Read more!

కాపులు, బీసీలకు చంద్రబాబు బంపర్ ఆఫర్

 

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని బీసీకే ఇస్తామని చెప్పి, ఆర్.కృష్ణయ్య పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రలోని బీసీలు, కాపులకు ఒక బంపర్ ఆఫర్ని ప్రకటించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టిస్తామని, వాటిలో ఒకటి బీసీలకు, మరొకటి కాపులకు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఒక కమిషన్ కూడా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ద్వారా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బీసీలు, కాపులకు మరింత చేరువు అయ్యే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు.