జపం మనసులో చేయాలా లేక బిగ్గరగా చేయాలా!

 

జపం మనసులో చేయాలా లేక బిగ్గరగా చేయాలా!

జపం అంటే కేవలం మంత్రాలను పదే పదే స్మరణ  చేయడం మాత్రమే కాదు. అది మానవ శరీరాన్ని విశ్వంతో , విశ్వ క్రమంతో సమన్వయం చేసే ఒక సాంప్రదాయ శాస్త్రం. మానవ శరీరం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, మరియు ఆనందమయ అనే ఐదు పొరలను, , స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే మూడు శరీరాలను కలిగి ఉంటుందని భావిస్తారు.  మంత్రాలను జపించినప్పుడు, అవి సృష్టించే ధ్వని లేదా ప్రకంపనలు మన అశాంత మనస్సును ప్రశాంతపరుస్తాయి. మంత్రాలను తరచుగా అక్షరాల సమూహంగా పొరబడతారు, కానీ వాస్తవానికి, అవి ధ్వనులు , అక్షరాల కలయిక. అందువల్ల, జపాన్ని రెండు ప్రధాన రకాలుగా చేస్తారు..  నిశ్శబ్ద జపం,  వాచిక జపం.  అయితే అసలు జపాన్ని ఎలా చేయాలి?  ఎలా జపం చేస్తే అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది?  తెలుసుకుంటే..

వాచిక జపం..

మంత్రాలను బిగ్గరగా జపిస్తే అది వాచిక జపం అవుతుంది. ఎవరైనా మంత్రాన్ని బిగ్గరగా జపించినప్పుడు, ఒక శబ్దం వినిపిస్తుంది. ఈ స్థితి చాలా అవసరం, ఎందుకంటే ఇది మొదట శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. శ్వాస లయబద్ధంగా మారుతుంది, ఛాతీ తెరుచుకుంటుంది , ప్రకంపనలు శరీరం అంతటా వ్యాపిస్తాయి.

ఇది చుట్టూ ఉన్న  వాతావరణాన్ని పాజిటివ్ గా  చేయడానికి కూడా సహాయపడుతుంది. ధ్వని ప్రభావం మనస్సును శుద్ధి చేస్తుంది, కాబట్టి పరధ్యానం ఎక్కువగా ఉన్నవారు  బిగ్గరగా జపించడం సాధనకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మనస్సు మందగించినప్పుడు లేదా చాలా  పరధ్యానంలో ఉన్నప్పుడు మనిషి  త్వరగా తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది, ఎందుకంటే శరీరం, శ్వాస , వాక్కు అన్నీ ఇందులో పాల్గొంటాయి. అందువల్ల, దీనిని ఎల్లప్పుడూ జపాన్ని మొదలు పెట్టినప్పుడు  ఉపయోగిస్తారు.

అంతర జపం..

మంత్రాన్ని నిశ్శబ్దంగా లేదా చాలా తక్కువ స్వరంతో జపించే స్థితినే ఉపాంసు అంటారు. ఇక్కడ స్వరం అంతర భావాలపై కేంద్రీకృతమవుతుంది. ఉపాంసు ఆలోచనల ప్రవాహాన్ని స్థిరపరచడానికి , మంత్రానికీ, శరీరంలో, మనసులో ఉండే భావాలకు మధ్య సామరస్యాన్ని నెలకొల్పడానికి సహాయపడుతుంది. ఇది మనస్సుకు  భంగం కలిగించకుండా చంచలత్వాన్ని తగ్గిస్తుంది, కాబట్టి ఇది బిగ్గరగా జపించడానికీ , మనస్సులో పదే పదే స్మరించడానికి మధ్య వారధిగా పనిచేస్తుంది.

నిశ్శబ్ద జపం..

నిశ్శబ్ద జపాన్ని మానసిక జపం అని కూడా అంటారు. మానసిక అంటే మంత్రాన్ని పూర్తిగా మనస్సులో జపించడం. ఇందులో శబ్దం గానీ, కదలిక గానీ ఉండదు. కేవలం చైతన్యం మాత్రమే జపాన్ని కొనసాగిస్తుంది. ఈ దశలో, మంత్రం సూక్ష్మ శరీరంపై పనిచేయడం ప్రారంభించి, పంచకోశంలోని లోతైన పొరలను ప్రభావితం చేస్తుంది. ఇది ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేస్తుంది. స్థిరంగా , క్రమంగా  సాధన చేస్తుంటే..  అధికారిక జపాన్నికి వెలుపల కూడా నిశ్శబ్దంగా జపాన్ని కొనసాగించవచ్చు.

జపానికి సరైన పద్దతి..

శరీరాన్ని, పరిసరాలను సిద్ధం చేసుకోవడానికి కొన్ని నిమిషాల పాటు వాచిక జపాన్ని మొదలుపెట్టడం అత్యంత సులభమైన పద్ధతి. ఆ తర్వాత, మనస్సును స్థిరపరుచుకుని, క్రమంగా ఉపాంసు జపం లేదా అంతర జపానికి మారాలి. అక్కడి నుండి అది సహజంగా మానసిక జపం లేదా నిశ్శబ్ద జపానికి  పరివర్తన చెందుతుంది, అక్కడ జపం అంతర్గతంగా మారుతుంది. ఈ ప్రక్రియలో మంత్ర ధ్వని వ్యక్తి  మనస్సును, ఆపై సూక్ష్మ చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. కాబట్టి జపం మొదలు పెట్టాలని అనుకునేవారు పైన చెప్పుకున్న పద్దతిని అనుసరించడం మంచిది.

                                *రూపశ్రీ.