Read more!

English | Telugu

మా జీవితాల గురించి వదిలేసి మీ పని మీరు చూసుకోండి...

మల్లి సీరియల్ తో ఎంతో ఆకట్టుకున్న బుల్లితెర నటుడు పవన్ సాయి.  చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఐతే పవన్ సాయి కొంతకాలం క్రితం తన భార్య  మధుమిత నుంచి డివోర్స్ తీసుకున్నాడు. అతనికి  బాబు కూడా ఉన్నాడు.  అయితే పవన్ సాయి తన భార్యతో విడిపోవడానికి ఓ నటితో ఉన్న ఎఫైరే కారణమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సీరియల్‌లో తనతో నటించే అమ్మాయితో పవన్ సాయి ఎఫైర్ పెట్టుకోవడం వల్లనే గొడవలు వచ్చి, విడాకులు తీసుకున్నారని అంటున్నారు. ఐతే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తుండడంతో తాజాగా పవన్ సాయి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.

"హలో..మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను..!!! కొన్ని వెబ్‌సైట్‌లలో, యూట్యూబ్‌లోని నా పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి చాలామంది  గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలుసుకున్నాను. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయనే సామెత గుర్తుంది కదా  మీకు.. ఇప్పుడు జరుగుతున్నది అదే. నేను- మధు ఇద్దరం మా పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. మా జీవితాలతో మేము చాల హ్యాపీగా ఉన్నాం. మేము ఒకరికొకరం సపోర్ట్ గానే ఉన్నాం. మీరంతా దయచేసి బాధపడకండి. మీరు మా నిర్ణయాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తారని అనుకుంటున్నాను... గమనిక : నా ప్రియమైన అందరికీ మీరంతా ఇతరుల జీవితాల గురించి ఆలోచించకుండా మీరు మీ జీవితాల గురించి ఆలోచించుకోండి. ఐతే మీ అందరి కడుపు నిండింది అనుకుంటాను.  మీరు ఇంకా ఏమైనా అడగాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను. అలా కాదు అని సోషల్ మీడియాలో ఏదైనా చెత్తను పోస్ట్ చేయాలనుకుంటే ఊరుకోను" అన్నట్టుగా ఒక మెసేజ్ ద్వారా ఎం చెప్పాలనుకున్నారో నెటిజన్స్ కి, ఫాన్స్ కి, తన హేటర్స్ అందరికీ చెప్పేసారు.