Read more!

టిడిపిని వీడిన నేతలు 420లా!

 

 

 

 

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో స్పందిస్తుంటారు. తాజాగా టిడిపి వదిలిపోతున్న నాయకులపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజీకియ జీవితం ప్రారంభించిన కొందరు నేతలు, తమ స్వార్ధం కోసం ఇతర పార్టీలోకి వెళ్ళడం పై ఆయన మండిపడ్డారు. ఇలాంటి నేతలను ఏమనాలి..మోసగాళ్ళా..దగా కోర్లా..నిజాయితీ లేనివాళ్ళా లేక 420లా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మరీ స్వార్ధం కోసం పార్టీని వదిలిపోతున్న నేతలు లోకేష్ అడిగిన ప్రశ్న కి ఏం సమాధానం చెబుతారో వేచిచూడాలి.