బీఫ్ ఫెస్టివల్ లక్ష్యం నెరవేరిందా?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పెద్దకూర పండగ (బీఫ్ ఫెస్టివల్) రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా ఉద్యమం కంటే ఎక్కువగా దీని గురించి చర్చించుకొంటున్నారు. తెలంగాణా ఉద్యమం కోసం కలిసి కట్టుగా ఉద్యమించిన ఉస్మానియా విద్యార్ధులే ఇప్పుడు పరస్పరం కలహించుకుంటున్నారు. కత్తులతో దాడులు చేసుకొని ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు. చిలికిచిలికి గాలివాన అయినట్టుగా ఈ ఆహర అంశం చుట్టూ రాజకీయాలతోపాటు మత విద్వేషాలు చేరి నెమ్మదిగా పెద్ద సామాజిక సమస్యగా మరే పరిస్థితి కనిపిస్తోంది. అది పెద్దకురా అయినా.. చిన్న కురా అయినా ఆహారాన్ని ఆహారంగా కాకుండా మతం, కులం కోణంతో చూడటం వల్ల మానవత్వం మరింత కలుషితం అవుతుంది.

 

 

ఒకప్పుడు దళితులు గొడ్డు మాంసం ప్రధాన ఆహారమని ఉస్మానియా హాస్టల్లో కూడా తమకు గొడ్డు మాంసం వడ్డించాలని ఇటీవల కొంత మంది దళిత విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్ కు డెమెక్రాటిక్ కల్చర్ ఫోరంతో పాటు సిమాంధ్రులను దోపిడీ దారులుగానూ, దొంగలగానూ చిత్రీకరించి, తెలంగాణా సెంటిమెంట్ ను రెచ్చ గోట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వర రావు, గాలి వినోద్ కుమార్, నాగసూరి వేణుగోపాల్, మీనా కందస్వామి, డి. ప్రభాకర్ వంటి వారు మద్దుతు పలికారు. అంతేకాగ బీఫ్ ఫెస్టివల్లో వీరు కూడా పాల్గొన్నారు. ఇటువంటి ఫెస్టివల్ ను నిర్వహిస్తే అడ్డుకుంటామని ఎ.బి.వి.పి విద్యార్దులు ముందే హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ గోశాల సమాఖ్య సభ్యులు ఎ ఫెస్టివల్ నిర్వాహకులపై ముందుగానే పోలీసులకు పిర్యాదు చేశారు. గొడ్డు మాంసం తెచ్చి అంబేద్కర్ హాస్టల్ వద్ద వండుకుంటామని దళిత విద్యార్థులు చెబితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. అయితే బయట వండుకుని లోనికి తెచ్చుకుని తింటే తమకు అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు. దీనికి కూడా ఉస్మానియా యూనివర్సిటి అధికారులు అంగీకరించలేదు. కాని దళిత విద్యార్థులు బయట నుంచి బీఫ్ తో చేసిన బిర్యాని అంబేద్కర్ హాస్టల్ ఆవరణంలో కి తెచ్చి తింటుండగా ఎ.బి.వి.పి విద్యార్దులు అడ్డుకోవడానికి ప్రయత్ని౦చారు. అనంతరం రెండు వర్గాల మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది.  జీవహింసను వ్యతిరేకించే బౌద్ధ మతంలో చేరిన అంబేద్కర్ పేరిట ఉన్న హాస్టల్ వద్ద కత్తిపోట్లు కూడా చోటుచేసుకున్నాయి. రక్తం కూడా పారింది. అప్పటి దాక దళిత విద్యార్థులకు మద్దతు ప్రకటించిన మేధావి వర్గం అంతా అక్కడ నుంచి పరారైపోయింది. వీరించిన సలహాలు, ప్రోత్సాహంతో విందు జరుపుకున్న విద్యార్థులకు పోలీసు కేసులు మిగిలాయి.



ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు హాస్టల్ లో బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవచ్చా? లేదా? అన్న వాదోపవాదాలు ప్రారంభం కావడం మరో ఎత్తు. ఎవరి ఆహార అలవాట్లు వారివి. మనది లౌకిక, ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఏ మతాన్ని అయినా అవలభించవచ్చు. ఎవరి సంప్రదాయాలను, అలవాట్లను కొనసాగించుకోవచ్చు. ఎవరి అలవాట్లు వారివి, అటువంటప్పుడు పెదకూర పండుగ అంటూ ప్రత్యేకంగా బీఫ్ తినడాన్ని పండుగగా చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నను కొందరు ముందుకు తీసుకువస్తున్నారు. అగ్రకులాలకు చెందినవారు తినే ఆహారమే ఉన్నతమైనది. ఇతరులు తినే ఆహారం నీచమైనదా? కులతత్వంతో కునారిల్లుతున్న భారతదేశంలో కొన్ని కులాలవారు నీచులని, అంటరానివారనే భావన వుంది. అంటరాని కులాలకు చెందిన వ్యక్తులు ఆహారపు అలవాట్లు కూడా నీచామనే ధోరణి చాలామందిలో వుంది. కులం కారణంగా ఎవరూ నీచులు కారని, అదే విధంగా కింది కులాలు తినే ఆహారం నీచం కాదనే తెలియచెప్పడం కోసమే పెద్దకూర వంటి పండుగలు అనివార్యమావుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంది నీచ జంతువూ అయినా శూద్రులలో అగ్రకులాలుగా వున్న అనేకమంది దీని మాంసం తింటారు. అగ్రకులంవారు తింటారు కాబట్టి ఆ మాంసం నీచం కాదు. గొడ్డు మాంసం కేవలం కింది కులాలకు చెందినవారు మాత్రమే తింటారు కాబట్టి అది నీచంగా ప్రచారం చేశారు.



గొడ్డుకూర పండుగలో పాల్గొనడం, దానిని తినడం వల్ల మీరు సాధించింది ఏమిటని హిందుత్వధోరణులతో వున్న విద్యార్థులు కొందరు మేధావులు, విద్యావంతులను ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ పండుగ చేయడం ద్వారా దళితులు తమ సైద్దాంతిక హక్కును చాటుకొనే ప్రయత్నం చేశారన్న వాదన వినిపిస్తోంది.



ఎద్దు మాంసం వండినా, వివిధ వర్గాల వారు ఉండే హాస్టళ్ళలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినా ఆవును పూజించేవారు ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతో పెద్దకూర పండుగ చేసుకొంటున్నారనే అంశాన్ని మరికొంతమంది ముందుకు తీసుకువస్తున్నారు. పెద్దకూర పండుగ చేస్తున్నప్పుడు పందిమాంసం పండుగ ఎందుకు చేయకూడదు? అంటూ మతతత్వసంస్థలు నిర్వహించే విద్యార్థి సంఘాలు ఎద్దేవా చేస్తున్నాయి. పందిమాంసం పండుగ చేస్తే పందిమాంసాన్ని ముట్టుకోవడమే పాపంగా భావించే మతానికి చెందినవారు సహించరని, వారిని ఎదిరించే సత్తా వీరికి లేదని పరోక్షంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.



విద్యా సంస్థల్లో వివిధ వర్గాల వారు ఉంటారు. కొందరు గొడ్డుమాంసం కావాలంటున్నారు. యానాదులు వంటివారు ఎలక మాంసాన్ని, మరి కొందరు రకరకాల పిట్ట మాంసాలతో పాటు పావురాయి మాంసాన్ని, ఇంకొందరు పిల్లి మాంసాన్ని కావాలని డిమాండ్ చేస్తే వాటిని కూడా వడ్డించడం సాధ్యం అవుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో శాఖాహారం ఉన్నతమైనదని, మాంసాహారం నీచామైనదనే ప్రచారం కూడా జరుతుతోంది. నిజానికి ప్రపంచ జనాభాలో 95 శాతం మంది మాంసాహారులే. అమెరికా, యూరోపియన్ దేశాల్లో గొడ్డు, పందిమాంసం ప్రధానమైన ఆహారం. భారతదేశంలో కూడా 90 శాతం మంది మాంసాహారులే. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో పూజారి వర్గానికి చెందిన వారు కూడా మాంసాహారం భుజిస్తారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులను బట్టి ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి. ఎవరిళ్ళలో ఎవరికీ ఇష్టమైన ఆహారం వారు తీసుకుంటే ఏ గొడవా ఉండదు. యూనివర్సిటీల్లోని సామూహిక భోజనశాలల్లో ఎక్కువమంది ఇష్టపడే ఆహారం వద్దించక తప్పదు. మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో గొడ్డుమాంసం తినేవారు తక్కువ శాతం ఉన్నారన్నది నిర్వివాదాంశం. వీరి కోసం సామూహిక భోజనశాలల్లో గొడ్డుమాంసం వడ్డిస్తే, వీరిలాగే ఇతర రకాల మాంసాలను ఇష్టపడే వారి కోర్కె కూడా తీర్చాల్సి వస్తుంది. ఏదో ఒక వర్గం సైద్ధాంతిక హక్కు చాటుకోవడం కోసం ఫలానా మాంసం కావాలని కోరుకుంటే ఇతర వర్గాలు కూడా అలాంటి హక్కునే చాటుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ మరో అంశం కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ హక్కు చాటుకోవాలనే భావన వారికే వచ్చిందా లేక వారికెవరైనా సూరిపోశారా? ఈ హక్కులను అడ్డుకున్న వర్గం వెనుక ఎవరున్నారన్న విషయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”