Read more!

English | Telugu

మహేంద్రకి చక్రపాణి నిజం చెప్పనున్నాడా!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -672 లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో... రిషీతో దేవయాని మాట్లాడి వెళ్ళిపోతుంది. 

రిషి మళ్ళీ కాలేజీకి వస్తున్నాడు సంతోషంగా ఉందని జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటారు. అక్కడే ఉన్న ధరణి "పెద్ద అత్తయ్య గారు వెళ్లి వచ్చాక రిషిలో మార్పు వచ్చింది" అని అంటుంది. అది విని ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసిందని మహేంద్ర అంటాడు. "ఎప్పుడూ రిషి, వసుధారలు విడిపోవాలని అనుకుంటుంది. అంతా ఆవిడ అనుకున్నట్టే జరిగింది" అని దేవయాని గురించి జగతి అంటుంది. ఇంతలోనే పెద్ద అత్తయ్య గారు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే సంతోషంగా ఉంటుంది అని ధరణి అనగా, నాక్కూడా అలాగే అనిపిస్తుంది అని మహేంద్ర అంటాడు. 

ఇంతలోనే మహేంద్ర ఇంటికి చక్రపాణి వస్తాడు. జరిగిందంతా చెప్పడానికి వస్తాడు. దాంతో ఎందుకు వచ్చావ్ అని మహేంద్ర కోపంగా అంటాడు. చక్రపాణి అన్న మాటలు గుర్తు చేస్తుంది జగతి. "నన్ను ఆ రోజు అన్ని మాటలు అన్నారు.. దయచేసి వెళ్ళండి.. మీలాగా మాట్లాడలేం.. మాకు సభ్యత సంస్కారం ఉన్నాయి" అని అంటుంది.

అప్పుడే వసుధార వచ్చి చక్రపాణిని చెప్పకుండా ఆపుతుంది. "వసుధార గారు... మీరు వెళ్ళండి ఇక్కడి నుండి వెళ్ళండి. మీకు నమస్కారం చేస్తున్న వెళ్ళండి" అని జగతి అంటుంది. చక్రపాణి, వసుధారలను అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.