Read more!

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దేనా..?

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు సామాన్యుడి చేతికి రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం.. ప్రజలకు పార్టీలపై గానీ ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులపై గానీ విశ్వాసం లేకపోతె ఓటర్లు నోటాకు ఓటు వేసి వారి అభిప్రాయాన్ని తెలిపేందుకే కేంద్ర ఎన్నికల సంఘం నోటా అనే ఆప్షన్ ని ఎన్నికల్లో ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే.. అదే ప్రశ్నపై ఎప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం, కేంద్రం, భారత ఎన్నికల   ఈ విషయం పై వివరణ కోరింది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వీటిపై తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి   భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.  

‘నోటా’కు అత్యధిక ఓట్లు పోలైన సందర్భంలో ఆ నియోజక వర్గంలో పోలింగ్‌‌ రద్దు చేసి, మళ్లీ ఎన్నిక జరిపించాలని కోరుతూ భాజపా నేత అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా నోటాపై అభిప్రాయాలు తెలియజేయాలని ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పిటిషనర్‌ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవ్యాధి మేనకా గురుస్వామి, ప్రస్తుతం అభ్యర్థుల్ని తిరస్కరించే హక్కు మాత్రమే (రైట్‌ టు రిజెక్ట్) ఉందని, కానీ, దీన్ని ఓటుగా గుర్తించాలని (రైటు టు రికగ్నైజ్‌‌) వాదించారు. కనీసం 50శాతం నోటా ఓట్లనైనా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 99శాతం నోటాకు ఓట్లు పడినా, ఒక్కశాతం ఓట్లలో మెజారిటీ పొందిన అభ్యర్థి విజయం సాధించే వీలుంది.