందరగోళం నెలకొంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్సీ పేర్లు లేదా విభిన్నమైన పెరుగుద‌ల‌ను ఇవ్వడం వల్ల యువత నాలుగు సంవత్సరాల ఆనందకరమైన జీవితం తర్వాత ఎదుర్కొనే అనిశ్చితిని మార్చదు. ప్రభుత్వ ఉద్దేశం, ఇటీవలి సంవత్సరాలలో, సాయుధ దళాల పెరుగుతున్న పెన్షన్ మరియు జీతాల బడ్జెట్‌ను తగ్గించడం. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల మాదిరిగా కాకుండా, 2004 నుండి ఉద్యోగులందరూ జాతీయ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నారు మరియు కొంత భాగాన్ని వారి స్వంత పెన్షన్‌ల కోసం చెల్లిస్తున్నారు, బలగాలు ఇప్పటి వరకు కొనసాగాయి. కారణం ఏమిటంటే, సాయుధ దళాల సభ్యులు 60 సంవత్సరాల వరకు సేవలందించే వారి సహచరులతో పోలిస్తే, ఎక్కువగా 40 ఏళ్లలోపు ముందుగానే పదవీ విరమణ చేస్తారు. ఇది బలగాల యొక్క యవ్వన ప్రొఫైల్‌ను నిర్ధారించడం. ఇది భారతదేశానికి ప్రత్యేకమైనది కాదు, ప్రపంచ ప్రమాణం. వ్యక్తి తన భవిష్యత్ ఉపాధిలో సహాయం చేయడంపై ప్రభుత్వం పెద్ద వాదనలు చేసింది. 15 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసిన వారికి సహాయం చేయడంలో ఇది ఇప్పటివరకు విఫలమైంది. తమకు కేటాయించిన కోటాలను ఒక్క మంత్రిత్వ శాఖ గానీ, రాష్ట్రం గానీ తీసుకోలేదు. గ్రహించిన సంఖ్యలపై ఏ ఏజెన్సీకి ఎవరూ జవాబుదారీగా ఉండరు. సీఏపీఎఫ్ లు, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు అగ్నివీర్‌లకు అనువైన మార్గాలు, అయితే హోం మంత్రిత్వ శాఖ వాటిని సీఏపీఎఫ్ లలోకి అంగీకరించడానికి నిరాక  రించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానం సూచనల ఆధారంగా కేటాయించిన కోటాలో రిక్రూట్‌మెంట్ చేస్తాయి, వీటిని సైన్యం చేయదు. వారు వారి స్వంత ప్రమాణాలను కలిగి ఉన్నారు, ఇది ఆర్మీకి భిన్నంగా ఉంటుంది. వ్యక్తి తనను తాను రక్షించు కోవలసి ఉంటుంది. ఆయుధాన్ని నిర్వహించడం, యూనిఫాం ధరించడం అంటే అతను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూ రిటీ గార్డుగా ఉండగలడని సూచిస్తుంది, ఇది చాలా మంది అనుభవజ్ఞులు చేస్తున్నది. సేవ ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ బ‌య‌ట‌ ఎటువంటి విలువను కలిగి ఉండదు. అందువల్ల, అటువంటి పథకాన్ని అమలు చేయడానికి ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఇది ఏదో తప్పిపోయినట్లు కనిపిస్తుంది. చివరగా, కొన్ని సంవత్సరాల తర్వాత, న్యాయస్థానాలు ప్రభుత్వ ఆదేశాలను తిప్పికొడుతూ, వాటిని శాశ్వతంగా విలీనం చేయా లని లేదా పూర్తి పదవీకాలాన్ని అందజేసే వారికి వచ్చే అన్ని ప్రయోజనాలను అందించాలని ఆదేశాలు జారీ చేస్తాయి. మహిళా అధికారులు మరియు షార్ట్ సర్వీస్ అధికారులతో అలా చేసింది. తరువాత ఏమిటి? ఇది గల్లంతైన మరో పథకం అవుతుందా? సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఆదర్శవంతంగా, ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉండాలి, అది అంచనా వేయబడి, ఆపై బోర్డు అంతటా అమలు చేయబడి ఉండవచ్చు. అయితే, బదులుగా అగ్నిపథ్ దళాల గొంతులోకి నెట్టబడింది. సాయుధ బల గాలు, అగ్నివీరులు దాని నుండి ప్రయోజనం పొందగలరా అనేది కాలమే నిర్ణయిస్తుంది.  జాతీయ భద్రతపై చేసే ఖర్చు పెట్టుబడి అని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, వారు చెప్పినట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్ట‌డం కాదు.

ప్రపంచవ్యాప్తంగా బ‌డికి బయట 78.2 మి. పిల్ల‌లు.. యు. ఎన్‌ నివేదిక

ఒక  కొత్త నివేదిక ప్రకారం, విద్యా సహాయం అవసరమయ్యే సంక్షోభ ప్రభావిత దేశాలలో పాఠశాల వయ స్సు పిల్లల సంఖ్య 2016 లో 75 మిలియన్ల మంది వుండ‌గా,  ప్రస్తుతం 222 మిలియన్లకు పెరిగిందని ఐక్యరాజ్యసమితి జూన్ 21, 2022న ప్రచురించిన నివేదిక  పేర్కొన్న‌ది. వారిలో, 78.2 మిలియన్లు తరచుగా దీర్ఘకాలిక సంఘర్షణలు, అత్యవసర పరిస్థితుల కారణంగా పాఠశాలకు దూరంగా ఉన్నారు. సంక్షోభం బాధిత పిల్లల సంఖ్య,  విద్య అవసరం ఉన్న కౌమారదశలోని వారు అనే విశ్లేషణ ప్రకారం, బడి బయట ఉన్న పిల్లలలో 54 శాతం మంది బాలికలు, 17 శాతం మంది క్రియాత్మక ఇబ్బందులతో బాధపడుతున్న పిల్లలు,16 శాతం మంది బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన‌వారూ వున్నారు. అత్యవసర పరిస్థితులు, దీర్ఘకాలిక సంక్షోభాలలో విద్య కోసం ఐక్య రాజ్య స‌మితి ప్ర‌పంచ‌ నిధి, సాయుధ పోరాటాలు, బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లింపులు, వాతావరణ ప్రేరిత విపత్తులు, దీర్ఘకాలిక సంక్షో భాల కారణంగా నాణ్యమైన విద్యను కోల్పోతున్న బాలికలు, అబ్బాయిల సంఖ్యను  ఎడ్యుకేషన్  కెనాట్ వెయిట్ (ఇసిడ‌బ్ల్యు)   ప్ర‌ధానంగా పేర్కొన్న అంశాలు ఎంతో ఆందోళనకరంగా ఉంది. సంక్షోభ పీడిత ప్రాం తాల్లో నివసిస్తున్న దాదాపు 119.6 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు హాజరయ్యారు  కానీ గణితం లో లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధించలేకపోయారని కనుగొన్నారు. మరో 24.2 మిలియన్లు  ప్రీ-ప్రైమ రీ, ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్‌లో గణితం లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధిస్తున్నారు, అయితే ఇప్పటికీ సంక్షోభాల వల్ల ప్రభావితమయ్యారు.  వీరికి మద్దతు అవసరం అని స్ప‌ష్టం చేసింది. 84 శాతం మంది పూర్తిగా బడి బయట ఉన్న పిల్లలు లేదా 65.7 మిలి యన్లు దీర్ఘకాలిక సంక్షోభాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తు న్నార‌ని నివేదిక  పేర్కొంది. ఈ  65.7 మిలియన్లలో మూడింట రెండొంతుల మంది ఆఫ్ఘనిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, మాలి, నైజీరియా, సోమాలియా, ద‌క్షిణ సూడాన్, సూడాన్, పాకిస్తాన్,  యెమెన్‌లలో నివసిస్తున్నారు. సబ్-సహారా ఆఫ్రికాలోని  పిల్లలు చ‌దువునేర్వ‌లేని  స్థితితో తీవ్రంగా దెబ్బతిన్నార‌ని లాభాపేక్షలేని సేవ్ ది చిల్డ్రన్ చేసిన మరొక నివేదిక తెలియ‌జేసింది.  శరణార్థుల కోసం ఏర్పాటైన‌ యు.ఎన్‌ హై కమిషనర్  ఇటీవలి నివేదిక ప్రకారం 2019-2020లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థుల కోసం సెకండరీ స్థాయి విద్య లో స్థూల నమోదు 34 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు, సంక్షోభ ప్రభావిత పిల్లలలో 9 శాతం మంది మాత్రమే గణితంలో కనీస నైపుణ్యాన్ని సాధించారు. సంక్షోభం-ప్రభావిత పిల్లలలో 15 శాతం మంది మాత్రమే ప్రారంభ తరగతుల్లో చదవడంలో కనీస నైపుణ్యాన్ని సాధించారని విశ్లేషణలో తేలింది. కోవిడ్‌- 19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా పాఠశాలలు సుదీర్ఘకాలం మూసివేయడం వల్ల ప్రపంచ సంక్షోభం తీవ్ర మైందని నిపుణులు చెప్పారు.  సంక్షోభ తీవ్రత, క్రియాత్మక ఇబ్బందులతో ఉన్న పిల్లలు, వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన కుటుంబాల‌  పిల్లలు, బడి బయట వున్న‌వారి శాతం సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను ప్రభావితం చేసే కొత్త పద్దతిని తాజా అధ్యయనం ప్రతి పాదించింది. యూనిసెఫ్  బ‌హుళ సూచిక  క్లస్టర్ సర్వేలు, అంతర్జాతీయ గణితం, సైన్స్ అధ్యయన డేటా బేస్‌లో అభి వృద్ధి  కోసం అంతర్జాతీయ విద్యార్థి అంచనా వివ‌రాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను, అలాగే నేర్చుకోని వారి సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగించాలి. అందువల్ల తక్షణ విద్యా మద్దతు అవసరమ‌ని రచయి తలు సూచించారు. ఈ పద్దతి యొక్క పరిమితి ఏమిటంటే ఇది ప్రధానంగా సంక్షోభం-ప్రభావిత వ్యక్తులుగా పరిగణించబడే వ్యక్తుల నిష్పత్తిని సరిగ్గా అంచనా వేయ డంపై ఆధారపడి ఉంటుంది. అనేక పెద్ద సంక్షోభ-ప్రభావిత దేశాలలో, మూడు నుంచి నాలుగు సంవత్స రాల వయస్సు గల పిల్లలకు, ప్రాథమిక పాఠశాలకు ముందు సంవత్స రంలో ఉన్నవారికి పాఠశాల వెలు పల రేట్ల డేటా అందుబాటులో లేదని నివేదిక పేర్కొంది.

కారు ఓవర్ లోడు..!

కారు ఓవర్ లోడైందా? కొందరిని దింపేయక, లేకపోతే వారే దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అంటే తెలంగాణలో టీఆర్ఎస్ వలసలు చూస్తుంటే ఔననక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో అసంతృప్తుల సంఖ్య వరదలా పోటెత్తుతోంది. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి నెలకొని ఉంది. కొందరు కారు దిగి హస్తం పంచన చేరుతుంటే.. మరి కొందరు టీఆర్ఎస్ లోనే ఉండి.. రానున్న ఎన్నికలలో తమకు ప్రత్యర్థులు అనుకున్న వారితో గొడవలు పడుతున్నారు. గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారు. పరస్పరం గొడవలు పడుతూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారు మరి కొందరు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు పరిశీలకులు. పార్టీ అగ్రనేతల కనుసన్నలలో మెలిగిన, మెలిగే, మెలుగుతారనుకున్న వారికే తెరాసలో పార్టీ పదవులు దక్కాయి. అయినా అంతా బానే ఉందని అనుకోవడానికి లేకుండా విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ విభేదాలే తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వరద గేట్లు తెరుచుకున్నట్లుగా వలసలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నుంచి ఈ స్థాయిలో వలసలు జరుగుతున్నాయంటే.. కచ్చితంగా తెరాసలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనుకోవలసిన పరిస్థితేనని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇంత కాలం కేసీఆర్ పై ఆరోపణలు విపక్షాలకే పరిమితమయ్యాయి. కానీ కుటుంబ పాలన, విధానాలపై పార్టీ వీడుతున్న నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనంతరం పోడు భూములకు పట్టాల విషయంలో ఆయన కేసీఆర్ సర్కార్ పై చేసిన విమర్శలు కలకలం సృష్టించాయి. పోడు భూములకు పట్టాలు నిరాకరించడం వల్లలే తాను పార్టీ వీడుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికలలో అంటే 2018 ఎన్నికలలో పోడు భూములకు పట్టాలు అన్న హామీ ఇచ్చింది. స్వయంగా కేసీఆర్ నోటి వెంటే ఈ హామీ వచ్చింది. అయితే మూడేళ్ల తరువాత గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆ విషయమే పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబుకుతొంది. ప్రజా ప్రతినిథులను  ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.  రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందనీ, పబ్బుల సంస్కృతికి, డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విజయారెడ్డి తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. విజయారెడ్డి దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ తనయ కావడంతో ఆమె పార్టీ మారడం రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం అయిన ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ పై ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. ఇక ఏ జిల్లాకు ఆ జిల్లా గ్రూపు తగాదాల పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించి పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు అధిష్టానం ఏ మాత్రం సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలు, విమర్శలు కేడర్ నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజులలో మరిన్ని వలసలు పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు కారులో ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ వైఖరీ, ఆపరేషన్ ఆకర్ష్ పేరిట విపక్షాల నుంచి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోని ఆహ్వానించడమే కారణమని వారు పేర్కొంటున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వచ్చి చేరడంతో మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న వారికి అవకాశాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని వివరిస్తున్నారు. 

ముర్ము స్వగ్రామానికి వెలుగొచ్చింది

రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, చిన్న తనంలో గుడ్డి దీపాల వెలుగులో చదువుకుని  అంత గొప్పవాడయ్యారు, అని మనం గొప్పగా చెప్పు కుంటాం... అలాగే ఇంకా ఎందరో  పెద్దలు , స్వాతంత్ర సమర యోధులు ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దేశ సేవలో తరించారు అలాంటి అందరూ మనకు ప్రాతః స్మరణీయులు,కానీ, దేశానికీ స్వతంరం వచ్చి, 75 ఏళ్ళు పూర్తయి, అమృత మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలో, ఇప్పటికీ దేశంలో విద్యుత్ సదుపాయం, కనీస వసతులు  లేని అనాధ గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందునా, అలాంటి  అనాధ గ్రామాల్లో, అధికార ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపదీ ముర్ము స్వగ్రామం కూడా ఉందంటే, ఆశ్చర్యంతో పాటుగా కొంచెం చాలా అవమానం కూడా అనిపిస్తుంది. కానీ, అది నిజం.  నిజానికి, దేశంలోని ఎన్నో చీకటి గ్రామాల కథల్లానే, ఈ గ్రామం కథ కూడా ఇప్పటికీ,  ఎప్పటికీ  చీకటిలోనే ఉండి పోయేది కావచ్చు, కానీ, ద్రౌపది ముర్మును బీజేపీ / ఎన్డీఎ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ గ్రామం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే, అక్కడికెళ్ళిన మీడియా ప్రతినిధులు, రాష్ట్రపతి అభ్యర్ధి స్వగ్రానికి  కరెంటు లేదని తెలిసి, కరెంట్ తాకకుండానే  షాక్ కు గురయ్యారు.  ద్రౌపదీ ముర్ము స్వగ్రామం..ఓ శివారు గ్రామం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రెండు శివారు గ్రామాలు కలిసిన,  ఉపర్బెడా గ్రామం. ఈ గ్రామంలో  దాదాపు 3500 జనాభా నివసిస్తున్నారు. అందులో, బాదషాహి శివారు గ్రామానికి విద్యుత్ సదుపాయం ఉంది. కానీ, కేవలం 14 కుటుంబాలు మాత్రమే ఉన్న దున్గురుషాహి  శివారు గ్రామానికి మాత్రం విష్యత్ సదుపాయం లేదు.,ఆ శివారు గ్రామం దశాబ్దాలుగా చీకటిలోనే మగ్గుతోంది. ఆ గ్రామమే ముర్మూ స్వగ్రామం.అయితే, ప్రస్తుతం ఆమె అక్కడ నివసించడం లేదు. ఆ గ్రామానికి 20కి.మీ దూరంలో ఉన్న పట్టణానికి కొన్ని దశాబ్దాల క్రితమే మకాం మార్చారు.  అయినప్పటికీ ముర్ము మేనల్లుడు బిరాంచి నారాయన్‌ తుడు ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే నివసిస్తున్నారు. ముర్మూ కూడా పండగలు, పబ్బాలకు గ్రామానికి వచ్చి పోతూనే ఉంటారని, ఆమె మేనల్లుడు తెలిపారు. గ్రామానికి విద్యుత్ లేని విషయాన్ని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదని, బిరాంచి భార్య, ఇతర గ్రామస్తులు  వాపోయారు. ఎన్నికల సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ, ఎన్ని విజ్ఞాపన పత్రాలు అందించిన ఫలితం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పడు, రాష్ట్రపాటి అభ్యర్ధి గ్రామానికి విద్యుత్ లేదనే వార్త భగ్గుమండంతో  ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ గ్రామానికి కరెంటు వసతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఒడిశా విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు 24 గంటల్లోగా గ్రామం మొత్తానికి విద్యుత్‌ వసతి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో అక్కడకు చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న బాధలకు ఇప్పుడు మోక్షం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే, మయూర్‌భంజ్‌ జిల్లాలో ఇప్పటికీ ఓ 500 గ్రామాలకు సరైన రోడ్లు, 1350 గ్రామాలకు కరెంటు వసతే లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ గ్రామానికి చెందినవారు గతంలో ఎంపీలు, మంత్రులుగా పనిచేశారు. మాజీ ఎంపీలు సల్ఖాన్‌ ముర్ము, భబేంద్ర మాఝీతోపాటు కార్తిక్‌ మాఝీలు కూడా అదే గ్రామానికి చెందిన వారు కావడం కొసమెరుపు.  అయితే, తీగలాగితే డొంకంతాకదిలింది అన్నట్లు, ఈ గ్రామానికి ఇంత కాలం కరెంటు లేక  పోవదానికి, ఆ గ్రామం పట్ల వివక్ష కారణం కాదని, అటవీ భూమిలో నిర్మించిన గ్రామం  కావడం వలన సాంకేతిక అభ్యతరాలు అడ్డుగా నిలిచాయని, అధికారులు చెపుతున్నారు. అయితే, ఇంత కాలం తిష్ట వేసినఅభ్యంతరాలు ఇప్పడు ఏమయ్యాయి.. ? ఎలా తొలిగి పోయాయి? అలాంటి  ప్రశ్నలకు సమాధానలు ఉండవు. అది అంతే.

అబద్ధాలు రుజువైపోయి అభాసుపాలు..!

అబద్ధాలాడేవారికి జ్ణాపక శక్తి ఎక్కువ ఉండాలి. అందులో రాజకీయ నాయకులైతే మరీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ విషయంలో ఏ అబద్దమాడారో మరచిపోతే.. వారి బండారం బయటపడి అభాసుపాలౌతారు. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఆడిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలలో పలుచన అవుతున్నారు. చులకన అవుతున్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన చేసిన వాగ్దానాలు, విమర్శలు అన్ని ఇప్పుడు బూమరాంగ్ అయి.. ఆయన అబద్ధాల పాలనను వెక్కిరించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు వివిధ సందర్భాలలో చెప్పిన మాటలు అబద్ధాలని ఇప్పుడాయన సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతోనే తేటతెల్లమైపోతోంది. దీంతో జనంలో జగన్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ నిండు అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత గత ఎన్నికల ప్రచారంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని నమ్మ బలికారు. ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మూడు రాజధానులంటూ అమరావతిని పక్కన పెట్టేశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా యాతనా పెట్టారు. చారిత్రక న్యాయపోరాటం ద్వారా వారు ప్రభుత్వంపై విజయం సాధించినా.. కోర్టు తీర్పు అమలులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత మూడేళ్లుగా జగన్ సర్కార్ అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రం దివాళా స్థితికి చేరుకుంది. ఎక్కడా అప్పుపుట్టని పరిస్థితుల్లో మళ్లీ అమరావతే ఆదుకుంటుందని జగన్ భావిస్తున్నారు. ఈ లోగా ఈ మూడేళ్లలో జగన్ కానీ, ఆయన పార్టీ నేతలకు కానీ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ ఇన్నీ అన్నీ కావు. ఒక పథకం ప్రకారం అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆదాయంగా మార్చుకునేందుకు నడుం బిగించింది. గతంలో అమరావతిని స్మశానం గా అభివర్ణించిన జగన్ సర్కారే ఇప్పుడు ఆ భూములనే బంగారు బాతుగుడ్లుగా గుర్తించి వాటిని వేలం వేసి ఆదాయాన్నిసమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గ్రాఫిక్స్ అంటూ ఎకసెక్కాలాడిన భవనాలనే ఇప్పుడు లీజుకు ఇచ్చి ఆర్థిక ఊరట పొందాలని నిర్ణయించుకుంటున్నది. దీంతో వైకాపా సార్కార్, ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు అమరావతిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అబద్ధాలని రాష్ట్రప్రజలకు తేటతెల్లమైంది. దీంతో జగన్ ప్రతిష్ట మసకబారింది. గతంలో అమరావతి భవనాలను గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన జగన్ ఇప్పుడు వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం వస్తుందన్న సీఆర్డీయే ప్రతిపాదనకు ఆమోదించడం ద్వారా తాను నాడు గ్రాఫిక్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఇప్పుడు స్వయంగా అంగీకరించినట్లైంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పలు టవర్లు, భవనాలను ఇంత కాలం నిరుపయోగంగా ఉంచేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వాటినే ఆదాయ వనరులుగా గుర్తించారు. ఉద్యోగుల కోసం గత సర్కార్ నిర్మించిన భవనాలను ఉద్యోగులకు కేటాయించకుండా ప్రైవేటు  సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. భవనాల లీజు ద్వారా ఏడాదికి పదికోట్లు ఆర్జించడానికి రెడీ అయిపోయింది. అమరావతిలో తెలుగుదేశం చేపట్టినట్లు చెబుతున్న పనులన్నీ గ్రాఫిక్సేనని ప్రచారం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడా ‘గ్రాఫిక్ భవనాల’నే అవసరానికి వాడుకుంటోంది. స్మశానం అంటూ నిందించిన నోటితోనే అమరావతి భూముల విక్రయానికి రెడీ అయిపోతోంది. ఇప్పుడు జనం జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం   చేయడమే కాదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని నిర్వీర్యం చేయకుండా ఉండి ఉంటే.. అప్పుడు జరిగిన అభివృద్ధిని కొనసాగించి ఉంటే ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా అని నిలదీస్తున్నారు. యథా ప్రకారం జగన్ ప్రభుత్వం నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు, విమర్శలు చేస్తే దులిపేసుకు ముందుకు పోతాం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. 

యశ్వంత్ సిన్హా నామినేషన్ 27న.. హాజరు కానున్న కేటీఆర్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన సోమవారం ఉదయం 11.30 గంటలకు తన నామానేషన్ దాఖలు చేస్తారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి ఇప్పటికే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ ఎస్ తరఫున పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు.  ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్ ఆదివారం రాత్రే హస్తినకు బయలు దేరి వెళ్లారు.  కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంక‌టేశ్ నేత‌, ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. కాగా ఎన్‌డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా  ద్రౌపది ముర్ము  ఇప్పటికే  నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అదే నెల 21న ఉంటుంది. కాగా రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 తుదిగడువు. కాగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. 

జూన్ 28న ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై సందిగ్ధత తొలగింది. మంగళవారం ఉదయం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.  ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత వారం రోజులుగా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుకో తేదీని అనధికారికంగా ప్రకటించి విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అయోమయం, గందరగోళం సృష్టించిన ఇంటర్ బోర్డు ఎట్టకేలకు మంగళవారం అంటే ఈ నెల 28న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నది. ఇంటర్ ఫలితాల విషయంలో వదంతులను నమ్మవద్దని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  ఫెయిలైన  విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు మూడు వెబ్‌ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.    విద్యార్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.inవెబ్‌ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలియజేసింది.