English | Telugu

కావాల‌ని చార్జింగ్ త‌క్కువ పెట్టుకుని లైవ్‌లోకి వ‌స్తున్న‌ మోనాల్!

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి తెలిసిందే. తరచూ తన ఫాలోవర్లతో చాట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అఖిల్ తో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. ఈ ఇద్దరికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యనే అఖిల్ ఓ వారం రోజుల పాటు సోషల్ మీడియాకి దూరమైతే దానికి కారణం మోనాల్ అంటూ కామెంట్స్ వినిపించాయి.

కానీ అఖిల్ తను సోషల్ మీడియా నుండి కావాలనే బ్రేక్ తీసుకున్నట్లు వివరించాడు. ఇక మోనాల్ రీసెంట్ గానే హైదరాబాద్ లో ఇల్లు కొని ఇక్కడకు షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం తన ఇంటికి సంబంధించిన పనులతో బిజీగా ఉంది. తాజాగా లైవ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ తెగ సందడి చేసింది. అయితే లైవ్ లోకి వచ్చిన కాసేపటికే తాను వెళ్లిపోతున్నానని మోనాల్ చెప్పింది.

తన బ్యాటరీ పది శాతానికి వచ్చిందని.. అభిమానులకు గుడ్ బై చెప్పింది. తాను లైవ్ లోకి వచ్చిన ప్రతీసారి ఇదే జరుగుతుందని మోనాల్ అనగా.. ఓ నెటిజన్ 'మరి అలా బ్యాటరీ అయిపోయే ముందు ఎందుకు లైవ్ లోకి వస్తున్నావ్' అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి మోనాల్ నవ్వుతూ.. 'అలా ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు లైవ్ లోకి వస్తే అదే రీజన్ చెప్పి త్వరగా లైవ్ లో నుండి వెళ్లిపోవచ్చు' అంటూ కౌంటర్ ఇచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.