Read more!

అమ్మవారికి ధూపదీపాలు

 

దైవారాధనలో ధూపదీపాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఏ పూజ అయినా మొదట వాటితోనే మొదలవుతుంది. అమ్మవారి పూజకు సమాయత్తం అయినప్పుడు ముందుగా

ఓం ఆర్ద్రాం యః కారిణీ |

యష్టీం సువర్ణాం హేమమాలినీం ||

సూర్యాం హిరణ్మయీం |

లక్ష్మీం జాతవేదో మమావహ ||

అనే మంత్రాన్ని జపించాలి.

తర్వాత వనస్పతి రసైర్దివ్యైర్ |

గంధాద్ధ్యైహ్ సుమనొహరైహ్ ||

కపిలాఘ్రుత సంయుక్తో |

ధూపోయం ప్రతిగృహ్యతాం ||

అనే శ్లోకాన్ని స్మరించి అగరొత్తులు వెలిగించి అమ్మవారికి భక్తిగా చూపి, మూడుసార్లు తిప్పి స్టాండులో గుచ్చాలి.

గణచ్చక్షు స్వరూపంచ |

ప్రాణ రక్షణ కారకం ||

ప్రదీప్తం శుద్ధ రూపంచ |

గృహ్యతాం పరమేశ్వరీ ||

అనే శ్లోకాన్ని పఠిస్తూ దీపం వెలిగించి "దీపం దర్శయామి" అనుకుంటూ నమస్కరించాలి.