English | Telugu

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.

అది చూసి రుద్ర షాక్ అవుతాడు. నన్ను మోసం చేసావ్ గంగ.. ఆ రోజు ఫొటోస్ తీసి నువ్వే సోషల్ మీడియాలో పెట్టావ్ లేదంటే ఇది ఇక్కడ ఎందుకు ఉంటుందని రుద్ర అంటాడు. అసలు అదేంటో కూడా నాకు తెలియదని గంగ అంటుంది. ఇంట్లో అందరు వచ్చి.. ఏంటి గొడవ అంటారు. నేను గంగ కెరీర్ కోసం తనని పెళ్లి చెసుకున్నాను కానీ ఇంత మోసం చేసిందని తెలిసాక ఇక నాకు అవసరం లేదు.. నువ్వు ఇక్కడే ఉండిపోమని చెప్పి రుద్ర వెళ్లిపోతాడు. దాంతో లక్ష్మి కిందపడిపోతుంది. తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంటే.. రుద్ర చూసి అసలు గంగ వాళ్ల అమ్మకి ఏమైంది.. వద్దని అనుకుని వచ్చాను.. ఇప్పుడు వెళ్తే బాగోదని రుద్ర అనుకుంటాడు. ప్రాబ్లమ్ గంగతో కానీ వాళ్ల అమ్మతో కాదు కదా అని మళ్ళీ అనుకుంటాడు. లక్ష్మీకి హాస్పిటల్ ఖర్చు ముప్పై వేయిలు అవుతుందని డాక్టర్ చెప్తాడు. అప్పుడే రుద్ర వచ్చి పే చేసి వెళ్తాడు. మీ మధ్యలో ఏం గొడవ అయిందో తెలియదు గానీ మీరు మళ్ళీ కలవాలని గంగతో శ్రీను అంటాడు. కలవాలంటే నేను తప్పు చెయ్యలేదని నిరూపించాలని గంగ అంటుంది.

మరొకవైపు ఇషిక, వీరులకి పారు ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తుంది. ఇక గంగని రుద్ర ఎప్పటికి క్షమించడని పారు చెప్పగానే మంచి ప్లాన్ చేసావని పారుని ఆ ఇద్దరు పొగుడుతారు. తరువాయి భాగంలో రుద్ర ఒక్కడే ఇంటికి వస్తాడు. ఏమైందని పెద్దసారు అడుగగా రుద్ర జరిగింది చెప్తాడు. శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.