ఢిల్లీపై పెను దాడి కుట్ర భగ్నం...9 మంది నక్సలైట్లు అరెస్ట్
posted on Oct 16, 2016 @ 3:11PM
భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో ఎప్పుడు పాక్ ఎప్పుడు ఉగ్రదాడి జరుపుతుందా అని దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఢిల్లీపై పెను దాడి జరిపి విధ్వంసం సృష్టించాలన్న కుట్రను భగ్నం చేశారు. యూపీకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, తమకున్న సమాచారంతో ఢిల్లీపై దాడి జరిపి 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇది ఉగ్రవాదులు పన్నిక కుట్ర కాదు... నక్సలైట్లు పన్నిన కుట్ర. నోయిడాలోని రెసిడెన్షియల్ ప్రాంతంగా నిత్యమూ బిజీగా ఉండే హిండాన్ విహార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాగున్న నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్నామని, వీరిలో పీపుల్స్ వార్ గ్రూప్ కమాండర్ ప్రదీప్ కుమార్ సింగ్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 6 పిస్టల్స్, 50 క్యాట్రిడ్జ్ లు, 45 జిలిటన్ స్టిక్స్, 125 డిటోనేటర్లు, 13 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.