Read more!

వల్లభనేని వంశీపై జగన్ పార్టీ నేతల దాడి

 

 

 

జగన్ పార్టీ నాయకులకు తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేయడం తప్ప మరో పని ఉన్నట్టు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జగన్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ ఎన్నికలలో వైకాపా అడ్రస్ గల్లంతు కాబోతోందన్న ఆందోళనతో వైకాపా నాయకులు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా జగన్ పార్టీ నాయకులు గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ మీద దాడి చేశారు. వంశీ ప్రయాణిస్తున్న కారు మీద వైకాపా కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టడంతోపాటు కారును కూడా పూర్తిగా పాడు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.