Read more!

English | Telugu

షకలక శంకర్ రీ-ఎంట్రీ..టీంలీడర్ గా ఎంట్రీ ఇచ్చిన పటాస్ ప్రవీణ్

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. కానీ ఈ వారం ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉందంటూ పెద్ద డైలాగ్ చెప్పింది రష్మీ. ఆ మాట నిజమే అనిపిస్తోంది ఈ వారం ప్రోమో చూస్తే.  ప్రతీ వారం ఈ షోకి జడ్జిగా ఉన్న ఖుష్బూ ఈ వారం కనిపించలేదు. ఆమె ప్లేస్ లో సదా స్టైల్ గా వచ్చి కూర్చుంది. ఇకపోతే ఇందులో టీం లీడర్స్ కూడా మారినట్టు కనిపిస్తోంది. పటాస్ ప్రవీణ్ వస్తూనే "ఇన్నాళ్లు డైలాగులా కోసం, ప్రోమోల కోసం ఏడ్చామ్...మారాయ్..టీములు మారాయి...టీమ్ లీడర్ లు మారారు... టీం లీడర్ ప్రవీణ్ వచ్చాడని చెప్పండి" అంటూ తాను టీం లీడర్ ఐనట్టు ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చేసాడు. రీసెంట్ గానే ఇమ్మానుయేల్ కూడా టీం లీడర్ అయ్యాడు.

ఇక ఈ రాబోయే షోలో ఓల్డ్ కమెడియన్ షకలక శంకర్ కనిపించాడు. బులెట్ భాస్కర్ టీంలో కనిపించాడు. ఈ షోలో బులెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్స్ లో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని అవాక్కయ్యేలా చేశారు. రాకింగ్ రాకేష్ స్కిట్ లో కొత్త కొత్త చిన్నారులు కనిపించారు. ఐతే ఇందులో కెవ్వు కార్తిక్ టీం మాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి కొన్ని టీమ్స్ ని పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది.  ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ మాత్రం "ఖుష్బూ మేడం ఎక్కడా...శకలక శంకర్ బ్యాక్ కి వచ్చాడు." అని కామెంట్స్ పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మేకర్స్ ఓల్డ్ జబర్దస్త్ టీమ్ మెంబర్స్ ని నెమ్మదిగా వెనక్కి పిలిపించి షోని మరింత జోష్ గా మార్చుతారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ షో రేటింగ్ ఇప్పటికే చాలా వరకు పడిపోయింది. అదే ఓల్డ్ కమెడియన్స్ ని బ్యాక్ కి పిలిపిస్తే షో మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది..