English | Telugu

'మహానటి'గా వంటలక్క.. నెటిజన్ల మీమ్స్!

దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ఒక కంటితో కన్నీళ్లు' సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. గ్లిజరిన్ వాడకుండా ఎడమ కంటి నుండి షాట్ టైమ్ కి రెండు కన్నీళ్ల బొట్లు రావాలి. ఆ సీన్ లో సావిత్రి నటన చూసిన డైరెక్ట‌ర్ కేవీ రెడ్డి మైమరిచిపోతారు. అయితే ఇప్పుడు ఇదే మాదిరిగా ఒక కంటిలో నుండి కన్నీళ్లు రప్పించి బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది వంటలక్క.

'కార్తీక దీపం' సీరియల్ లో వంటలక్కకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. సీన్ పండాలంటే వంటలక్క ఉండాల్సిందేనని అంటారు అభిమానులు. తన కనురెప్పలతో బెదిరించడమే కాకుండా.. హావభావాలతో ప్రేక్షకుల కళ్లనిండా నీళ్లు తెప్పించేస్తుంది వంటలక్క. గత వారం రోజులుగా ఈ సీరియల్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. వంటలక్క చనిపోతుందనే విషయం సీరియల్ లో హాట్ టాపిక్ గా మారింది. వంటలక్క తన గతాన్ని, భవిష్యత్తుని తలచుకుంటూ బాధపడుతున్న సమయంలో డాక్టర్ బాబు ధైర్యం చెబుతాడు. అతడి మాటలకు ఓ నవ్వు నవ్వి దీనంగా చూస్తూ అందరినీ ఏడిపించేసింది.

ఆ సందర్భంలో ఓ కాంతిలో విషాదం, మరో కాంతిలో కన్నీరు అన్నట్లుగా ఎడమ కంటి నుండి కన్నీళ్లను విడిచి 'మహానటి' సావిత్రి నటనను గుర్తుచేసిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీన్ లో వంటలక్క ఎక్స్‌ప్రెష‌న్స్‌ను క్యాప్చర్ చేసి వాటిపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.