పక్షాల సమయంలో పిల్లలు జన్మిస్తే ఏమైనా దోషం ఉంటుందా!

 

పక్షాల సమయంలో పిల్లలు జన్మిస్తే ఏమైనా దోషం ఉంటుందా!

భాద్రపద మాసంలో భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల కాలాన్ని పక్షాలు అని అంటారు.  ఈ పక్షాలలో ఎలాంటి శుభకార్యాలు జరగవు,  ఏ విధమైన కొత్త పనులు మొదలుపెట్టరు. ఈ పక్షాలలో పితృదేవతలు అయిన మరణించిన పెద్దలకు పిండ ప్రదానం, తర్ణణాలు, శ్రాద్ద కర్మలు చేస్తుంటారు.  అయితే  ఈ కాలంలో శిశువు పుట్టడం శుభప్రదమేనా? ఈ కాలంలో జన్మించే శిశువులకు ఏదైనా దోషం ఉంటుందా? ఈ రోజుల్లో పుట్టే శిశువు భవిష్యత్తు ఏమిటి? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

పితృ పక్షంలో జన్మించిన పిల్లలు ఏ విధంగానూ అశుభకరం కాదు. బదులుగా వారు కుటుంబానికి మంచిని తెస్తారు. పక్షాల కాలంలో జన్మించే పిల్లలు పూర్వీకుల ప్రత్యేక ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడతారట. అలాంటి పిల్లలు పూర్వీకుల పునర్జన్మ అని నమ్ముతారు. వారు కుటుంబానికి కొత్త ఆనందాన్ని తెస్తారు.  వారి భవిష్యత్ రంగాలలో మంచి పేరు సంపాదిస్తారని  అంటున్నారు.

పితృపక్షాలలో జన్మించే పిల్లల స్వభావం..

పితృ పక్షంలో జన్మించిన పిల్లలు ఉల్లాసమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు సృజనాత్మక ఆలోచనలను,  కుటుంబంతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉంటారు.  సానుకూల ఆలోచన,  సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు.  తరచుగా చిన్న వయస్సులోనే విజయం సాధిస్తారు.  కష్టపడి పనిచేయడం ద్వారా తమను తాము స్థిరపరచుకుంటారట.

చంద్ర స్థానం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం పితృ పక్షంలో జన్మించిన పిల్లల జాతకాలలో తరచుగా చంద్రుడు బలహీనంగా ఉంటాడు. దీనిని సకాలంలో పరిష్కరించకపోతే వారు మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చంద్రుడిని బలోపేతం చేయడానికి చంద్ర మంత్రాన్ని జపించడం, శివుడిని పూజించడం, సోమవారాల్లో ఉపవాసం ఉండటం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం వంటి కొన్ని చర్యలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇవి  జీవితానికి సమతుల్యత,  మానసిక శాంతిని తీసుకురావడానికి సహాయపడతాయి.


                         *రూపశ్రీ.