మరోసారి చిక్కుల్లో అమితాబ్.. 15 సంవత్సరాల నాటి కేసు..
posted on May 11, 2016 @ 1:30PM
ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక పక్క పనామా పేపర్స్ పుణ్యమా అంటూ పేరు బయటకు వచ్చింది. ఆ తరువాత ఇంక్రెడిబుల్ ఇండియా అంబాసిడర్ గా నుండి కూడా ఛాన్స్ పోయింది. ఇప్పుడు మరో చిక్కు ఎదురైనట్టు కనిపిస్తోంది. 2001లో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి అమితాబ్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు పారితోషికంలో రూ. 1.66 కోట్లు పన్నుకట్టలేదని కేసు పెట్టింది. దీనిపై విచారించిన బాంబే హైకోర్టు కేసు కొట్టివేసింది. దీంతో ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆయన ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆదాయపు పన్ను శాఖకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. మొత్తానికి అమితాబ్ కు ప్రస్తుతం కాలం కలిసిరానట్టు కనిపిస్తోంది.