Read more!

మావోయిస్టులు రంగంలోకి దిగారు జర భద్రం

 

 

 

బుధవారం నాడు తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు ఒకపక్క సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క మావోయిస్టులు విధ్వంసాలు సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీంలు కార్యకలాపాలు ప్రారంభించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల పోలీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ కొనసాగిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్‌తో పాటు, మావోయిస్టుల ఆపరేషన్స్‌లో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులను పోలీసు అధికారులు రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాలను, నాయకులను టార్గెట్ చేసి మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.