ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కలిగే ఫలితాలు తెలుసా...

 

ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కలిగే ఫలితాలు తెలుసా...

 

విష్ణువును త్రిమూర్తులలో ఒకరిగా భావిస్తారు. మానవాళిని,  ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు ప్రతి యుగంలో  అవతారం తీసుకున్నాడు.  ఇక శ్రీకృష్ణుడు స్వయంగా తానే ధర్మ సంస్థాపన కోసం తాను ప్రతి యుగంలోనూ ఆవిర్భవిస్తానని చెప్పాడు.  సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపం అయిన శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాట విష్ణువు దశావతారాల గురించి తెలుసుకుంటే అర్థం అవుతుంది.  మహా విష్ణువుకు ఏకాదశి అంటే చాలా ప్రీతి.  ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి,  ఏకాదశి వ్రతం చేస్తారో.. వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని,  మహా విష్ణువు అనుగ్రహానికి పాత్రులు  అవుతారని చెబుతారు.  ఏకాదశి రోజు విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

విష్ణువు వెయ్యి పేర్లను ప్రస్తావిస్తూ సాగే పారాయణే విష్ణుసహస్రనామం.  విష్ణు సహస్రనామ పారాయణం వల్ల శాంతి లభించడమే కాకుండా జీవితంలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. భీష్మ పితామహుడు మరణశయ్యపై పడుకున్నప్పుడు, విష్ణు సహస్రనామాన్ని  యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఆ విష్ణుసహస్ర నామ పారాయణ ప్రయోజనాన్ని కూడా చెప్పాడు. విష్ణుసహస్ర నామం కేవలం భక్తికి సంబంధించినది మాత్రమే కాదు.. ఇది ఆధ్యాత్మికత,  ఆత్మ,  పరమాత్మలో ఐక్యం కావడానికి గొప్ప మార్గం అని అంటారు.  విష్ణువు అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు.

విష్ణు సహస్రనామ పారాయణ నియమాలు..

విష్ణు సహస్రనామ పారాయణకు ప్రత్యేక నియమాలు శాస్త్రాలలో వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

పవిత్రత- స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి, విష్ణుసహస్రనామం పఠించే ముందు. శ్లోక పారాయణం చేసేటప్పుడు శరీరం, మనస్సు  స్వచ్ఛత అవసరం.

సమయం,  ప్రదేశం - ఉదయం సమయం పారాయణకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది.  నిశ్శబ్దంగా,  శుభ్రమైన ప్రదేశంలో పారాయణం చేయాలి.

స్పష్టత,  సరైన ఉచ్చారణ - పారాయణం ప్రారంభించే ముందు, విష్ణువును ధ్యానించి మనస్సులో ఒక సంకల్పం చేసుకోవాలి. ఈ స్తోత్రాన్ని సరిగ్గా ఉచ్చరించాలి.

ఆసనం  ప్రాముఖ్యత - పారాయణం చేసేటప్పుడు ఆసనం కూడా సరిగా ఉండాలి.. కుశ గడ్డి లేదా ఉన్నితో చేసిన ఆసనం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది దృష్టిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నైవేద్యం, హారతి - పారాయణం పూర్తయిన తర్వాత, విష్ణువు హారతి చేసి నైవేద్యం సమర్పించాలి. దీనితో విష్ణు సహస్రనామ పారాయణం పూర్తవుతుంది.

విష్ణు సహస్రనామం  ప్రాముఖ్యత..

కర్మ శుద్ధి - విష్ణు సహస్రనామ పారాయణం  వ్యక్తి పాపాలను నాశనం చేస్తుంది.

సానుకూల శక్తి ప్రసారం - విష్ణు సహస్రనామం మానసిక ఒత్తిడి,  ప్రతికూలతను తొలగిస్తుంది. దీన్ని సరిగ్గా పారాయణ చేస్తే జీవితంలో శాంతి,  సానుకూల పెరుగుతుంది.

ఆరోగ్యం,  దీర్ఘాయువు - విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల శారీరక,  మానసిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

సంపద,  శ్రేయస్సు - విష్ణువు విశ్వ రక్షకుడిగా పరిగణించబడ్డాడు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు  అదృష్టం చేకూరతాయి.

మోక్షప్రాప్తి- విష్ణు సహస్రనామాన్ని భక్తితో పఠించే వ్యక్తి జీవన్మరణ బంధనాల నుండి విముక్తి పొందగలడని అంటారు.

                                        *రూపశ్రీ.