Read more!

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (జూన్ 14)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

 టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (జూన్ 13) శ్రీవారిని 61 వేల 499 మంది దర్శించుకున్నారు.

వారిలో 33 వేల 384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 4 లక్షల రూపాయలు వచ్చింది.