English | Telugu

15 ఇయర్స్ అయ్యిందా పెళ్ళై.. డాక్టర్ బాబుని ఆడుకున్న రవితేజ!

కొత్త ఏడాది వచ్చిందంటే చాలు సంక్రాంతి కూడా వచ్చేసినట్టే. సంక్రాంతి వస్తుందంటే చాలు బుల్లితెర మొత్తం కొత్త కొత్త షోస్, ఈవెంట్స్ తో కళకళలాడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈటీవీలో "సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" టైటిల్ తో ఒక ఎపిసోడ్ రాబోతోంది. యాంకర్ సుమ ఈ షోని నిర్వహించబోతున్నారు. "ఈటీవీలో ఈ పండగ మీ ఇంటి పండగలా ఉండబోతోంది. పందెం కోళ్ల లాంటి పవర్ఫుల్ పెర్ఫార్మెన్సులతో ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" అంటూ చెప్పారు.

ఇందులో ఆది ఫైర్ స్టార్మ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ మూవీ జానీలో సాంగ్ ప్లే అవుతుంటే ఆయన లేటెస్ట్ మూవీ ఓజిలోని వాషి యో వాషి అంటూ డైలాగ్ చెప్పేసరికి నాగబాబు కూడా పగలబడి నవ్వేశారు.

తర్వాత మాస్ మహారాజ రవితేజ వచ్చారు. "భార్యను ఇంప్రెస్ చేయడానికి భర్త ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తే బాగుంటుంది" అంటూ కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల రవితేజను అడిగాడు. "ఎన్నాళ్ళయింది పెళ్ళై నీకు" అని రవితేజ అడిగారు. 15 ఇయర్స్ అని చెప్పాడు నిరుపమ్. " 15 ఇయర్స్ అయ్యిందా. ఇంకా గిఫ్ట్ ల గురించి మాట్లాడుతున్నాడేమిటి ?" అంటూ రివర్స్ లో అడిగేసరికి అక్కడే ఉన్న అనిల్ రావిపూడి "అంతేగా అంతేగా" అంటూ ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇక ఈ ప్రోగ్రాం సంక్రాంతి రోజు ఉదయం 10 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.