ఇక మోడీ మంత్రం పనిచేయదు..
posted on May 20, 2016 @ 4:35PM
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో శివసేన ఎప్పుడూ ముందుంటుంది.. అందునా బీజేపీ పై విమర్శలు చేయడం అంటే శివసేనకు బ్రెడ్ పై బటర్ పూసినంత ఈజీ. ఇప్పుడు తాజాగా మరోసారి బీజేపీపై విరుచుకుపడింది. శివసేనాధిపతి ఉద్దవ్ ఠాక్రే.. మోదీ మంత్రం 2016లో పనిచేయదంటూ విమర్శించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీని దెబ్బ తీశాయని.. ఇదంతా మిత్రపక్షాల చలవే అని అన్నారు. ఏదో అసోంలో పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారం సాధ్యమైంది కానీ.. లేకపోతే అక్కడి ప్రజలు కూడా బుద్ధిచెప్పేవారని ఎద్దేవ చేశారు. బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తరువాత తాజా ఫలితాలు పార్టీకి సంజీవని వంటివి అని రాయడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పై కామెంట్లు విసిరారు.. అవినీతి, తీవ్రవాదం పెరిగిపోయిన ఈ రాష్ట్రాన్ని 'మమత విముక్త బెంగాల్' కావాలని బీజేపీ నేతలు అన్నారు.. ఇప్పుడు ఏమైంది.. మమతా మరోసారి అధికారంలోకి ఎలా వచ్చారు అని ప్రశ్నించారు.