Read more!

జగన్ వైనాట్ 175 అని ఎలా అనగలుగుతున్నారు.. మేకపాటి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. అలాగే జగన్ కు ఉన్న అసంఖ్యాక సలహాదారులు చేస్తున్న పనేంటని నిలదీశారు. అసలు జగన్  వై నాట్ 175 అని  ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనపై  సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. పార్టీ అధినాయకత్వం వద్దకు తన వంటి సీనియర్లు వెళితే కూడా పలకరించే దిక్కు లేదన్నారు.  ఎమ్మెల్యేలకు సీఎం   గౌరవం ఇవ్వడంలేదన్నారు. సీఎంకు పెద్ద సంఖ్యలో ఉన్న సలహాదారులు చేసే పనేంటో కూడా ఎవరికీ తెలియదని మేకపాటి అన్నారు.   నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు అది వద్దని జగన్ తో చెప్పాను" అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. దాదాపు 50 మంది వరకూ ఎమ్మెల్యేలు పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు.