English | Telugu

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తానంటున్న‌ డాక్టర్ బాబు!

మహిళా ప్రేక్షకుల్లోసినీ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ డాక్టర్ బాబుది. అదేనండీ... 'కార్తీక దీపం'లో డాక్టర్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుగా ప్రేక్షకులకు సుపరిచితుడైన నిరుపమ్ పరిటాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న నిరుపమ్, త్వరలో ఓటీటీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడాలని చూస్తున్నాడు.

కరోనా తరువాత ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటానికి ప్రేక్షకులు అలవాటుపడ్డారు. ఇంటి దగ్గర ఉన్నవాళ్లు ఖాళీ సమయంలో డిజిటల్ షోలు చూడటం మొదలుపెట్టారు. అందుకని, ఓటీటీలోకి డాక్టర్ బాబు రావాలని అనుకుంటున్నాడు.

"ప్రస్తుతానికి టీవీ ఇండస్ట్రీ బావున్నా... భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడంతా వెబ్ హవా నడుస్తోంది. సీరియళ్లు అంటే మహిళలకు మాత్రమే అనే ముద్ర పడింది. పైగా, యువతరం వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అందుకని, వెబ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. పరిస్థితులకు అనుకుణంగా చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగాలనేది నా అభిమతం" అని లేటెస్టుగా ఒక డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ చెప్పాడు.

సో... భవిష్యత్తులో డాక్టర్ బాబును ఓటీటీలో చూసే అవకాశం ఉందన్నమాట. అలాగే, మంచి అవకాశాలు వస్తే సినిమాల్లోనూ నటించాలని నిరుపమ్ పరిటాల చెబుతున్నాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.