Read more!

English | Telugu

ఇంటికొచ్చిన వసుధారని చూసి షాక్ అయిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -708 లో.. వసుధారని అత్తారింట్లో వదిలేసి వస్తాడు చక్రపాణి. ఆ తర్వాత వసుధార తులసి చెట్టుకు పూజా చేస్తుండగా.. పైనుంచి రిషి చూసి.. ఈ వసుధార ఏంటో ఎప్పుడు నా ముందే ఉన్నట్లు భ్రమ పడుతున్నానని అనుకుంటుంటాడు. ఆ తర్వాత పూజ గదిలో నుండి వస్తున్న వసుధారని చూసి.. తను ఏంటి ఇక్కడ! అని అనుకొని.. నువ్వు ఏంటి ఇక్కడ? అని రిషి అడుగుతాడు. ఇక్కడే ఉండిపోవడానికి వచ్చేసాను సర్ అని వసుధార చెప్పడంతో ఆశ్చర్యపోతాడు.

ఆ తర్వాత దేవయాని వచ్చి.. చూడు రిషి నువ్వు మీడియా ముందు నా భార్య అని చెప్పడంతో.. అదే మాటను పట్టుకొని ఇంట్లోకి వచ్చేసిందంటూ చెప్తుంది. వసుధార నా రూమ్ లోకి రా అని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు. ఇక వసుధార గదిలోకి వెళ్ళగానే.. "నువ్వు చేస్తుందేంటి వసుధార. ఇక్కడికి ఎందుకు వచ్చావ్" అని రిషి అడుగుతాడు. మీరు ప్రపంచానికి ఒక నిజం చెప్పారు. దాన్ని అబద్దం చేయకూడదని వచ్చేసాను సర్ అని వసుధార అంటుంది. "నువ్వు చేస్తుంది నీకైనా అర్థమౌతుందా వసుధార.. నువ్వు ఇక్కడ నుండి వెళ్లపో.. నేను ఆలోచించుకోవాలి" అని రిషి అనగానే సరేనని అక్కడ నుండి వచ్చేస్తుంది వసుధార.

ఆ తర్వాత జగతి దగ్గరకి రిషి వస్తాడు. వసుధార చేసింది మీరు సమర్థిస్తున్నారా మేడమ్ రిషి అడుగుతాడు. "నేను ఒక మాట చెప్పాను. నువ్వు మీడియా ముందు ఒప్పుకున్నావ్.. దానినే వసు చేస్తోంది. అంతకు మించి ఏం చెప్పలేను" అని జగతి అంటుంది. ఇంట్లోనే రిషిని పిలవకుండా మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధార, జగతి, మహేంద్ర, ఫణీంద్ర మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి రిషి వచ్చి.. నన్ను పిలవకుండానే మీరు మాట్లాడుకుంటున్నారా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.