తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా జె.శ్యామలరావు
posted on Jun 14, 2024 @ 10:19PM
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జె.శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈవోగా వున్న ధర్మారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం సెలవులో వున్న ధర్మారావు అటు నుంచి అటే టీటీడీకి దూరమవుతున్నారు. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.