రాజ్యసభలో తెలంగాణ బిల్లు..గందరగోళం
posted on Feb 20, 2014 @ 3:42PM
తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు ఎవరూ సహకరించకపోవడంతో సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో సభను సజావుగా నడిపేందుకు సభ్యులు సహకించాలని చైర్మన్ కురియన్ కోరినా సభ్యులు పట్టించుకోలేదు. సభను ఎన్ని సార్లు వాయిదా వేసినా సీమాంధ్ర నేతల తీరు మాత్రం మార్చుకోకుండా తమ నిరసనలు యధావిధిగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' ఫ్లకార్డులను పట్టుకుని సీమంధ్ర నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం 3-30 గంటలకు రాజ్యసభకు చేరుకున్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ విషయమై ఆయన సభలో ప్రసంగించనున్నారు.