English | Telugu

Sanjana Fires On Emanual: భరణి అవుట్ ఆఫ్ ది రేస్.. ఇమ్మాన్యుయేల్ పై సంజన ఫైర్!

బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే కి ఇంకా ఒక్క వారమే టైమ్ ఉంది. హౌస్ లో టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. లీడర్ బోర్డుపై లీస్ట్ లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా టాస్క్ నుండి తొలగిపోతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో లీడర్ బోర్డుపై లీస్ట్ లో భరణి ఉన్నాడు. ఇక నామినేషన్ నుండి సేవ్ అయ్యే ప్రక్రియ నుండి తొలగిపోయాడు. తన దగ్గరున్న పాయింట్స్ లో సగం ఎవరికైనా ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు.

భరణి దగ్గరికి సంజన వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. నాకు పాయింట్స్ చాలా అవసరమని అడుగుతుంది. నేను మాట ఇవ్వలేను ఆలోచించుకోవాలని భరణి చెప్తాడు. ఆ తర్వాత తన పాయింట్స్ అన్ని తనూజకి ఇస్తున్నానని చెప్పి భరణి ఎమోషనల్ అవుతాడు. ఎందుకు ఏడుస్తున్నారని తనూజ అడుగుతుంది. ఏం లేదని భరణి అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. అందులో స్కోర్ బోర్డుపై మిగిలిన ముగ్గురు అయిన ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన ఆడుతారు. వాటర్ లో ఉన్న షేప్స్ తాళం తీసి టేబుల్ పై సెట్ చెయ్యాలి.. అలా బజర్ మోగేసరికి ఎవరివి ఉంటాయో వాళ్ళే విన్ అని బిగ్ బాస్ చెప్తాడు. అందులో ముగ్గురు ఒకరి షేప్స్ ఒకరు టేబుల్ పై నుండి తీసి బయటకు విసిరేస్తారు.. అలా ముగ్గురు ఒకరికొకరు తోసుకుంటూ గేమ్ ఆడుతారు. తనూజ,ఇమ్మాన్యుయేల్ ని పట్టుకొని ఆపుతుంది. మనం మనం కొట్టుకుంటే వేరేవాళ్ళు ఆ షేప్స్ పెట్టుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విన్ అవుతాడు‌ సెకెండ్ సంజన ఉంటుంది. తనూజ పెట్టిన షేప్స్ అన్ని వాళ్ళు తీసేసారు కాబట్టి తనూజకి ఈ టాస్క్ లో పాయింట్స్ రాలేదు.

టాస్క్ తర్వాత ఇమ్మాన్యుయేల్ పై సంజన గట్టిగా అరుస్తుంది. నాకు ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు.. మీరు కలిసి గేమ్ ఆడారు.. మనం మనం ఆపుకుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారన్నావ్ అంటే నేనే కదా అని సంజన ఏడుస్తుంది. నాకు ఎవరు లేరు.. ప్రతీసారీ అందరికి నేనే టార్గెట్ అని ఏడుస్తుంది. మీరు చూసేవాళ్ళకి ఏం పొట్రే చేద్దామనుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. మరొకవైపు నా షేప్స్ అన్ని తీసి ఫస్ట్ వాటర్ లో నువ్వే వేసావని ఇమ్మాన్యుయేల్ తో తనూజ గొడవ పడుతుంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.