కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. ఉత్తమ్
posted on Jun 9, 2015 @ 6:14PM
తెలంగాణ ముఖ్యమంత్రిని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఆరాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ సర్కార్ చేపడుతున్న వాటర్ గ్రిడ్ పాజెక్టు మొత్తం అవినీతితో కూడుకున్నదే అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంమంతా అవినీతితోనే సాగుతుందని, ఆంధ్రా కాంట్రాక్టర్లకు టెండర్ వేసేందుకు వీలుగా నిబంధనలు మార్చామన్నారు కాని అలాంటిది ఏం జరగలేదని అన్నారు. ఒకవైపు కేసీఆర్ టెండర్లకు పిలిచామంటే.. మరో వైరు కేటీఆర్ పిలవలేదంటున్నారు.. ఇదే వారి అవినీతి భాగోతానికి నిదర్శనమని అన్నారు. అసలు ఎన్నికల హామీలో లేని వాటర్ గ్రిడ్ గురించి కేసీఆర్ ఎందుకు అంత తాపత్రయ పడుతున్నారని.. దీనిలో ఉన్న అవినీతిని ఏసీబీ వెలికితీయాలని డిమాండ్ చేశారు. కాంగ్రస్ నేతలను అవినీతి పరులంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారని.. వాళ్ల కంటే అవినీతి పరులెవరూ లేరని.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.