లోకేష్ పారిపోయాడు.. కేటీఆర్ జులాయి! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
posted on Nov 9, 2020 @ 3:56PM
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన కామెంట్లు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గ్రేటర్లో వరద సాయం పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే కొట్టేయడం ఇబ్బంది అవుతుందని.. ఓట్లు కొనుగోలు చేయడానికి నగదు బదిలీ పథకం పెట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ జులాయి అని రేవంత్ మండిపడ్డారు. వరద సాయం కోసం ఇచ్చిన రూ. 10 వేల డబ్బుల్లో టీఆరెస్ నేతలు రూ. 5 వేలు కొట్టేశారని, దీనిపై ప్రజలంతా తిరగబడాలని ఆయన పిలుపిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు పైసలు అందలేదని, టీఆర్ఎస్ దొంగలకు మాత్రం డబ్బులు వెళ్లాయని రేవంత్ మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. వరద సాయం వివరాలు అడిగితే చెప్పలేక లోకేష్ కుమార్ పారిపోయారన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులను పెట్టి దొంగలా తప్పించుకున్నాడని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం నాడే కమిషనర్ లోకేష్ అపాయింట్మెంట్ తీసుకున్నా.. ఆయన ఎందుకు ఆఫీసుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు ఆదుకోకుండా గులాబీ నేతలకు కమిషనర్ డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.
వరద సాయంలో జరిగిన అవతకవకలకు నిరసనగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. వరద బాధితులతో కలిసి రేవంత్ నిరసనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికివెళ్లకుండా వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వరద బాధితుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి.. అందులో 250 కోట్ల రూపాయలు గులాబీ నేతలే ఆరోపించారు.