Read more!

టీ-కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు వీరే

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో లోక్ సభకు పార్టీ తరపున పోటీ చేయనున్న16మంది పార్టీ అభ్యర్ధుల పేర్లను నిన్న రాత్రి డిల్లీలో ప్రకటించింది. దానితో బాటు 110 అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేసిన పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తున్నకాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలకు వారి పేర్లను ప్రకటించవద్దని అహ్మద్‌పటేల్‌ నుండి ఫోన్ రావడంతో మధ్యలోనే నిలిపివేసి త్వరలోనే మళ్ళీ ప్రకటిస్తానని ముగించారు. టీ-కాంగ్రెస్ నేతలు కొందరు అభ్యర్ధులను వ్యతిరేఖించడం, మరి కొందరు కొత్త పేర్లను ప్రతిపాదించి వారికి టికెట్స్ ఇమ్మని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేయడం వలననే ఖరారు చేసిన అభ్యర్ధుల పేర్ల ప్రకటన కూడా అర్ధాంతరంగా ముగించవలసి వచ్చింది.

టీ-కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు వీరే:

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి:                        మహబూబ్‌నగర్

కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ           మల్కాజ్‌గిరి

కార్తీక్ రెడ్డి (సబితా రెడ్డి కుమారుడు)       చేవెళ్ల

నంది ఎల్లయ్య                                    నాగర్ కర్నూల్

గుత్తా సుఖేందర్ రెడ్డి                            నల్గొండ

జి వివేక్                                            పెద్దపల్లి

పొన్నం ప్రభాకర్                                   కరీంనగర్

మధు యాష్కి గౌడ్                              నిజామాబాద్

అంజన్‌కుమార్ యాదవ్                         సికింద్రాబాద్

సామా కిషన్ రెడ్డి                                   హైదరాబాద్

సురేష్‌కుమార్ షెట్కర్                             జహీరాబాద్‌

బలరాం నాయక్‌                                    మహబూబాబాద్‌

డా.శ్రవణకుమార్‌ రెడ్డి                               మెదక్‌

సిరిసిల్ల రాజయ్య                                     వరంగల్‌

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి                          భువనగిరి

నరేష్‌జాదవ్‌                                           ఆదిలాబాద్‌