Read more!

English | Telugu

ప్రియమైన అమ్మలతో ఆర్టిస్టులు....మదర్స్ డే స్పెషల్ ఈవెంట్

ఈటీవీ ప్రతీ స్పెషల్ ఈవెంట్ ని అస్సలు మిస్ కాకుండా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాబోయే వారం మదర్స్ డేని పురస్కరించుకుని "ప్రియమైన అమ్మకు" అనే స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి యాంకర్స్ గా మానస్, విష్ణుప్రియ వ్యవహరించారు. "విష్ణు ఈరోజు మదర్స్ డే కదా. నువ్వు అమ్మను ఎంత మిస్ అవుతున్నావో నాకు తెలుసు. అందుకే మన ఆర్టిస్ట్స్ అందరినీ వాళ్ళ ఫామిలీస్ తో పాటు ఇక్కడికి ఒక గెట్ టు గెదర్ లాగా నీకోసం అని ఆర్గనైజ్ చేసాను.. హ్యాపీ మదర్స్ డే విష్ణు" అని చెప్పాడు మానస్. బ్యాక్ గ్రౌండ్ లో విష్ణుప్రియ వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలను ప్లే చేసి చూపించారు. 

అలాగే ఈ ఈవెంట్ లో వర్ష, శ్రీవాణి, రాశి, సత్య, మధుప్రియ, హైపర్ ఆది, అంబటి అర్జున్, రాకింగ్ రాకేష్, అమరదీప్, రాంప్రసాద్, హిమజ, అన్నపూర్ణ,  ఇలా బుల్లితెర ఆర్టిస్టులంతా పార్టిసిపేట్ చేశారు. బులెట్ భాస్కర్ వాళ్ళ అమ్మ, నాన్న  ఈ షోకి వచ్చారు. "ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నా అందుకే నాకు కొడుకు పుట్టాడు" అని అంది. "మా అమ్మ ఇళ్లల్లో పాచి పని చేసి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది" అని శాంతిస్వరూప్ వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు. "ఎంత అడిగినా తిరిగి మా అమ్మ రాదు..అమ్మా ఐ లవ్ యు ..ఐ మిస్ యు " అంటూ విష్ణు స్టేజి మీద ఏడ్చేసింది. ఇక ఈ షో మే 14 వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కాబోతోంది. ఇందులో అంబటి అర్జున్ పుష్ప 2 లో అల్లు అర్జున్ వేసిన గెటప్ ని అలాగే దింపేసాడు. ఇక ఈ షో ఎలా ఉండబోతోంది. వాళ్ళ వాళ్ళ మదర్స్ తో ఉన్న రిలేషన్ గురించి ఎవరెవరు ఏం చెప్తారో చూద్దాం.