Read more!

English | Telugu

టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ ని కోల్పోవడం బాధాకరం!

‘ఢీ’ షో డాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. నిన్న మొన్నటి వరకు ఎంతో హ్యాపీగా నవ్వుతూ, నవ్విస్తున్న చైతన్య మాస్టర్ సడెన్ గా తీసుకున్న నిర్ణయంతో  కొరియోగ్రాఫర్స్ ఒకలాంటి నిశ్శబ్దంలో మునిగిపోయారు. అప్పుల కారణంగా  మృతి చెందిన చైతన్యకు ‘ఢీ’ టీమ్ మొత్తం  సంతాపం తెలిపింది. చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

‘ఢీ’ చూసే ప్రతీఒక్కరికీ చైతన్య మాస్టర్ తెలుసు. ఎందుకంటే ఎంత కష్టమైన డాన్స్ నైనా ఫన్నీ స్టెప్స్ జోడించి చాలా సింప్లిఫై చేసి ఇలా కూడా చేయొచ్చా అనిపించేలా డాన్స్ ఫెర్ఫార్మ్ చేయడంలో చైతన్య మాస్టర్ చాలా ఎక్స్ పర్ట్. ఈ విషయంపై  శేఖర్ మాస్టర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడు సరదాగా ఉండే చైతన్య సడన్ గా ప్రాణం తీసుకోవడం ఏమిటో అర్ధం కావడం లేదు అన్నారు  శేఖర్ మాష్టర్. ‘నీ లాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ మరణ వార్త విన్నప్పుడు నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. నీ ముఖంపై  విరిసే ఆ  చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం చైతన్య’ అని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టాలో రాసుకున్నారు. శేఖర్ మాస్టర్ తో పాటు శ్రద్ధాదాస్, రష్మీ, ఆది, ఢీ టీమ్ మొత్తం  చైతన్య మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇలా చావు పరిష్కారం కాదు కదా అంటూ నెటిజన్స్ కూడా బాధపడుతూనే కామెంట్స్ పెడుతున్నారు.