Read more!

English | Telugu

రీతుచౌదరికి ఇష్టమైనవి అవేనంట.. మొత్తం చెప్పేసిందిగా!

నీ ఏజ్ ఎంత? నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నువ్వు ఉండే ప్లేస్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు ఎక్కడో చేసినట్టుగా విన్నట్టుగా అనిపిస్తున్నాయా.. ఎస్ విన్నాం.. ప్రతీ స్టూడెంట్ తన స్కూల్ లైఫ్ లో స్లామ్ బుక్ లో రాస్తాడు. అలా రాసి తన ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నారా .. ఇన్ స్ట్రాగ్రామ్ లో సెలెబ్రిటీలంతా ఓ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.

అందరు కొత్తగా మొదలైన ట్రెండ్ ని ఫాలో అవుతూ తమ స్టేటస్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు. అసలేం ఉందంటే.. ఏజ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్? హోమ్ టౌన్ ఇలా పది వరకు ప్రశ్నలు ఇన్ స్ట్రాగ్రామ్ లో వస్తాయి. వాటికి మన బుల్లితెర, వెండితెర నటీనటులు సమాధానాలు రాసి తమ‌ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తున్నారు. తాజాగా రీతు చౌదరి ట్రెండ్ ని ఫాలో అవుతూ ఈ పోస్ట్ ని షేర్ చేసింది. ఇందులో తన వయసు ఇరవై అయిదు అని, చివరగా తను నెయ్యి ప్లస్ హాట్ వాటర్ తాగానని చెప్పింది. లాస్ట్ టైమ్ ఎప్పుడు ఎడ్చావనే క్వశ్చన్ కు నిన్న కాక మొన్నే ఏడ్చానను రీతు అంది‌. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఒక అన్నయ్య అని చెప్పింది. చివరగా విన్న పాటేంటనే క్వశ్చన్ కి.. యానిమల్ సినిమాలోని " ఎవరెవరో "..పాటని విన్నట్టుగా రీతు అంది. ఏ రాశి అనగా.. మీనరాశి అని చెప్పింది. హోమ్ టౌన్ అనే ప్రశ్నకు హైదరాబాద్ అని సమాధానమిచ్చింది రీతు. ఇలా చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో సాగుతున్న ఈ నయా ట్రెండింగ్ ని సెలెబ్రిటీలంతా ఫాలో అవుతున్నారు.

రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. మరి ఇన్ స్టాగ్రామ్ లో మొదలైన ఈ కొత్త ట్రెండ్ మీకు తెలుసా? మరి మీ అభిరుచులేంటో పంచుకోండి.