అత్త మీద కోపం.. దుత్త మీద.. చివరికి అల్లుడు బలి..
posted on May 3, 2021 @ 1:52PM
ఎక్కడైనా ఎప్పుడైనా పెళ్ళాం వివాహేతర సంబంధం పెట్టుకుంటే.. భర్త చనిపోవడమో లేక భార్యని చంపడమో చేస్తుంటారు. ఆ వార్తలు మనం చాలానే చూశాం, చదివాం. కానీ అత్త అక్రమ సంబంధం పెట్టు కుంటే అల్లుడు కి ఇసుర్రాయి బొడ్డుకు వచ్చిన విషయం ఎక్కడైనా చూశారా..? చూడకపోతే చూడండి..
తన అత్త వివాహేతర సంబంధం పెట్టుకుందని. ఫీల్ అయ్యాడు ఒక అల్లుడు. అక్కడితో ఊరుకోక అత్తతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వ్యక్తిని మందలించాడు. అంతే ఆ అత్త అల్లుడి కంటే ఎక్కువ ఫీల్ అయ్యింది. తన పని తాను చేసుకుంటుంటే మధ్యలో అల్లుడు పానకంలో పుడకలా తయారయ్యాడని భావించిన ఆ అత్త.. అల్లుడి పై వేధింపుల అస్త్రం వేసింది. దీంతో కొత్తగా పెళ్లైన ఆ అల్లుడు.. అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు. అత్త మీద కోపం కాస్త భార్య పై చూపించాడు బాబు. భార్యతో తరుచూ గొడవలు పడి.. వారిద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఓవైపు అత్త, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి వేధింపులు.. మరోవైపు భార్య తో మనస్పర్థలు అతడి ఉసురు తీశాయి..
చూడండి చివరికి కథ ఎక్కడికి చేరిందో..
అతని పేరు బాబు. అతని సొంతూరు నల్గొండ జిల్లా. తిరుమల గిరి. అతను హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి ఎనిమిది నెలల క్రితమే పెళ్లి అయింది. అమ్మాయిది చందంపేట మండలం తెల్దార్ పల్లి. వీరిద్దరూ కర్మాన్ ఘాట్ లో గల శ్రీరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు చీటికి మాటికి గొడవ పడుతుండటంతో బాబు తండ్రి రాములు వచ్చాడు.. ఆ విషయం పై ఆరా తీశాడు. అప్పుడు బాబు అత్త అసలు విషయం చెప్పాడు. తన అత్త వివాహేతర సంబంధం పెట్టుకున్నదని.. ఆ విషయం తనకు తెలిసేసరికి.. ఆ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి ఆమె కూడా తనను వేధింపులకు గురిచేసస్తున్నారని బాబు మొరపెట్టుకున్నాడు. ఇదే విషయంపై తన భార్యతో కూడా గొడవలు వస్తున్నాయని బాబు తండ్రికి వివరించాడు. దీంతో వారిద్దరినీ పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇప్పించాడు రాములు. కానీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. పోగా.. వాగ్వాదాలు ఇంకా ముదిరాయి. దీంతో బాబు భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో బాబు అత్తతో సన్నిహితంగా ఉండే వ్యక్తి.. అతడికి ఫోన్ చేసి బెదిరించేవాడు. అత్త కూడా ఫోన్ చేసి మానసిక వేధింపులకు గురి చేసేది. వేధింపులతో విసిగిపోయిన బాబు కొద్దికాలంగా ముభావంగా ఉంటున్నాడు.
కట్ చేస్తే.. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బాబు తమ్ముడు జబ్బర్ ఆటో తీసుకుని బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం బయటనుంచి వచ్చి చూసేసరికి తలుపు గడియపెట్టి ఉంది. జబ్బర్ తో పాటు అతడి చెల్లెలు, ఇంటి యజమాని తలుపును తెరిచి చూడగా.. ఎదురుగా బాబు శవం ఫ్యాన్ కు వేలాడి ఉంది. బాబు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన కుమారుడిని అతడి అత్త వేధింపులకు గురి చేసిందని.. అత్తతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి బెదిరింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై విచారణ చేపట్టారు. అయితే బాధితుడి భార్య మాత్రం తనకేం పాపం తెలియదని.. తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని తాను ఊహించలేదని చెప్పుకురావడం విడ్డూరం.