మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత
posted on Sep 28, 2022 9:02AM
ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఈ ఏడాది జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు కొద్ది నెలలకే ఆయన తల్లి కూడా మరణించారు. ఒకే ఏడాది ఆ కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి.
ఇందిరాదేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె పార్ధివదేహాన్ని సందర్శన కోసం పద్మాలయ స్టూడియోలో ఉంచి, అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.