Read more!

English | Telugu

సింగర్ ఐన శ్రద్దా...అలా చూస్తూ ఉండిపోయిన ఆది, శేఖర్ మాస్టర్

ఢీ-15 నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో టీం - బి నుంచి కంటెస్టెంట్ భవ్య వచ్చి  చేసిన డాన్స్ కి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయాడు. "సినిమా సాంగ్ చూస్తున్నట్టే ఉంది" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత పండు చేసిన డాన్స్ లో ఇన్ని షేడ్స్ ఉంటాయని తెలియలేదు అంటూ శ్రద్దా, శేఖర్ మాస్టర్ అని మంచి కామెంట్స్  ఇచ్చారు. తర్వాత పండుతో కలిసి శేఖర్ మాస్టర్ స్టేజి మీద డాన్స్ చేశారు. ఈ షోలో  కొరియోగ్రాఫర్స్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ థీమ్ లో  ఒక్కో కొరియోగ్రాఫర్ ఒక్కో రేంజ్ లో డాన్స్ ఇరగదీసారు. సోమేష్-సుదర్శన్ మాష్టర్ ఇద్దరూ చేసిన డాన్స్ కి స్టేజి ఊగిపోయింది. తర్వాత లేడీ కొరియోగ్రాఫర్ గ్రీష్మ కూడా ఒక రేంజ్ లో దసరా మూవీ డాన్స్ పెర్ఫార్మ్ చేసేసి పాజిటివ్ కామెంట్స్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ షోలో రాబోయే వారం శ్రద్దా హైలైట్ గా నిలవబోతోంది. "నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి" అనే సాంగ్ ని అద్భుతంగా పాడి వినిపించింది. ఆమె అలా పాడుతూ ఉంటే పక్కన ఉన్న శేఖర్ మాస్టర్ మరో వైపు హైపర్ ఆది అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు. "వ్వాహ్ సూపర్" అంటూ హోస్ట్ ప్రదీప్ ఆమెకు ఫుల్ మార్క్స్ ఇచ్చేసాడు. చెప్పాలంటే ఇది కేవలం డాన్స్ షో మాత్రమే కానీ మధ్యమధ్యలో జబర్దస్త్ స్కిట్స్ తో ఎంటర్టైన్ చేయడానికి హైపర్ ఆది, అప్పుడప్పుడు ఇలా పాడుతా తీయగా అంటూ కొంతమంది సాంగ్స్ పాడుతూ ఈ షోని త్రి ఇన్ వన్ షోగా మార్చేశారు. అలా ఈ వారం శ్రద్దా తనలోని సింగర్ ని బయటకు తీసుకువచ్చింది.