ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న కింజరాపు అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పల్లా శ్రీనివాసరావును ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై పల్లా 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.