English | Telugu

నా లైఫ్ ఫ్యామిలీకే అంకితం!

బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారింది. వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఫైనల్స్ వరకు వచ్చిన ఆమె రన్నరప్ గా నిలిచింది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను షేర్ చేస్తూ తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది.

రీసెంట్ గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఈ భామ ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై స్పందించింది. తను పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని చెబుతోంది ఈ బ్యూటీ. నిజానికి శ్రీముఖి గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉంది. కానీ అతడు తనకు పెళ్లైన విషయాన్ని చెప్పకుండా మోసం చేయడంతో ఆ రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశానని తెలిపింది. ఫ్యూచర్ లో కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెబుతోంది శ్రీముఖి.

అయితే మరో రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన చేయనని అంటోంది. ప్రస్తుతం తాను బిజీగా ఉండడం వలన ఇంట్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది. పెళ్లి తరువాత లైఫ్ మొత్తం ఫ్యామిలీకే అంకితం చేస్తానని అంటోంది. అయితే పెళ్లికి ముందు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని.. ఆ ఒక్కటి చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇన్నోసెంట్ గా ఉండాలని.. తనతో చనువుగా ఉండాలని మనసులో కోరికను బయటపెట్టింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.