ప్రముఖ గాయకుడు మృతి
posted on Jun 9, 2015 @ 5:39PM
"డిప్రెషన్" ఈ పదానికి చాలా మంది బలైపోతుంటారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తమ జీవితాల్ని తామే బలిగొంటారు. ఇప్పుడు ఆజాబితాలో ప్రముఖ పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ కూడా చేరిపోయాడు. అనుకున్నది సాధించలేదని, వృత్తి పరంగా రాణించలేకపోతున్నాననే మానసిక బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ధరం ప్రీత్ సింగ్ ప్రముఖ పంజాబీ గాయకుడు. అతను ఇప్పటి వరకు 15 ఆల్బంలను విడుదలచేశాడు. కానీ 2010 నుండి ధరం ప్రీత్ సింగ్ ఒక్క ఆల్బమ్ కూడా విడుదలచేయకపోవడం.. ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అమృత్ సర్ లోని ఒక ప్రదర్శన కు వెళ్లి తిరిగివచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ధరం ప్రీత్ సింగ్ మరణంతో పంజాబ్ ఒక్కసారిగా నివ్వెరపోయింది. అయితే "ఈ ఫ్యాన్ నా జీవితాన్ని మింగేసేలా ఉందని" ధరం ప్రీత్ సింగ్ ఎప్పుడూ అంటుండేవాడని అతని తల్లి కన్నీరుపర్యంతమైంది. ధరం ప్రీత్ సింగ్ మృతికి సోషల్ మీడియాలో పలువురు సంతాపం తెలిపారు.