మణిపూర్కి సీఎం అవుతా.. ఇరోమ్ షర్మిలా
posted on Aug 9, 2016 @ 4:15PM
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలా.. తాను 16 ఏళ్లుగా చేపట్టిన దీక్షను ముగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆమె దీక్షకు తెరపడింది. అయితే దీక్ష విరమించే ముందు తాను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హజరయ్యి తనపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమెను తప్పు ఒప్పుకోవాలని అప్పుడే తనపై కేసులు కొట్టివేస్తామని న్యాయమూర్తి అన్నారు. దీనిపై తిరిగి ఈనెల 23న విచారణ జరుపుతామని చెప్పారు. అనంతరం ఆమె దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను చేస్తోన్న డిమాండ్ను నెరవేర్చుకునే క్రమంలోనే తాను రాజకీయాల్లోకి రానున్నానని, మణిపూర్కి సీఎం అవుతానని పేర్కొన్నారు. కాగా ఆమె మణిపూర్ లోని సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించాలని గత 16 ఏళ్ల క్రితం నుండి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను 16 ఏళ్ల నుండి దీక్ష చేస్తున్నా కానీ.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో.. ఆమె దీక్ష విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు.