English | Telugu

యాక్ట‌ర్లూ అంత ఓవరాక్షన్ వ‌ద్దు! వైర‌ల్ అయిన టీవీ న‌టి పోస్ట్‌!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అందరూ వ్యాక్సిన్ కోసం కోవిడ్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు టీకా తీసుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఎలాంటి ప్రాణహాని ఉండదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఇక్కడవరకు బాగానే ఉంది కానీ.. వ్యాక్సిన్ తీసుకుంటూ కొందరు సెలబ్రిటీలు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నామంటూ ప్రముఖ టీవీ నటి ఆషా నేగి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదని.. చాలా చిరాకుగా ఉంటుందంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందో చెప్పలేదు. కానీ ఈ పోస్ట్ పై స్పందించిన పలువురు నెటిజన్లు నటి అంకిత లోఖండే గురించని అభిప్రాయ పడుతున్నారు.

ఇటీవల అంకిత వ్యాక్సిన్ తీసుకుంటూ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె భయపడుతూ, దేవుడిని ప్రార్ధిస్తూ టీకా వేసుకుంది. దీంతో పాటు ఆమె మరొక సెటైర్ కూడా వేసింది. "ఇక అంతా అడుగుతున్నారు.. వీడియోగ్రాఫర్‌ ని మీరే తీసుకువెళ్తారా.. లేక ఆస్పత్రి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారా అని'' అంటూ పోస్ట్ చేసింది ఆషా.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.