ఏపీ శంకుస్థాపన తరువాత మోడీ ప్లాన్ ఏంటి?
posted on Sep 24, 2015 @ 11:04AM
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఖర్చుతో ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని.. తన సత్తా చాటాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఇంకా ఏపీ క్యాపిటల్ రాజధాని మ్యాప్ రూపొందించిన సింగపూర్ అధికారులు.. సింగపూర్ ప్రధానమంత్రి, ఇంకా జపాన్ మంత్రివర్గం మొత్తం ఓ 1000 మంది వీవీఐపీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్న అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే సమాచారం ప్రకారం గుంటూరు వద్ద కొండవీడులో 80 ఏకరాల స్థలంలో నిర్మిస్తున్న స్వర్ణ ఇస్కాన్ మందిరం భూమి పూజలో కూడా ప్రధాని పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు అనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.