Read more!

మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసన

మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన  ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో   చోటు దక్కించుకుంది.  

ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ప్రకటించిన జాబితాలో ఉపాసనకు స్థానం దక్కింది. పలు రంగాల్లో ఉపాసన   అందిస్తున్న సేవలు, రాణిస్తున్న తీరు కారణంగా ఈ జాబితాలో ఆమెకు స్థానం దక్కింది.

తనను మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ల జాబితాలో చేర్చడంపై స్పందించిన ఉపాసన  ఎకనామిక్ టైమ్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.