Read more!

English | Telugu

ఆంటీ అన్నందుకు ఫైన్ వేసిన రోహిణి...



శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఇప్పుడు స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చారు. పిల్లలంతా అమ్మమ్మలు, నానమ్మల ఇళ్లకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంకొంతమందైతే ట్రిప్స్ కి, టూర్స్ కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక బుల్లితెర మీద కూడా జబర్దస్త్ లో అలాగే సీరియల్స్ లో నటించే చిన్నారులంతా సమ్మర్ ట్రిప్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చారు. ఇక్కడ వాళ్ళు ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు.

అలాగే కొరియోగ్రాఫర్ పండు రష్మీ పుట్టిన రోజు సందర్భంగా మంచి డాన్స్ చేసి చూపించాడు. మరి ఒక అభిమానిగా రష్మీకి నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావ్ అని ఆది అడిగేసరికి పండు  ఒక గిఫ్ట్ ని కూడా ప్రెజంట్ చేసాడు. దాన్ని తెరిచి చూసేసరికి రష్మీ ఏడ్చేసింది. ఇంతకూ ఆ గిఫ్ట్ ఏంటి అంటే రీసెంట్ గా చనిపోయిన తన చుట్కి కుక్కపిల్లతో రష్మీ లాస్ట్ మినిట్ లో తీసి పోస్ట్ చేసుకున్న ఫోటోని లామినేషన్ చేసి ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి ఏడ్చేసింది. రాత్రి పూట షూటింగ్స్ నుంచి ఇంటికి వెళ్ళాక అది లేదు అని తెలుసుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చుట్కి అంటే చాలా ఇష్టం అని చెప్పింది రష్మీ. ఇక ఆమె ఏడుస్తుండేసరికి ఇంద్రజ వచ్చి ఓదార్చింది. అలాగే కొంతమంది పిల్లలు వచ్చి మంచి సాంగ్స్ పాడి వినిపించారు. అలాగే కొంతమంది కరాటే స్టెప్స్ చేసి చూపించారు. ఇందులో రౌడీ రోహిణి బుడగలు అమ్మే అమ్మాయిగా నటించింది. ఐతే ఒక చిన్నారి వచ్చి "ఆంటీ నాకు డాల్ కావాలి" అనేసరికి "250 " అని చెప్పింది రోహిణి. "50 రూపాయలు అన్నావ్ కదా" అన్నాడు ఆది. "బొమ్మ యాభయ్యే..ఈ పిల్ల ఆంటీ అన్నందుకు 200 " అని కౌంటర్ ఇచ్చింది. "అంటే 200 లు ఇచ్చి ఏమన్నా తిట్టొచ్చా  ఇదిగో తీసుకో అని ఇచ్చి డబ్బులు ఇచ్చి ఎద్దులా పెరిగావ్" అని తిట్టేసాడు ఆది.