Read more!

వెబ్‌సైట్లలో డిగ్గీ, అమృత ఫొటోలు తీసేయండి

 

 

 

తన కంప్యూటర్, ఈ మెయిల్ హ్యాక్ అయ్యాయని, వాటిలో వున్న తన, దిగ్విజయ్ పర్సనల్ ఫొటోలు లీక్ అయ్యాయని, అమృతారాయ్ చేసిన ఫిర్యాదుకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఐపీసీ సెక్షన్ 66ఎ, ఐటీ యాక్షన్ సెక్షన్ 509 కింద కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మొదటగా వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్న దిగ్విజయ్ సింగ్, అమృత రాసలీలల ఫొటోలను తొలగించాలని ఢిల్లీ పోలీసులు వెబ్ సైట్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఫొటోలను ఉపయోగించడం ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అలాగే అమృతా రాయ్ పేరు మీద నకిలీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు చలామణిలో వున్నాయని, వాటిని కూడా తొలగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.