English | Telugu

Podarillu: మూడు రోజుల్లో భూషణ్ తో పెళ్లి.. చక్రితో కలిసి మహా ఏం చేయనుంది?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -17 లో.. చక్రికి మాధవ ఫోన్ చేస్తాడు. ఇంకా ఎంతసేపురా అతన్ని వదిలెయ్యమంటావా అని మాధవ చెప్పగానే చక్రి టైమ్ చూసుకొని సరే వదిలెయ్యండి అని చెప్తాడు.

ఆ తర్వాత మహా దగ్గరికి చక్రి వెళ్తాడు. నువ్వు ఇలాగా కిడ్నాప్ లు చేస్తుంటావా అని అడుగుతుంది. లేదండి మీరు ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నారని చేసాను.. నువ్వు ఇక్కడే ఉంటే మరి కిడ్నాప్ ఎవరు చేశారని మహా అడుగుతుంది. మా ఫ్యామిలీని మొత్తం ఇందులో ఇన్వాల్వ్ చేసానని చక్రి అనగానే అవునా చాలా థాంక్స్ అని మహా చెప్తుంది.

మరొకవైపు భూషణ్ ని రోడ్డుపై వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ప్రతాప్ ఇంటికి వెళ్తాడు భూషణ్. అతడిని చూసి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరో పెళ్లి ఆపాలని చూస్తున్నట్లనిపిస్తుంది. కరెక్ట్ పెళ్లి టైమ్ కి తీసుకొని పెళ్లి టైమ్ అవ్వగానే వదిలేసారని భూషణ్ చెప్తాడు.

ఆ తర్వాత చక్రికి మహా భోజనం తీసుకొని వచ్చి ఇస్తుంది. చక్రి భోజనం చేస్తుంటే మహా తన ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకుంటుంది. లోపల భూషణ్ వచ్చిన విషయం వాళ్లిద్దరికి తెలియదు.

ఎవరో పెళ్లి ఆపాలని చూస్తున్నారని అంటున్నావ్ కదా.. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు పెళ్లి మూడు రోజుల్లో జరిపిద్దామని ప్రతాప్ చెప్పగానే అందరు సరే అనుకుంటారు.

మరొకవైపు చక్రి తన ఫ్యామిలీ గురించి మహాకి గొప్పగా చెప్తాడు. మహా లోపలికి వెళ్తుంటే భూషణ్ బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.