కొత్త మాఫియా...భక్తి మాఫియా పార్ట్-2

 

ఇంతక్రితం ఉదయం పూట టీవీ పెట్టగానే వేంకటేశ్వర సుప్రభాతమో లేదా హనుమాన్ చాలీసానో వినిపించేవి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఉదయం ఎక్కడ చూసినా స్వామీజీల ప్రవచనాలు..సూక్తులు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఒక్కటే..! పబ్లిసిటి. అన్ని వ్యాపారాల్లో లాగే భక్తి వ్యాపారంలోనూ పోటి ఉంది. అందుకే జనాన్ని ఆకర్షించడానికి మంత్రాలు, తంత్రాలు చేసి వాళ్లను తమ ఆశ్రమాల దాకా రప్పిస్తున్నారు. అయినా సరిపోక కోట్ల రూపాయల డబ్బు కుమ్మరించి ఛానెళ్లలో కమర్షియల్ స్లాట్స్ బుక్ చేస్తున్నారు. కాని అందరికి ఒకటే టైం కావాలి. ఆ స్లాట్స్‌ని తమ సొంతం చేసుకోవడానికి అవసరమైతే సంవత్సరంలోని అన్ని ఏపిసోడ్స్‌కి ముందుగా అడ్వాన్స్‌ చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదు. అక్కడ కూడా పని జరగని పక్షంలో సొంతంగా ఛానెళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడయితే ఉదయం నుంచి రాత్రి దాకా నాన్‌స్టాప్‌గా డబ్బా కొట్టుకోవచ్చు.

 

ఇదివరకటి రోజుల్లో ఏ రాజకీయ పార్టీల నాయకులో..బడా వ్యాపార వేత్తలో..రియల్ ఎస్టేట్ కింగ్‌లో తమ వ్యక్తిగత అవసరాల కోసమో..లేక ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టడానికో సొంత ఛానెళ్లని ఏర్పాటు చేసుకునేవారు. కాని నోరు తెరిస్తే భౌతికమైనవి మేము ఆశించం. మాకు విశ్వమానవ శ్రేయస్సే ముఖ్యమంటూ పిచ్చి ప్రవచనాలు చెప్పే ఈ కుహనా స్వాములకు ఛానెళ్ల అవసరం ఎంటి? ఒక శాటిలైట్ టీవీ ఛానెల్ పెట్టాలంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్ధితుల్లో 200 నుంచి 300 కోట్లు కావాలి. సంచుల్లో బూడిద తప్ప ఇంకేమి లేదని కూసే ఈ స్వాములకు అంత డబ్బు ఎక్కడిది . ఇదంతా అవినీతి సంపాదన కాదా..? లేక ఏ వ్యాపారాలు చేయకుండానే అంత కూడబెట్టారా అంటే సమాధానం శూన్యం.  ఇంతకు ముందు ఏ సత్యసాయి నిగమాగమంలోనో, లేదంటే ఏ తుమ్మ్లపల్లి వారి కళాక్షేత్రంలోనే సత్సంగాలు ఏర్పాటు చేసేవారు. అయితే తమ భక్తి వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే మరింత మంది జనానికి తమ గురించి తెలియాలి. కేవలం వ్యాపారం చేసే వారే ప్రజలకు తమ ప్రొడక్ట్ తెలియాలనుకుంటారు. అందుకే టీవీ ఛానెళ్లలో ప్రకటనలు ఇస్తారు. మరి స్వామీజీలు స్లాట్స్ బుక్ చేయడం, ఛానెళ్లు పెట్టడం చూస్తే ఇదంతా వ్యాపారం కోసం చేస్తున్నారనుకోవాలి.  

 

తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రముఖ స్వామీజీ ఇటీవలే ఒక ఛానెల్‌లో కొంతవాటాను సొంతం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి "భారత్‌టుడే"అని సొంతంగా భక్తి ఛానెల్‌ను ప్రారంభించారు. వీటితో తమ గురించి డబ్బా కొట్టుకోవడంతో పాటు తమకు పోటి వస్తున్న వారికి వ్యతిరేకంగానూ ఉపయోగిస్తున్నారు. భూకబ్జాలు, డ్రగ్స్, లైంగిక ఆరోపణలతో తెలుగునాట సంచలనం సృష్టించిన కల్కి లీలల గురించి అప్పట్లో ప్రతి టీవీ ఛానెళ్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తిప్పికొట్టాలంటే తనకు సొంత మీడియా ఉండాలని భావించిన కల్కి ఒక టీవీ ఛానెల్ ప్రారంభించాడు. దీని ద్వారా తనకు వ్యతిరేక వార్తలు రాసే వారి పనిపట్టే స్కెచ్ గీశాడు.

 

ఇదంతా పక్కన బెడితే స్వాములకు , స్వాములకు మధ్యే పడటం లేదు. బుధవారం నాడు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. సాయిబాబా భక్తుడు సిద్ధగురు శ్రీరమణానంద మహర్షి ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రచించిన "నాతో వాదనకు దైవశక్తి ప్రదర్శనకు సిద్ధమా" అనే గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ వార్త తెలుసుకున్న స్వర్ణహంపి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి వాగ్వివాదానికి దిగారు. "సాయిబాబానే అవమానిస్తారా" అని ఒకరు "ఆదిశంకరాచార్యులనే అవమానిస్తారా" అని ఒకరు తీవ్రవాగ్వాదానికి దిగారు. ఇదే రమణానందకు తెలుగునాట ప్రవచనాల సామ్రాట్‌గా పేరొందిన చాగంటి సోమయాజీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

 

తాను షిరిడీ సాయిపై చెప్పిన మాటకు విరుద్ధంగా చాగంటి ప్రవచనాలున్నాయని రమణానంద కక్ష పెంచుకున్నారు. రమణానంద తన చేతిలో ఉన్న శివశక్తిసాయి అనే టీవీ ఛానెళ్లో చాగంటి మీద దుష్ప్రచారం చేయించడం, కొంతమంది తన అనుచరుల చేత చాగంటికి వ్యతిరేకంగా రోడ్లెక్కించడం చేశారు. రాగద్వేషాలు వదిలించుకోవాలని మనకి చెప్పే స్వాములే వాటికి లొంగిపోతే ఎలా? ఇంతకీ స్వామీజిల ప్రేమ దేని మీద హిందూ మతం మీదా.. హిందూ మతాన్ని నమ్మే ప్రజల మీద..లేక ప్రజల డబ్బు మీదా.? రాజకీయ నాయకులో, పారిశ్రామికవేత్తలో కోట్లకు  కోట్లు అవినీతి చేశారంటూ గోల గోల చేసే రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య సంస్థలకు భక్తి ముసుగులో స్వామిజీలు కూడబెడుతున్న కోట్లు కనిపించడం లేదా..? ఒక వేళ ప్రశ్నిస్తే ఏమైనా పాపం చుట్టుకుంటుందని భయమా? అలా భయపడుతున్నంత కాలం మార్కెట్‌లోకి రోజుకొక కొత్త బాబా పుట్టుకొచ్చి వేల కోట్లకు అధిపతి అవుతాడు. 

 

దేశంలో వేలకోట్లకు అధిపతులైన స్వామీజీలు:

 

నిత్యానంద:

 

తమిళ సినీనటి రంజితతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొని ఫుల్ ఫేమస్ అయిన నిత్యానంద కొన్ని కోట్లకు అధిపతి. ఆయన వద్ద సుమారు 2 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ఏకంగా సీఐడీ దర్యాప్తులో తేలింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో 100 ఎకరాల స్థలంతో పాటు, అమెరికా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. మహిళా భక్తులపై అత్యాచారాలు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

 

స్వామి రాంపాల్ బాబా:

 

హర్యానాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రాంపాల్. డిప్లోమా వరకు చదివి కొంతకాలం ప్రభుత్వంలో ఉద్యోగం వెలగబెట్టాడు. దానిని వదిలిపెట్టి బాబా అవతారమెత్తి.. తనను తాను కబీర్ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. హిస్సార్‌లో మనోడీకి 12 ఎకరాల్లో సువిశాల సామ్రాజ్యం ఉంది. మొన్నటి మొన్న లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని తన ప్రైవేట్ సైన్యం చేత అడ్డగించాడు. వారిని చేధించుకుని కోటలోకి అడుగుపెట్టిన పోలీసులకు స్వామి వారి వైభోగం చూసి కళ్లు బైర్లుకమ్మాయి. ఇంధ్ర  భవనాల్ని తలపించే ఆశ్రమాలు, బంగారు సింహాసనాలు అబ్బో ఎంత చెప్పినా తక్కువే.

 

ఆశారాం :

 

మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో అరెస్టై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు ఆశారాం బాపూజీ. భక్తుల వద్ద వసూలు చేసిన విరాళాలతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాదు...అమెరికాలోని కొన్ని సంస్థల్లో కూడా అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈయనగారి వ్యక్త్తిగత ఆస్తులు 350 కోట్లుకాగా, అతని పేరిట బినామీ ఆస్తులు దాదాపు రూ.10 వేల కోట్ల వరకూ ఉండవచ్చని ఈడీ అంచనా.

 

బాబా రాందేవ్:

 

దేశంలో ప్రముఖ యోగా గురువుగా పేరుగాంచిన బాబా రాందేవ్‌పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. యోగా, ప్రవచనాలు చెప్పుకునే బాబాకి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రధాన అనుచరుడు ఆచార్య బాలకృష్ణన్ ప్రకటించిన లెక్కల మేరకు రాందేవ్ వ్యాపార సామ్రజ్యం విలువ 1,100 కోట్ల రూపాయలుగా వెల్లడైంది. ఈయన గారికి సొంత టీవీ ఛానెల్ ఉంది దాని పేరు ఆస్థా. 

 

కల్కిభగవాన్:

 

కల్కి భగవాన్ ఆలియాస్ "విజయ్ కుమార్". డ్రగ్స్‌, భూదందాలు ఇలా ఈయనగారి ఆశ్రమంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు , నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఆశ్రమం ప్రక్కల ఉన్న భూమిని కల్కి ఆక్రమించాడని ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. వివిధ దర్శనాలు, పూజల పేరుతో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నట్టు మీడియా కథనాలు ప్రచురించింది. తనపై వచ్చే ఆరోపణలను తిప్పికొట్టడానికి కల్కిభగవాన్ ఓ టీవీ ఛానెల్‌ని స్థాపించాడు. 

 

బాబా గుర్మీత్ రామ్ రహీమ్:

 

బాబా గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా. సిక్కు మతంలోని ఒక శాఖ" డేరా సచ్చా సౌదా"కు ఈయన అధిపతి. భక్తులు యిబ్బడిముబ్బడిగా విరాళాలు ఇవ్వడంతో వాటితో డేరా అనేక స్థిరాస్తులు కొని, అనేక వ్యాపారాల్లో దిగాడు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆర్గానిక్ ఫామ్స్, కాలేజీలు, రిటైల్ స్టోర్సు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, రిసార్టులు, హోటల్స్, మీడియా, క్రికెట్ స్టేడియాలు అబ్బో బాబాగారి వ్యాపార సామ్రాజ్యం అంతా ఇంతా కాదు. డేరా తన సంపదతో ప్రభుత్వాలను సైతం శాసించగలుగుతున్నాడు. 50 మంది వరకూ మహిళా భక్తురాళ్లపై అత్యాచారం చేసినట్టు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి.

 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్:

 

మనిషి ఒత్తిడిని తగ్గిస్తామంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించిన పండిట్ రవిశంకర్ తన శక్తి, సామర్థ్యాలతో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఎఓఎల్ ఫౌండేషన్ ఒక ప్రభుత్వేతర సంస్థ. విదేశాల నుంచి వచ్చే నిధులు దీనికి ప్రధాన తైలం. 156 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాల ద్వారా దాదాపు 1,000 కోట్ల ఆస్తులను రవిశంకర్ ఫౌండేషన్ కూడబెట్టిందని అంచనా. 

 

మేము భగవంతుడికి, భక్తులకు మధ్య అనుసంధానకర్తలం మాత్రమే, మాకు భార్య, పిల్లలు, ఆస్తి, పాస్తి ఏమి లేవంటారు. అలాంటి వారికి బంగారు సింహాసనాలెంటి..? హంస తూలికా తల్పాలెంటి..? సంసారాన్ని, బంధుమిత్రుల్ని త్యజించాం..మాకున్న తోడు దేవుడొక్కడే అని చెప్పే స్వాముల్లో ఇప్పటికీ తన కుటుంబసభ్యులతో "బంధాన్ని" కొనసాగిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మనకి మాత్రం ముక్తి పొందాలంటే బంధాలన్ని వదిలిపెట్టాలని శ్రీరంగనీతులు వల్లిస్తారు. అయితే ఇలాంటి స్వాముల్లో కూడా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వ్యక్తులున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హైందవ మత వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.  సింహాసనాల మీద కాకుండా పేడతో అలికిన నేల మీదే ఆయన దినచర్య సాగుతోంది. ఆఖరికి కారులో బయటకు వెళ్లేటప్పుడు కూడా చెక్క పీట మీదే కూర్చునేవారు.

 

మంచికి రోజులు లేనట్టు జయేంద్ర సరస్వతి మీద కూడా కేసులు మోపి, ఆయన్ను జైలుకి పంపారు. కాని నిజం దాస్తే దాగేది కాదు అందుకే న్యాయస్థానం కూడా ఆయనపై నమోదైన అభియోగాలు నిరాధారమైనవని నిర్దోషిగా విడుదల చేసింది. దీనిని బట్టి మతం, రాజకీయం సమ్మిళతమైపోయాయని అర్థం చేసుకోవచ్చు. జనానికి, రైతుకు మధ్య దళారులు, కార్యాలయాల్లో దళారులు, ఇలా ప్రతి పనికి దళారులున్నట్లే మనకి..దేవుడికి మధ్యలో స్వామీజీలు, బాబాలు అనే దళారులు ప్రవేశించారు. అయినా భగవంతుణ్ణి అందుకోవడానికి మనకు కావాల్సింది నిర్మలమైన మనసు, భక్తి ఈ రెండు ఆయుధాలతో చరిత్రలో ఎంతోమంది దేవుణ్ణి చేరుకున్నారు. కాబట్టి మనకు దళారులు అవసరం లేదు.

 

                                                                                                         సశేషం

కొత్త మాఫియా..భక్తి మాఫియా పార్ట్-1

వైసీపీ వారికి అప్ప‌నంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు!?

వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి చివరి పంక్తిలో కూర్చున్నా ఫరవాలేదన్నది సామెత. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఆ సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు. ఇప్పుడు ఆ సామెతను వడ్డించేవాడు మనవాడే ఉన్న మొదటి మొదటి పంక్తిలో కూర్చున్నా లాభం లేని పరిస్థితి ఏర్పడిందని మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు. ఔను తిరుమలలో  వైకుంఠ ఏకాద‌శి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాల విషయంలో వైసీపీయులదే హవా అంటున్నారు. వైసీపీ లీడర్లకు ఉత్తర ద్వార దర్శనాలను తిరుమల అడిషనల్ ఈవో దగ్గరుండి మరీ చేయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేస్తున్నారు.  తెలుగుదేశం కూటమి సర్కార్ లో కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారికి దక్కని వైకుంఠ ద్వార దర్శనాలు వైసీపీ నేతలకు మాత్రం అధికారులు దగ్గరుండి మరీ తీసుకువెళ్లి దర్శనం చేయించ డమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ  నుంచి వ‌చ్చిన‌దేవినేని అవినాష్‌, మ‌ల్లాది విష్ణుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటి  వారు మంగళవారం (డిసెంబర్ 30)న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సరే  పెద్దిరెడ్డి అంటే లోక‌ల్. మరి మ‌ల్లాది, దేవినేని సైతం వైకుంఠ ద్వారా  ద‌ర్శ‌నాలు అల‌వోక‌గా ఎలా చేసుకోగలిగారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ వారి మాటే ఇంకా తిరుమలలో చెల్లుబాటు అవుతోందనడానికి ఇంత కంటే నిరద్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు.. అధికారం కోల్పోయినా వైసీపీ వారి పనులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేననడానికి  వైకుంఠ ఏకాదశి సందర్భంగా  వైసీపీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి మరీ ఉత్తరద్వార దర్శనాలను కల్పించడమే  నిదర్శనమని అంటున్నారు.  

140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?

దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు. స్వాతంత్యోద్య‌మ కాలం నుంచీ ఉన్న ఈ పార్టీ ఈ క్రమంలో అనేక విజయాలు, అపజ యాలను చవి చూసింది. అయితే ఇప్పటి వరకూ దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా రికార్డు కూడా సృష్టించింది. అయితే గత కొన్నేళ్ల నుంచీ, అంటే దాదాపుగా  దశాబ్ద కాలం నుంచీ ఆ పార్టీ వరుస పరాజయాలతో కూనారిల్లుతోంది. కాంగ్రెస్ చరిత్రలో ఇంతటి పతనావస్థ ఆ పార్టీకి గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయం తరువాత నుంచి ఈ పార్టీ కోలుకోలేదనే చెప్పాలి. ఈ పరిస్థితి చాలదన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కీలక రాష్ట్రాలలో కనీస స్థానాలను కైవసం చేసుకోవడంలో విఫలమౌతున్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్ట సాధ్యమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఇవన్నీ పక్కన పెడితే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 140వ ఆవిర్బావ దినోత్సవాన్ని ఆదివారం (డిసెంబర్ 28) జరుపుకుంది. అయితే 140 ఏళ్ల కాంగ్రెస్ లో ఆ సందర్బంగా ఎలాంటి ఉత్తేజం కానీ, జోష్ కానీ కనిపించలేదు. వరుస పరాజయాలతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాల పట్ల ఉదాశీనంగా ఉన్నాయి. వీటన్నిటికీ మించి పార్టీలో కీలక నేతలు బీజేపీ, ఆ పార్టీ మెంటార్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ అనుకూల ప్రకటనలు చేస్తుండటం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నది. ఈ నేపథ్యంలోనే  ఆదివారం (డిసెంబర్ 28) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వినా మరెక్కడా వేడుకలు జరగలేదు. పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణల్లో కూడా ఆ సందడి కనిపించలేదు. కనీసం ఆయా రాష్ట్రాలలోని కాంగ్రెస్ కార్యాలయాలలో కూడా ఎటువంటి కార్యక్రమాలూ జరిగిన దాఖలాలు లేవు.  ఇక  పార్టీ ఎంపీ శశిథరూర్ వంటి వారు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం పార్టీ అధిష్ఠానాన్ని మరింత ఇరుకున పెడుతోంది. అలా పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో కాంగ్రెస్ కోలకుంటుందన్న భావన నెమ్మదిగా పార్టీ శ్రేణులలోనే అడుగంటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నాయకుల జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేరడం పార్టీ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేసింది. దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రధాని మోడీపై ప్రశంసిస్తూ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ లను ప్రస్తుతించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానిగా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగత బలమే కారణమని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా తన పోస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కీలక నేతలు ప్రియాంక వధేరా గాంధీ, రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు.  అయితే ఆ తరువాత తన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని చెప్పడానికే కానీ, ఆ సంస్థను కానీ, మోడీని కానీ ప్రశంసించడానికి కాదనీ కాంగ్రెస్ కు కూడా ఇలాంటి బలమైన వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని చెప్పడమే తన ఉద్దేశం వివరణ ఇచ్చారు. ఆ వివరణలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడిందనీ, అధికారం కేంద్రీకృతమై ఉందన్న సంకేతాలు ఉండటం గమనార్హం. దీంతో పార్టీలోని సీనియర్లు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ గ్రాండ్ ఒల్డ్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!

చట్టం, న్యాయం, కోర్టులు ఇలాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఖాతరు చేయరు. వాటితో చెలగాటమాడటం ఆయనకు రాజకీయ ప్రవేశానికి ముందు నుంచీ బాగా అలవాటైన విద్య. ఇదీ జగన్ గురించి న్యాయనిపుణులు చెప్పే మాట.  అందుకు వారు ఉదహరిస్తున్న ఈ క్రోనాలజీ చూస్తే ఎవరికైనా అది నిజమేగా అనిపించకమానదు.  జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి.  చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి,  ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసినవారెవరూ ఉండకపోవచ్చచునం టారు పరిశీలకులు.  ఈ విషయంలో జగన్  తాత రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి అనువంశికంగా అబ్బిన విద్య అంటారు.   లా యునివ‌ర్శిటీ ఎలాగో.. అన్ లాయూనివ‌ర్శిటీ అనేది ఉండి ఉంటే ఆ వర్సిటీకి జ‌గ‌న్ ను  హెడ్ అయి ఉండేవారంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ క్విడ్ ప్రోకో కేసుల్లో  చట్టంతో చెలగాటమాడుతున్న తీరు తెలిసిందే. విచారణ ముందుకు సాగకుండా వరుస డిశ్చార్జ్ పిటిషన్ లతో ఆయన కేసును సాగతీస్తున్న తీరు న్యాయ నిపుణులనే విస్మయపరుస్తోంది.  ఇటీవ‌ల  జ‌గ‌న్ కేసుల‌ను ప‌రిశీలిస్తున్న న్యాయ‌మూర్తి బ‌దిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో న్యాయమూర్తి వచ్చారు. జగన్ కేసులు విచారిస్తున్న న్యాయమూర్తి బదలీ అయితే ఏంటి అని అంతా అనుకోవచ్చు కానీ  కొత్తగా వచ్చిన న్యయమూర్తి జగన్ కేసులకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ పరిశీలించడానికి కొన్నేళ్లు పడుతుంది.  దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. సరే బదలీ అనేది సాధారణం కదా అనుకోవచ్చు. కానీ జగన్ తన కేసుల విచారణ ముగింపు లేకుండా అలా కొక.. సాగుతూ ఉండటానికి పలు పద్ధతులు అవలంబిస్తుంటారు..  వాటిలో ఒకటే   డిశ్చార్జీ పిటిష‌న్ల వ‌ర‌ద పారించడం. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ కేసులలో  130 డిశ్చార్జీ పిటిష‌న్లు దాఖలయ్యాయి. అలాగే విచారణపై స్టేలు కోరుతూ పిటిషన్ వేయడం. ఇలాంటి పిటిషన్ల విచారణ ద్వారా కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకోవడం, అలాగే  ఈ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం.   2019- 24 మ‌ధ్య సీఎంగా అధికారంలో ఉన్నందున, పాలనా పరమైన అడ్డంకులకు అవకాశం లేకుండా, తనకు కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచిమినహాయింపు కావాలంటూ పిటిషన్ వేసి మినహాయింపు పొందిన జగన్.. ఇప్పుడు అధికారంలో లేకపోయినా, కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా.. తాను కోర్టుకు వస్తే.. జనం ఇబ్బందిపడేంతగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడతాయనీ, తన భద్రతకు ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుందంటూ కోర్టును మళ్లీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తాను చెప్పిన మాట వాస్తవమని  అందరూ నమ్మే విధంగా ఇటీవల ఆయన నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు వైసీపీయులు చేసిన హంగామా జగన్ ప్లాన్ లో భాగమేనంటారు పరిశీలకులు.   ఒక సాధార‌ణ ఎంఎల్ఏగా ఉన్న జగన్ కు ఎలాంటి హైఎండ్ ప్రోటోకాల్ లేకున్నా ఉన్న‌ట్టు గా సృష్టించి.. కోర్టు విచారణకు తనకంటూ ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్న ఘనత జగన్ కే చెల్లుతుందంటున్నారు.   తాను ఎప్పుడు కోర్టుకు హారైనా జనం ఇలా తండోపతండాలుగా తనను చూడటానికి వస్తారనీ, వారిని కంట్రోల్ చేయడం, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాలకు, పోలీసులకు తలకు మించి భారం అవుతుందన్న బిల్డప్ క్రియేట్ చేశారు. ఇప్పడు అదే చూపి మరో సారి కేసుల విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.  ఇన్ని రకాలుగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా జాప్యం అయ్యేలా జగన్ మేనేజ్ చేయగలుగుతున్నారంటే దానికి చట్టంతో చెలగాటమని కాకుండా మరేమనాలని ప్రశ్నిస్తున్నారు. కేసు వాయిదాలు కోరడానికే జగన్ న్యాయవాదుల ఖర్చు కోట్ల రూపాయలు ఉంటుందని ఇటీవల కొన్ని గణాంకాలువెలుగులోకి వచ్చాయి.  లాతో గేమ్స్ ఆడుకోవ‌డం ఎలా అని ఒలింపిక్స్ లో పోటీ పెడితే.. జగన్ కు గోల్డ్ మెడల్ ఖాయమంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. చూడాలి మరి ఇంకెంత కాలం ఈ కేసుల విచారణను జగన్ తన స్టైల్ లో సాగదీస్తారో?  

క్రిస్మస్ వేడుకలకూ జనసమీకరణేనా జగన్?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గత ఎన్నికలలో ఓటమి తరువాత పూర్తిగా మారిపోయారు. అధికారంలో ఉన్నంత కాలం వందిమాగధులు తప్ప పార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజలు ఇలా ఎవరినీ దరి చేరనీయకుండా వ్యవహరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. తన వెంట ఇంకా జనం ఉన్నారని చాటుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. ఎన్నికలలో ఓటమి పాలైనా తమ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందనీ, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామనీ పదే పదే చెప్పుకున్న జగన్, ఇప్పుడు తాను బయటకు వస్తే జనం ఉండాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకే అధికారం కోల్పోయిన తరువాత ఆయన రాష్ట్రంలో చేసిన ప్రతి పర్యటనలోనూ శాంతి భద్రతలు అదుపుతప్పాయి. సామాన్య జనం ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఆంక్షలు విధించినా వాటిని ధిక్కరించి మరీ వైసీపీయులు జగన పర్యటనలకు జనాన్ని భారీ ఎత్తున సమీకరించి బల ప్రదర్శనకు దిగుతున్నారు. జనంలో  తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు. సరే ఆయన రాజకీయ ఓదార్పు, సమస్యలపై ప్రజల్లో చెతన్యం అంటూ చేస్తున్న పర్యటనలకు భారీ జనసమీకరణ చేయించుకున్నారంటే అర్ధం చేసకోవచ్చు, కానీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా పులివెందుల చర్చికి వెళ్లిన సందర్భంగా కూడా జిల్లా నలుమూలల నుంచీ జనాలను తరలించడం పట్లే పరిశీలకుల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతున్నది. తాను బయటకు వచ్చినప్పుడు భారీగా జనం గుమిగూడకపోతే.. తాను చెప్పుకుంటున్న 40శాతం ఓటు బ్యాంకు మద్దతును ఎవరూ నమ్మరన్న సంశయంతోనే  ఇలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   జగన్ తన మూడు రోజుల పులివెందుల పర్యటనలో తొలి రోజు మాత్రమే జనం ముందుకు వచ్చారు. ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ తరువాత జ్వరం అంటూ ప్రీ క్రిస్మస్ వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. అంతే కాదు జనానికీ ముఖం చాటేశారు. కానీ క్రిస్మస్ రోజు న మాత్రం భారీ ఎత్తున జనసమీకరణకు పార్టీ నేతలను ఆదేశించారు. ఇక్కడే ఆయన ప్రీక్రిస్మస్ వేడుకలలో పాల్గొనకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీ క్రిస్మస్ వేడుకలకు అయితే.. జగన్ కుటుంబ సభ్యులు వినా సామాన్య జనం వచ్చే అవకాశం ఉండదు. ఈ కారణంగానే ఆయన ప్రీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన లేదని అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చి వెలుపల కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడటాన్ని బట్టి చూస్తుంటే.. ఆయన బయటకు వచ్చేది బల ప్రదర్శన కోసమేనా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి.  

మోడీ మౌనం దేనికి సంకేతం?

బంగ్లాదేశ్ లో  హిందూ వ్యతిరేకత పెచ్చరిల్లుతుంటే మోడీ మౌనం వహించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతున్నది. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక విషయాలలో ఆమోదయోగ్యం కాని నిర్లక్ష్యం వహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మణిపూర్ విషయంలో కానీ, అసలు కీలక సమస్యలపై పార్లమెంటులో చర్చ విషయంలో కానీ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని అంటున్నారు.  ఇప్ప‌టికీ మ‌ణిపూర్ మ‌ర‌క అలాగే  ఉంది. ఆ రాష్ట్రంలో ప్ర‌ధాని ప‌ర్య‌టించిన‌పుడు కూడా ఎలాంటి స్పంద‌నా లేదు. అదలా ఉంటే.. తాజాగా పార్ల‌మెంటు సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ  పట్టుబట్ట బట్టి, ఓట్ చోర్ వ్య‌వ‌హారంలో ఆ మాత్రమైనా చర్చ జరిగింది. అది పక్కన పెడితే..    ఢిల్లీ కారుబాంబు పేలుడు వంటి   కీల‌కాంశాలు సభలో అస‌లు చ‌ర్చ‌కే  రాలేదు. అలాంటి అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం.  ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ  భ‌క్తి  హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే..  బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?   ఇక్కడే ఈ సమయంలో ప్రధానిగా  ఇందిరాగాంధీ ఉండి ఉంటే  ప‌రిస్థితి ఇలా  ఉండేదా? అన్న చర్చ జరుుగతోంది.  బంగ్లాదేశ్ లో ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని  తాత్కాలిక  ప్ర‌భుత్వం న‌డుస్తోంది. ఆయ‌న  ప్ర‌జాస్వామికంగా ఎన్నికైన పాల‌కుడు కాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం దక్కింది. ఆయన తీరు కారణంగా ఇప్ప‌టికే బంగ్లాదేశ్ సైన్యం అక్కడి ప్ర‌భుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నది. యూన‌స్ సర్కార్  ప్ర‌జా  ప్ర‌భుత్వం  కాదు కనుక ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మొండికేస్తున్నది.   అదలా ఉంటే..  యూన‌స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన భార‌త  వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల‌ను ఆక్ర‌మించే య‌త్నం చేస్తున్నారు.  చైనాతో క‌ల‌సి బార‌త  వ్య‌తిరేక కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. అలాగే దేశంలో హిందువులపై అత్యంత అమానవీయంగా దౌర్జన్యకాండ సాగు తోంది. తాజాగా ఒక హిందువును స‌జీవ ద‌హ‌నం చేసిన  ఘ‌ట‌న‌లో కేంద్రం క‌నీసం స్పందించలేదు. ఆయన అక్కడ పరమత దూషణకు పాల్పడలేదు.. కేవలం దేవుడు ఒక్క‌డేగానీ ఆయ‌న  పేర్లు ఎన్నో అని మాత్రమే అన్నాడు. ఆ మాత్రానికే అత‌డిని సజీవదహనం చేశారు.  అలాంటి బంగ్లా ప్ర‌భుత్వంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది.  డిమాండ్లు హోరు మంటున్నాయ్. హిందుత్వ, దేశ భక్తి, అఖండ భారతం అంటూ వల్లెవేసే మోడీ సర్కార్..బంగ్లాలో హిందువులపై జరు గుతున్న దౌర్జన్యాలు, దాడులపై స్పందించకపోడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. 

జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ?

  వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు, అరెస్ట్ చేస్తానంటున్నాడు.​ కూటమి ప్రభుత్వ భాగస్వామ్యానికి ఎవరైనా ముందుకు వస్తే, తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ  మోడల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానించినందుకు నిరసనగా 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం చేపట్టారు.  కోటి సంతకాలు చేసిన వారి చిరునామా, ఫోన్ నంబర్లు కూడా పొందుపరిచామని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని కూడా తెలిపారు. ఇది మాత్రం కొత్త విధానం. "మేము అబద్ధం చెప్పడం లేదు" అని నిరూపించుకునే ప్రయత్నం ముందుగానే చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.​ప్రైవేటు భాగస్వామ్యం గురించి ఒక అనుమానం వ్యక్తం చేయడం, అందుకు నిరసన వ్యక్తం చేయడం విపక్షంగా జగన్ బాధ్యత. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టగానే, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని భావించిన వారికి, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వినగానే నిరాశే మిగిలింది.​  ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల జనాభాలో, ఇంత తక్కువ వ్యవధిలో ఒక కోటి నాలుగులక్షల సంతకాలు సేకరించడం అంటే అంత సులభం ఏమీ కాదు. ప్రతి పల్లెలోనూ, పట్టణాలలోనూ జనరల్ బాడీ మీటింగులు పెట్టినా సేకరించడం కష్టం. పల్లెల్లో సంతకాలు పెట్టడం మరీ కష్టం. అధికారపార్టీకి వ్యతిరేకంగా సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా సంకోచిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను 'సంక్షేమ రాష్ట్రం' అనే కంటే 'సంక్షేమ పథకాల రాష్ట్రం' అంటే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలే కాక, వారి మేనిఫెస్టో ప్రకారం చేసిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. తటస్థంగా ఉండేవాళ్ళు అంత బాహాటంగా రారు. పట్టణాలలో మీటింగులకు రావడమే కష్టం. ​ఇన్ని పరిమితుల మధ్య కోటి సంతకాలు సేకరించడం కష్టంతో కూడుకున్న పని. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉన్నట్లు వెంటనే రుజువు అవుతూ ఉంటాయి.  అందుకే సంతకాల విషయంలో రుజువులు కూడా జత చేయవలసి వచ్చింది. ఇంత కష్టపడి కార్యకర్తలు చేసిన పనిని, ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలతో వృధా చేశారు. పీపీపీ మోడల్‌ను తాను ఇంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి ప్రభుత్వ భాగస్వామ్యంలో వైద్య కళాశాలలు తీసుకుంటే, వారిని తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు మొదలు తెలుగుదేశంపార్టీ కార్యకర్తల నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్ట్ చేసే పనిలో పడి పాలనను మరచిపోవడమే జగన్ ప్రస్తుత పరిస్థితికి కారణం.  ప్రధానమంత్రి, అమిత్ షా ఆశీస్సులు ఉంటే చాలనుకుని పాలనకు దూరంగా ఉన్నారు. బటన్ నొక్కితే చాలనుకుని ప్రజలకు దూరం అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరెస్టులు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడ్డాయో అనే సమీక్ష జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కానీ, ప్రజలకు అరాచకం నచ్చకనే జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టారు.​ ఆయన అధికారంలోకి వస్తేఏంచేయాలనుకుంటున్నారు అంటే 'జైళ్లు నింపుతాడు' అనే నినాదం ఇస్తున్నట్లుగా ఉంది. ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార సంస్థలను వెళ్లగొడతాను అనే మాటతోనే ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. ఆయనకు చాలా పెద్ద న్యాయవాదుల బృందం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారిని జైల్లో పెట్టడానికి చట్టరీత్యా అవకాశం ఉండదు అనే కనీసపు సలహా కూడా ఇస్తున్నట్లుగా లేరు. ఆయనకు రాజకీయ సలహాదారులు కూడా అనేకమంది ఉన్నారు.  ఇలా బెదిరించినందువలన ప్రజలు ఓట్లు వేయరు అనే సలహా మాత్రం చెప్పడం లేదు.​ తానొక మాజీ ముఖ్యమంత్రి అనే విషయం మరచిపోయి, యోగా దినోత్సవం నాడు ప్రధాని ఆంధ్రప్రదేశ్ వచ్చి యోగా చేసిన విషయం పక్కన పెట్టి, మీడియా ముందు అభినయం చేస్తూ చేసిన హేళన.. ఆయన ప్రజాక్షేత్రంలో ఇక ప్రజలను మెప్పించలేరు అనే విషయాన్ని ఆయనే చెప్పుకున్నట్లు అయింది. అటువంటి అభినయం చూసిన వారు కొంతమంది ఆయన్ను కమెడియన్లతో పోలుస్తున్నారు. తాను అధికారంలో ఉండగానే గౌరవం కోల్పోయారు. బెదిరిస్తే బెదరరు అని అర్థమయ్యాక కూడా 'జైల్లో పెడతాము' అంటారు.  ఉద్యోగులను రిటైర్ అయినా వదిలిపెట్టం అని అంటారు. జగన్మోహనరెడ్డి ఎలాగూ అంటున్నాడు కాబట్టి మేము తక్కువ కాదు అన్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఇరిగేషన్ డిపార్టుమెంటు ఉద్యోగులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కుమ్మక్కు అయి అవినీతి చేస్తున్నారంటూ, వాళ్ల ప్రభుత్వం రాగానే జైల్లో వేసి వాళ్ల ఆస్తులన్నీ జప్తు చేయిస్తారట. 'సముద్రం లోపల ఉన్నా వదిలిపెట్టను' అంటాడు జగన్. ​దేశమంతా అమలు చేస్తున్న పీపీపీ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నది. పథకంలో ఏవైనా అప్రజాస్వామికమైనవి ఉంటే ముందుగా ఆపథకాన్ని ఛాలెంజ్ చేయాలి.  ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఒక పథకాన్ని, దానికి కొన్ని మార్గదర్శకాలనే కాకుండా కొన్ని నిధులను కూడా సమకూర్చిన కేంద్రం మీద కనీసపు నిరసన తెలపకుండా.. కేంద్రం సూచించిన విధంగా పీపీపీ మోడ్‌లో కళాశాలలను ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు నాయుడునో, భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ వ్యక్తులనో అరెస్ట్ చేయాలనడం జగన్ అవివేకానికి చిహ్నం. ​దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలలో ప్రభుత్వమే సీట్లు అమ్మే సంస్కృతిని పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓల పైన అప్పటి ప్రతిపక్షం టీడీపీ  న్యాయపరమైన చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం.  ఆ విషయమై ఇప్పటికీ రాష్ట్రంలో పౌరులకు కనీస అవగాహన కలిగించకపోవడం టీడీపీ వైఫల్యానికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి కోరుకునేది పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం అనుకుంటే, ముందుగా చేయవలసింది మెడికల్ సీట్లను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టిన తన పాలసీకి ప్రజలకు క్షమాపణ చెప్పి, పీపీపీ మోడ్‌లో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ విధానాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయాలి. అటువంటి విధానాన్ని రూపొందించిన కేంద్రానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి. ​జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిలబడాలనుకుంటే వాస్తవాలు మాత్రమే ప్రజలకు వివరిస్తూ, ఒక పద్ధతిలో నిరసన తెలుపుతూ న్యాయపోరాటం చేయాలి.  కానీ ఆయన అధికారం గురించి, చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల కోసమే అయితే సాదాసీదాగా లోకేష్ మాదిరిగా ప్రజలకు చేరువ కావాలి. ముఖ్యంగా వాస్తవాలు మాట్లాడాలి. పొద్దుటే మీడియా ముందు యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  అక్కడ జగన్ విశ్వసనీయత కోల్పోతున్నారు.​ఇక రుషికొండ రాజభవనం గురించి జగన్ మాట్లాడకపోవడమే మంచిది. అధికారంలో ఉన్నప్పటి కంటే, అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని ఎక్కువ కోల్పోయి, కూటమి ప్రభుత్వానికి మరో పదేళ్లు తానే బాటలు వేస్తున్నట్లుగా ఉన్నది. అందుకే జగన్ చెప్పే కోటి సంతకాలను కూడా ప్రజలు విశ్వసించలేక పోతున్నారు.   

అమరావతికి చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందే ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ విషయంలో ఇప్పుడు ఎవరిలోనూ ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ స్థాయి నగరంలో అమరావతి రూపుదిద్దుకుంటోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విజనరీ చంద్రబాబు మార్గదర్శకత్వంతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆల్ ఇన్ వన్ సిటీగా అమరావతి రూపుదాల్చుతోంది. ఇంత వరకూ అంతా బానే ఉంది. కానీ చాలా మందిలో ఓ చిన్న అనుమానం, చిన్న శంక, చిన్న సందేహం. ఒక వేళ తరువాత ఎప్పుడైనా జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏమిటి? 2014 నుంచి 2019 వరకూ శరవేగంగా సాగిన అమరావతి నిర్మాణం.. 2019లో జగన్ అధికారంలోకి రాగానే పడకేసింది. అంత వరకూ నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతి, జగన్ మూడు రాజధానులంటూ ప్రారంభించిన మూడు ముక్కలాటతో నిర్మాణుష్యమైపోయింది. పురోగతిలో ఉన్న భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. అప్పటి వరకూ కళకళలాడిన అమరావతి వెలవెలబోయింది. మరో సారి అటువంటి పరిస్థతి రాకూడదంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్నది జనం డిమాండ్ గా మారిపోయింది. అందుకు రాష్ట్రప్రభుత్వమూ సై అంది. అందుకే ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సిన పరిస్థితి వచ్చింది.    2019లో జగన్ అధికారం చేపట్టిన తరువాత అమరావతిని నిర్వీర్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ గత పదకొండేళ్లుగా  రాజధాని లేని రాష్ట్రంగా  మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రాజధాని కోసం లాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతులు ఈ విషయంలో గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.  ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఆమోదముద్రపడుతుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే  అమరావతికి చట్టబద్ధత కల్పించాలని  కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. అయినా ఈ సమావేశాల్లో అటువంటి అవకాశం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. స్వయంగా ప్రధాని మోదీ చేతులమీదగా రెండుసార్లు అమరావతి శంకుస్థాపన జరిగింది. .33వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు అభివృద్ధిచేసిన ప్లాట్స్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని 10 ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ 20 వేల ఎకరాలు రాజధాని విష్తరణకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పూలింగ్ ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో చంద్రబాబు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

కేసీఆర్, మోడీ.. డీల్ సెట్ అయ్యిందా?

చాలా మంది అనుకుంటున్న‌ట్టు.. కేసీఆర్   ఫామ్ హౌస్ లో కూర్చోవడానికి ఆరోగ్యం కారణం కాదట... ఆయన అరోగ్యం శారీర‌క‌మైన‌ది కాదు,  ఆర్ధిక‌ప‌ర‌మైన‌ది, బయటకు తెలియని రాజకీయపరమైనది అనంటున్నారు.   తెలంగాణలో ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న‌ ఒక శ‌తృవును ఢీ కొట్టాలంటే.. మ‌రో ఇద్ద‌రు మితృలుగా కలవాలి అన్న భావనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు.  రేవంత్ దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని  మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ ముందుకెళ్తున్నారు. దీంతో ఇటు మోడీకి, అటు కేసీఆర్ కి ఒక ర‌క‌మైన మితృత్వం అవ‌స‌ర‌మైంది. ఎలాగైనా స‌రే ఇక్క‌డ పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న మోడీ ఏకకాలంలో ఇటు కేసీఆర్, అటు రేవంత్ ఇద్దరికీ సమప్రాధాన్యత ఇస్తూ పొలిటికల్ గేమ్ అడుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్ కి అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేశారు. అదేమంత ఫలితం ఇచ్చినట్లు కనబడదు.  నెక్స్ట్ స్టెప్ లో.. కేసీఆర్ అండ్ కో    లోక్ స‌భ‌లో లోపాయికారిగా స‌హ‌క‌రిస్తామ‌ని  మోడీకి మాటిచ్చారంటున్నారు. అన్నట్లుగానే  కేసీఆర్ తాను జీరో  అయ్యి మరీ బీజేపీకి 8 ఎంపీ  సీట్ల‌తో ఒక ఊపు ఉత్సాహం కలిగించేలా 2024 సార్వత్రిక ఎన్నికలలో సహకరించారంటారు పరిశీలకులు. అయినా స‌రే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం  క‌నిక‌రించ‌కుండా కేసీఆర్ లాంటి మ‌ద‌గ‌జాన్ని సంపూర్ణంగా  గుప్పెట్లో పెట్టుకోవాల‌న్న యోచనతో   క‌వితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేందు కూడా సై అన్న కేసీఆర్.. ఆ తరువాత బీజేపీతో అసలు డీల్ స్టార్ట్ చేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.  సరే సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందం టున్నారు విశ్లేషకులు.   గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు. ఇంతకీ మోడీ పాలసీ ఎంటంటారా?.. భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీల అగ్రనాయకులను తొలుత కేసులతో భయపెట్టి, ఆ తరువాత   కమలం శరణ్యం అనేలా దారికి తెచ్చుకోవడం. కేసీఆర్ విషయంలోనూ మోడీ అదే పాలసీని అవలంబించి ఉంటారని అంటున్నారు.   ఈ నేపథ్యంలోనే ఇటీవల  రేవంత్ చేసిన కామెంట్ ను కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఫార్ములా వన్ రేస్ కేసులో  కేటీఆర్ విచార‌ణ‌కు,  కాళేశ్వ‌రం వ్య‌వ‌హారంలో కేసీఆర్, హ‌రీష్ ల అరెస్టుకు ఈడీ, సీబీఐకి అనుమ‌తులివ్వ‌డంలో కేంద్రం ఆమోదయోగ్యం కాని జాప్యం చేస్తున్నదని రేవంత్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. సరే ఆ తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి.   కాళేశ్వరం వ్యవహారంలో ఇంకా ఎటువంటి కదలికా రాలేదన్నది తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన సుదీర్ఘ అజ్ణాతాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించడం చూస్తుంటూ.. కేంద్రంలో ఆయన ఏదో ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చినట్లే భావించాల్సి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఆదివారం (డిసెంబర్ 21) మీడియా సమావేశంలో విమర్శలు గుప్పిస్తూనే మోడీ గారు అని సంబోధించడాన్ని వారు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. గతంలో మోడీయా, బోడీయా అన్న కేసీఆర్ ఇప్పుడు మర్యాదపూర్వకంగా మోడీగారూ అంటూ విమర్శించడమే ఏదో ఒప్పందం జరిగే ఉంటుందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. 

న‌క్స‌ల్ ఫ్రీ కంట్రీ ఎలాగో....వైసీపీ రాక్ష‌సుల్ ఫ్రీ స్టేట్ సాధ్య‌మేనా?

  ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు. 2026 మార్చి 31 నాటికి న‌క్స‌ల్ ఫ్రీ కంట్రీగా భార‌త్ ని ఎలా చేస్తున్నారో.. ఏపీ  గ‌వ‌ర్న‌మెంట్ త‌లుచుకుంటూ జ‌గ‌న్ వెంట ఉన్న ఫ్యాక్ష‌నిస్టుల‌ను, గూండాల‌ను, మ‌ర్డ‌రిస్టుల‌ను అలాగే లేకుండా  చేయ‌డం ఏమంత క‌ష్టం కాద‌న్న కామెంట్ చేశారాయ‌న‌. దీంతో ఒక్కొక్క‌రి  ఫీజులెగిరిపోయాయ్. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ అండ్ కో ఉలిక్కి ప‌డింది. ఈ కామెంట్ ప‌వ‌న్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే.. అధికారులు సైతం జ‌గ‌న్, ఆయ‌న వెన‌కున్న ఫ్యాక్ష‌న్ ముఠాల‌ను చూసి భ‌య‌ప‌డుతుండ‌టం వ‌ల్ల‌. వారికంటూ ధైర్యం అందించే దిశ‌గా ప‌వ‌న్ ఈ కామెంట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనంత‌టిని బ‌ట్టీ చూస్తే.. ప్ర‌భుత్వం త‌లుచుకుంటే జ‌గ‌న్ని, ఆయ‌న పార్టీని నామ రూపాల్లేకుండా చేయ‌డం పెద్ద ప‌నేం కాద‌ని  తెలుస్తోంది. నిజానికి అది సాధ్య‌మేనా? అంటే అందుకు ద‌గ్గ‌ర్లో ఉన్న ఉదాహ‌ర‌ణ న‌క్స‌లైట్ల‌ను భార‌త  ప్ర‌భుత్వం  రూపుమాపుతుండ‌టం కంటి ముందు క‌నిపిస్తూనే ఉంది. నిన్న మొన్న తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ చెప్పే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లొంగిపోవ‌ల్సిన  మావోయిస్టుల‌  సంఖ్య కేవ‌లం 54 మంది మాత్ర‌మేన‌ట‌. యాభై నాలుగు మంది అంటే చాలా చాలా  త‌క్కువ సంఖ్య‌. ఇప్ప‌టికే కొన్ని వంద‌లాది మంది మావోయిస్టులు ఇటు ఛ‌త్తీస్ గ‌ఢ్, అటు మ‌హారాష్ట్ర‌తో పాటు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల ముందు లొంగిపోతున్న దృశ్యాలు లేదా ఎన్ కౌంట‌ర్ అవుతున్న దృశ్యాలు మ‌న‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి.  ఈ యాంగిల్లో చూస్తే జ‌గ‌న్, ఆయ‌న వెన‌కున్న ర‌ప్ప ర‌ప్ప బ్యాచ్ ని అంత మొందించ‌డం పెద్ద ప‌నేం కాదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌న 5 ఏళ్ల పాల‌నా కాలంలో చేసిన అవినీతి అక్ర‌మాల‌కు సంబంధించిన  ప్ర‌తిదీ  త‌వ్వి  పోస్తున్నారు సీఐడీ అధికారులు. ఇంకా ఎన్నో డిపార్ట్ మెంట్లు జ‌గ‌న్ చుట్టూ అల్లుకుని ఉన్న అవినీతి ప్ర‌పంచం మొత్తాన్ని డీకోడ్ చేస్తున్నారు. వ‌రుస అరెస్టులు చేస్తున్నారు.  అలాంటిది  జ‌గ‌న్ చుట్టూ ఉన్న వారితో పాటు జ‌గ‌న్ ని సైతం జైలు పాలు చేయ‌డం గానీ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణాన్ని అరెస్టు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. దానికి తోడు ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాలను బ‌ట్టీ చూస్తే.. ఇలాంటి వారు ఫ‌లానా కేసుల్లో ఫ్రేమ్ అయితే ఆ త‌ర్వాత ఉన్న ఆ అర‌కొర, బొటాబొటి ప‌ద‌వుల‌ను కూడా కోల్పోయి జైల్లో చిప్ప కూడు తినాల్సి వ‌స్తుంది. మ‌రో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లా జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం మారాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి జ‌గ‌న్ అండ్ గో గంగ‌మ్మ జాత‌ర రివ‌ర్స్ లో ప‌డేలా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో చెప్పేదేముందీ జ‌గ‌న్ రాక్ష‌సుల్ ఫ్రీగా ఏపీ స్టేట్ అవ‌త‌రించినా అవ‌త‌రిస్తుంది.

కవితను నియంత్రిస్తేనే కేసీఆర్ ఎంట్రీ క్లిక్!?

తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం వినా తమ పార్టీ పుంజుకోవడానికి మరో మార్గం లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. అది కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రియాశీలంగా మారి.. గతంలోలా తన మాటల మాయాజాలం ప్రయోగిస్తేనే పార్టీ  ఉనికి, భవిష్యత్ ఉంటాయనీ, లేకుంటే నానానిటీ తీసికట్టు అన్నట్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దిగజారడం ఖాయమన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. అంతే కాదు కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కావడానికి ఇదే మంచి తరుణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి  తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  నీటి కేటాయింపులు, హక్కులను  ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  అయినా కూడా పరిశీలకులలో కేసీఆర్ గతంలోలా తన మాటలతో మాయ చేయగలరా? ఆయన ప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందా? అన్న సంశయాలను వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమంటూ జరిగితే.. ఆయన తొలుత తన విమర్శల గళమెత్తాల్సింది తన తనయ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితపైనే. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత కల్వకుంట్ల కవిత.. ప్రణాళికా బద్ధంగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లను లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరంభించిన విమర్శల దాడి క్రమక్రమంగా విస్తరిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో అవినీతిపై ఆమె చేస్తున్న విమర్శలకు జనం నుంచి స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఒకరిద్దరు నేతలు కవితపై ప్రతి విమర్శలు చేస్తున్నప్పటికీ కల్వకుంట్ల కుటుంబం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి.   ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ వెనుకబడటంతో కేసీఆర్ రంగంలోకి దిగక తప్పని అనివార్య పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. అయితే కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె విమర్శలకు దీటుగా సమాధానం చెప్పకుండా నీటి సమస్యలు, సెంటిమెంట్ అంటూ మాట్లాడితే జనం వినే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా ఆమె కవిత విమర్శల ధాటిని ఆపగలిగేలా విమర్శనాస్త్రాలు సంధించాల్సి ఉంటుంది. అది కేసీఆర్ చేస్తారా? సొంత కుమార్తెపైనే  మాటల దాడికి దిగుతారా అన్నది వేచి చూడాల్సిందే.