Read more!

వీరప్పన్ అనుచరుల ఊరిపై సుప్రీంకోర్ట్ స్టే

 

 

 

వీరప్పన్ అనుచరుల ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. వీరప్పన్ నలుగురు అనుచరులకు ఈరోజు అమలు కావాల్సిన ఉరి శిక్ష నిలిచిపోయింది. వీరప్పన్ అనుచరులు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం వరకు ఉరిశిక్షను అమలు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణ బుధవారం 20వ తేదీ కొనసాగనున్నట్లు కోర్టు పేర్కొంది. నిందితులు జ్ఞానప్రకాశ్, సైమన్, మీ సేకర్ మాదయ్య, బిలవెంద్రన్‌లు కర్నాటకలోని పాలర్ ప్రాంతంలో మందుపాతర పేల్చి 22 మంది పోలీసులను బలిగొన్న కేసులో వారికి మరణశిక్ష అమలు చేయాలని 2004లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.